Nizamabad

News December 3, 2024

సిరికొండ: పెళ్లి చేసుకుంటానని చెప్పి గల్ఫ్ పారిపోయాడు

image

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు గల్ఫ్ పారిపోయిన ఘటన సిరికొండలో చోటుచేసుకుంది. SI రామ్ వివరాల ప్రకారం.. ముషీర్‌నగర్‌కు చెందిన ఓ యువతి, అక్షిత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గతవారం గల్ఫ్‌కు పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు యువకుడికి సహకరించిన తల్లి మల్లవ్వ, అన్న అజయ్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

News December 3, 2024

NZB: హాస్టల్‌లో విద్యార్థిని సూసైడ్

image

HYD బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ ప్రగతినగర్‌లోని ఓ హాస్టల్‌లో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా మోపాల్‌కు చెందిన ప్రగన్య(18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కాగా సోమవారం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News December 3, 2024

NZB: డిసెంబర్ 4 నుంచి జాగృతి ఉమ్మడి జిల్లాల సమావేశాలు

image

డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లా వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం జాగృతి నాయకులు షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన వరుసగా సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 4న వరంగల్ మరియు, నిజామాబాద్ 5న కరీంనగర్ & నల్గొండ, 6న రంగారెడ్డి మరియు ఆదిలాబాద్, 7న హైదరాబాద్ మరియు ఖమ్మం, 8న మెదక్ మరియు మహబూబ్‌నగర్ లో జరగనున్నాయి

News December 2, 2024

KMR: వాయు కాలుష్య దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

image

వాయు కాలుష్య దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాల్య వివాహాల రహిత భారత్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News December 2, 2024

కామారెడ్డి: మద్యం తాగించి మరీ కొడుకును చంపేశాడు!

image

కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివారు బ్రిడ్జి వద్ద రాజు(25) అనే యువకుడిని అతడి తండ్రి సాయిలు <<14765998>>హత్య<<>> చేయించిన విషయం తెలిసిందే. సీఐ తెలిపిన వివరాలు.. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లను రాజు నిత్యం వేధించేవాడు. విసిగిపోయిన సాయిలు.. అనిల్‌‌తో కలిసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా రాజుకు మద్యం తాగించి బైక్‌పై బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించారు.

News December 2, 2024

కామారెడ్డి: కొడుకును చంపిన తండ్రి 

image

కొడుకును కన్న తండ్రే కడతేర్చిన ఘటన KMRలో చోటుచేసుకుంది. గోసంగి కాలనీకి చెందిన సాయిలు, సాయవ్వల కుమారుడు రాజు మద్యానికి బానిసయ్యి కుటుంబీకులను వేధించేవాడు. వేధింపులు తాళలేక సాయిలు పట్టణానికి చెందిన అనిల్‌తో కలిసి పథకం ప్రకారం నవంబర్ 29న రాజును ఉగ్రవాయి శివారులోకి తీసుకెళ్లి చంపేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వారిద్దరిని నిందితులుగా గుర్తించి ఆదివారం అరెస్ట్ చేసినట్లు CI రామన్ వెల్లడించారు.

News December 1, 2024

ఆర్మూర్: వ్యవసాయ పనులకు వెళ్తూ మృత్యువాత

image

వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యువాత పడిన విషాద ఘటన ఇది. పెర్కిట్‌కు చెందిన శ్రీరాం అశోక్ (55) ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News December 1, 2024

NZB: హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

image

నిజామాబాద్‌లో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. సంతోష్ నగర్‌కు చెందిన వాస్టర్ రాజేశ్ ఈ నెల 25న ముస్తాయిద్ పుర చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు. విచారణ చేపట్టిన పోలీసులు రాజు రాంజీ బీమాల్వాడి, షేక్ సికందర్ మద్యం మత్తులో రాజేశ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. కాగా వారిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు SHO వెల్లడించారు.

News December 1, 2024

నేడు కామారెడ్డిలో పర్యటించనున్న ఎంపీ, షబ్బీర్ అలీ

image

కామారెడ్డిలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్  పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంగాధర్ తెలిపారు. మొదటగా పట్టణంలోని జయశంకర్ కాలనీలో ఓంకారేశ్వర ఆలయంలో నిర్వహించే పూజలలో పాల్గొంటారని, అనంతరం ఎస్సీ, ఎస్టీ టీచర్స్ యూనియన్ మహాసభలకు హాజరవుతారని పేర్కొన్నారు.

News November 30, 2024

NZB: 9 నెలల్లో 50 వేల GOVT ఉద్యోగాలిచ్చాం: టీపీసీసీ చీఫ్

image

తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వంలో రైతులు కన్నీరు పెడుతుంటే.. KCR ఫామ్ హౌస్‌లో పన్నీరు తిన్నాడని మండిపడ్డారు. పదేళ్లలో KCR 50 వేల GOVT ఉద్యోగాలిస్తే తాము కేవలం 9 నెలల్లో 50 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే పని చేస్తుందని చెప్పారు.