Nizamabad

News March 7, 2025

నిజామాబాద్ CPగా సాయి చైతన్య 

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పి. సాయి చైతన్య నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనను నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఇక్కడ పనిచేసిన సీపీ కల్మేశ్వర్ 5 నెలల క్రితం హైదరాబాద్లో ట్రెయినింగ్ సెంటర్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఇన్ ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

News March 7, 2025

రాష్ట్రంలోనే టాప్ నిజామాబాద్ జిల్లా

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. గురువారం జిల్లాలోని మంచిప్పలో 40.8℃, తూంపల్లిలో 40.7℃ డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలు రాష్ట్రంలోనే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అటు వాతావరణ శాఖ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాలు మాత్రమే ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News March 7, 2025

కాచిగూడ-నిజామాబాద్‌ డెమూ రైలు రద్దు

image

కాచిగూడ-నిజామాబాద్‌ మధ్య నడిచే (77601/77602) డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్‌ సెక్షన్‌లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News March 7, 2025

NZB: పెళ్లిలో గొడవ.. వ్యక్తి మృతి

image

పెళ్లిలో గొడవ జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్‌ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ వివరాలు.. ఎల్లారెడ్డికి చెందిన రాములు(42) ముగ్దంపూర్ గ్రామంలో చుట్టాల ఇంటికి పెళ్ళికి వెళ్లాడు. పెళ్లి కూతురును తీసుకురావడానికి పంపకపోవడంతో గొడవ జరిగింది. మద్యం తాగి ఉన్న రాములు స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 7, 2025

NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లగుట్ట తండా దర్గా వద్ద గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ SHO ఆరీఫ్ తెలిపారు. దర్గా దగ్గర ఎలక్ట్రిక్ పోల్స్ పక్కన పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారన్నారు. 40-5౦ వయస్సున్న ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News March 7, 2025

NZB: PCPNDT టాస్క్ ఫోర్స్ బృందo తనిఖీలు

image

NZBలో PCPNDT టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు తనిఖీలు చేశారు. ఈ మేరకు గురువారం మెడికవర్, మనోరమ ఆసుపత్రులను ఆరుగురు సభ్యులతో కూడిన బృందం తనిఖీ చేసినట్లు DMHO డాక్టర్ రాజశ్రీ తెలిపారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ DMHO వద్ద నమోదు చేయించుకున్న స్కానింగ్ మిషన్లను రిజిస్టర్ అయిన డాక్టర్స్ మాత్రమే స్కానింగ్ చేయాలని ఆమె సూచించారు. ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

News March 6, 2025

NZB: 420 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 420 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 16,343 మంది విద్యార్థులకు 15,923 మంది పరీక్షలకు (97.4 శాతం) హాజరయ్యారని తెలిపారు. ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బీ సెంటర్‌లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా పట్టుకున్నారన్నారు.

News March 6, 2025

NZB: ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

image

డిచ్పల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి, పరీక్షల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్‌కు అవకాశం లేకుండా గట్టి నిఘాతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు.

News March 6, 2025

NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

News March 6, 2025

NZB: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

image

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.