India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లాలో పర్యటనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం గొర్గల్ గ్రామ హెలిప్యాడ్ వద్ద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. మంత్రి వెంట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె బంధువులు, స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం చూస్తోందని NZB ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ విషయంలో తమకు నిర్దిష్టమైన సమాచారం ఉందని, అదే జరిగితే మరో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని ఆమె ‘X’ వేదికగా గురువారం హెచ్చరించారు. విధుల నుంచి తొలగించాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మీ కామెంట్?
ఉమ్మడి NZB జిల్లాలో శుక్రవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించనున్నారు. తొలుత కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు హెలీకాప్టర్లో నిజాంసాగర్కు చేరుకోనున్నారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు చేరుకుని అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లిన సీఎం రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, సింగరేణి బొగ్గు గనులు, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై వారితో సీఎం చర్చించారు. కలిసిన వారిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, పెర్కిట్ గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోని SBI ATM ఏడాదిగా మూసిఉంది. 2023 SEPలో దొంగలు ATMలో చోరీ చేసి రూ.12లక్షలు ఎత్తుకెళ్లడంతో అప్పటినుంచి అది మూతపడి ఉంది. మండలం చుట్టుపక్కల ATMలు లేకపోవడంతో నగదు విత్డ్రా చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్మల్ లేదా బాల్కొండ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు స్పందించి దాన్ని ఓపెన్ చేయాలని కోరారు.
నిజామాబాద్ నీలకంఠేశ్వర దేవాలయం సమీపంలో ఓ తాగుబోతు బుధవారం రాత్రి హల్చల్ చేశాడు. అక్కడి ఓ వైన్స్ ఎదుట రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. దీంతో నిజామాబాద్- ఆర్మూర్ ప్రధాన రూట్ లో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్ సైతం ట్రాఫిక్లో చిక్కుకు పోయింది.
బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి ప్రాంతంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ట్రాన్స్కో డీఈ ముక్త్యార్ హైమద్ మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు తమ బోరు మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏడీఈ నాగేష్ కుమార్, ఏఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.