Nizamabad

News August 13, 2024

NZB: దత్తత తీసుకున్న బాలుడికి చిత్రహింసలు..!

image

దత్తత తీసుకున్న ఓ పదేళ్ల బాలుడిని దారుణంగా హింసిస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని రాకాసిపేట్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ జంట ఏడేళ్ల క్రితం ఎండీ ఫరీదుద్దీన్‌ను దత్తత తీసుకున్నారు. కొన్ని రోజులుగా వారి ఇంటి నుంచి అరుపులు కేకలు వినిపిస్తుడంతో స్థానికులు ఇంటి తాళం పగులకొట్టి లోపలికి వెళ్లి బాలుడిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. తనను హింసిస్తూ ఇంట్లో పనులు చేయిస్తున్నారని బాలుడు ఆరోపించాడు.

News August 13, 2024

లంచం తీసుకున్న విద్యుత్ శాఖ AE ..సంవత్సరం జైలు శిక్ష

image

లంచం తీసుకున్న కేసులో NPDCL మాక్లూర్ AAE మచ్చ సదాశివకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి ACB కోర్టు సెకండ్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ మంగళవారం తీర్పు చెప్పారని ACB నిజామాబాద్ DSP తెలిపారు. 2008లో మదనపల్లిలో కొత్త ట్రాన్స్ ఫార్మర్, కనెక్షన్లను ఏర్పాటు కోసం సదాశివ 5 వేలు డిమాండ్ చేసి రూ.3 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

News August 13, 2024

NZB: ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏజెంట్లను నియమించనున్నట్లు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాలకు ఆర్మూర్-73968 89496, బోధన్- 90142 96638, నిజామాబాద్-1 91542 98727, నిజామాబాద్-2 73968 89496, బాన్సువాడ 91542 98729, కామారెడ్డి 91542 98729 సంప్రదించాలని సూచించారు.

News August 13, 2024

SRSP అప్‌డేట్: స్వల్పంగా పెరిగిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ ఫ్లో పెరిగింది. గడిచిన 24 గంటల్లో యావరేజ్‌గా 6,375 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వచ్చి చేరిందని, మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు 4,083 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80TMC)కు గాను ప్రస్తుతం 1080.90 అడుగుల (47.548TMC) నీరు నిల్వ ఉందని తెలిపారు.

News August 13, 2024

NZB: ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారుల సోదాలు

image

నిజామాబాద్ నగరంలోని కోటగిరి ఎస్సీ వసతి గృహంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వసతి గృహంలో తప్పుడు బిల్లులతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వసతి గృహంలో ఉన్న బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను పరిశీలించారు. రికార్డులు, బిల్లుల పరిశీలన కొనసాగుతోంది.

News August 13, 2024

రేపు చందూర్ మండలం బంద్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చందూర్ మండల కేంద్రంలో బుధవారం స్వచ్ఛందంగా బందును ప్రకటించుకున్నారు. హిందువులపై దాడులు ఆగే వరకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపడతామని గ్రామస్థులు పిలుపునిచ్చారు. సాయంత్రం కొవ్వత్తులతో యువత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News August 13, 2024

నేడు నిజామాబాద్ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

image

బంగ్లాదేశ్‌లో హిందూ ఆడబిడ్డల పైన హిందూ దేవాలయాలపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు శివాజీ నగర్ ఆర్ ఆర్‌ చౌచౌరస్తా నుంచి గాంధీ చౌక్ కొరకు ర్యాలీ ఉంటుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News August 13, 2024

NZB: ఎస్సీ వసతి గృహంలో ఏసీబీ దాడులు

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల బాలికల(ఎస్సీ) సంక్షేమ హాస్టల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు ఆకస్మికంగా చేశారు. ఎస్సీ వసతి గృహంలో తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వసతి గృహంలో ఏసీబీ అధికారులు వివిధ శాఖలతో జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ అధికారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్, తూనికల కొలతల అధికారులు ఉన్నారు.,

News August 13, 2024

బాన్సువాడ: సైబర్ మోసం.. రూ.1,32,000 పొగొట్టుకున్నాడు

image

ఉద్యోగం పేరిట ఓ యువకుడు సైబర్ వలలో చిక్కి రూ.1,30,200 పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో జరిగింది. తాడ్‌కోల్‌కు చెందిన విష్ణు అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డాటా ఎంట్రీ ఉద్యోగం వచ్చిందని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అనంతరం నష్టం జరిగిందని సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో రూ.1,30,200 పంపి మోసపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.

News August 13, 2024

నిజామాబాద్: 8 నెలల్లో 7 అత్యాచార కేసులు నమోదు

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలు అత్యాచార ఘటనల్లో ముగిసిపోతున్నాయి. బోధన్ నియోజకవర్గంలో 8 నెలల్లో మైనర్లపై పలు అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి. కాగా, పెద్దమనుషుల పంచాయతీలతో ఎన్నో కేసులు కనుమరుగు అవుతున్నాయి. పోలీసు స్టేషన్‌లో 8 నెలల్లో 7 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి.