Nizamabad

News March 12, 2025

NZB: ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

image

నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు చేపడుతోంది. ప్రధాన గేటుకు తాళం వేసి సోదాలు చేస్తున్నారు. పలువురు ఏజెంట్లు లోపల ఉండగా ఈ దాడి జరిగింది. కాగా ఈ కార్యాలయం పరిధిలో పలువురు అధికారులు ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలోనే ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది.

News March 12, 2025

NZB: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడవ బెటాలియన్ రిజర్వ్‌డ్ ఎస్సై BC(A) లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడవ బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.

News March 12, 2025

ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

News March 12, 2025

NZB: అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా?: కవిత

image

అసెంబ్లీ రోజున ప్రజాప్రతినిధుల అరెస్టులా? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్ వస్తున్న తాజా మాజీ సర్పంచ్‌లను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. సర్పంచ్‌లను కలిసేందుకు సీఎం ఎందుకు భయపడుతున్నారన్నారు.

News March 12, 2025

నేడు బడ్జెట్… NZB జిల్లాకు ఏం కావాలంటే?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా సాగునీటి సమస్యను పరిష్కరించాలని, ప్రస్తుతం పసుపు రైతులు ఎదుర్కొంటున్న మద్దతు ధర సమస్య విషయంలో చొరవ చూపాలని కోరుతున్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చెప్పట్టాలని, జిల్లాలో ప్రభుత్వ ఇంజినీర్ కళాశాల నిర్మణానికి నిధులు కేటాయించాలి కోరుతున్నారు.

News March 12, 2025

కామారెడ్డి: పదోతరగతి విద్యార్థి సూసైడ్

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక గర్గుల్‌కు చెందిన పదోవతరగతి విద్యార్థి శరత్ కుమార్ (16) ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శరత్‌కు క్రికెట్ అంటే ప్రాణమని పైగా విరాట్ కోహ్లికి వీరాభిమాని అని స్థానికులు తెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీల్లో అనేక అవార్డులను శరత్ సొంతం చేసుకున్నాడు. శరత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 12, 2025

ఆరె కటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతు: TPCC చీఫ్

image

ఆరె కటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం రాత్రి రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహాసభలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఆరె కటికలు రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలుగా మారే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. బీసీలకు కాంగ్రెస్ పాలనలోనే సువర్ణ యుగమని, బీసీలు సంఘటితం అయితే భవిష్యత్ తెలంగాణ బీసీలదే అని పేర్కొన్నారు.

News March 12, 2025

NZB: SSC పరీక్షల నిర్వాణపై డీఈఓ పరిచయ కార్యక్రమం

image

రానున్న SSC పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సన్నద్ధత సహా పలు కీలక అంశాలపై జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్‌తో బుధవారం ఉదయం 7:50 నిమిషాలకు ఆకాశవాణి నిజామాబాద్ (103.2 M.Htz) లేదా “News On AIR” మొబైల్ యాప్ ద్వారా ప్రసారం కానుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్ర ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని తగు సూచనలు ఇవ్వాలని డీఈవో అశోక్ కోరారు.

News March 12, 2025

NZB: ఇంటర్ పరీక్షలు.. 852 మంది గైర్హాజరు, ఒకరిపై మాల్ ప్రాక్టీసు కేసు

image

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం బాటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-1ఏ పరీక్షకు 852 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 21,218 మంది విద్యార్థులకు గాను 20,366 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి చీటీలు పెట్టి పరీక్ష రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామన్నారు.

News March 12, 2025

నిజామాబాద్: 25 శాతం రిబేట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

image

లేఔట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కోసం మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రిబేటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 25 శాతం రాయితీ పొందాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎల్ఆర్ఎస్ అనుమతులు లేని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.