Nizamabad

News November 18, 2024

NZB: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ – 3 పరీక్షలు

image

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ – 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు.

News November 18, 2024

ఎడపల్లి: విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

image

గాలిపటం కోసం చెట్టు ఎక్కిన ఓ బాలుడు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. కుర్నాపల్లి గ్రామానికి చెందిన మతిన్(13) సోమవారం ఇంటి వద్ద గాలిపటం ఎగురవేశాడు. అది చెట్టుకు చిక్కుకుపోవడంతో దాన్ని తీసేందుకు చెట్టుఎక్కాడు. ఇనుప రాడ్డు సహాయంతో కరెంట్ తీగల్లో చిక్కకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించగా కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News November 18, 2024

NZB: ‘నెల రోజులకే ఉద్యోగం నుంచి తొలగించారు’

image

జాబ్‌లో చేరిన నెలలోనే ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన ధర్పల్లిలో జరిగింది. DSCలో SGTగా ఎంపికై దుబ్బాక పాఠశాలలో పనిచేస్తున్న లావణ్యను అధికారులు ఉద్యోగం నుంచి తీసేశారు. ఆమె స్థానంలో భార్గవిని నియమించారు. కాగా, భార్గవి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదని, సెలక్షన్ లిస్టులో పేరు లేకపోయినా అధికారులు అవినీతికి పాల్పడి తన స్థానంలో భార్గవిని నియమించారని లావణ్య ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.

News November 18, 2024

NZB: గుండెపోటుతో డాక్టర్ మృతి

image

గుండెపోటుతో సీనియర్ డాక్టర్ భీంసింగ్ సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన గతంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించారు. ఆప్తాలమిక్ వైద్యుడిగా నిజామాబాద్ నగర ప్రజలకు సేవలందించి గత మేలో పదవీ విరమణ చేశారు. ఆయన అంత్యక్రియలు నేడు మాక్లూర్ తండాలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు వైద్యులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

News November 18, 2024

కామారెడ్డిలో నేటి నుంచి ఉద్యోగ నియామకాలు

image

ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ (108) సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు కామారెడ్డి జిల్లా కో- ఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. MLT, DMLT, GNM, ANM, BSC (BZC), BSC నర్సింగ్ చదివి, 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులకు కామారెడ్డిలోని పాత MRO కార్యాలయంలో సోమవారం, మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News November 18, 2024

‘కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి’: షబ్బీర్ అలీ

image

కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు, కులాలకు సమానంగా చూస్తుందని TG రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొన్ని పార్టీలు దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేసారు. ఆదివారం నాందేడ్ లోని శ్రావస్తి నగర్ లో ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నాందేడ్ నార్త్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

News November 18, 2024

బోధన్‌లో గుండెపోటుతో యువకుడి మృతి

image

బోధన్ మండలం లంగ్డాపూర్ గ్రామానికి చెందని అనిల్ ఆదివారం గుండె పోటుతో మృతి చెందాడు. ఆదివారం ఉదయం అనిల్‌కు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే అనిల్ మృతి చెందడంతో గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.

News November 17, 2024

మోస్రా: ప్రమాదవశాత్తు కాలువలో జారి పడి వ్యక్తి మృతి

image

మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెద్దిగారి శోభన్(40) తన పొలంలో నారు మడికి నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోకల రమేశ్ తెలిపారు.

News November 17, 2024

ఆర్మూర్: మానవత్వం చాటుకున్న ASI సలీం

image

ASI సలీం మానవత్వాన్ని చాటుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రంలో గ్రూప్-3 పరీక్ష రాయడానికి ఓ మహిళ తన కుమారుని తీసుకొని వచ్చింది. పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రానికి రాగా ఆమె బంధువులు తనతో ఎవరూ లేరు. బాబుని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. అక్కడ డ్యూటీలో ఉన్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ASI సలీం బాబు తండ్రి వచ్చేవరకు తన వద్ద ఉంచుకున్నారు. అనంతరం బాబును తండ్రి వచ్చిన తర్వాత అప్పగించారు.

News November 17, 2024

NZB: పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా అభ్యర్థులు

image

నిజామాబాద్‌లోని ఉమెన్స్ కళాశాల గ్రూప్ -3 పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు అనుమతించలేదు. సమయం పూర్తి కావడంతో కేంద్రం గేట్లు మూసేశారు. ముబారక్ నగర్ నుంచి ఒకరు, కామారెడ్డి నుంచి ఒకరు మొత్తం ఇద్దరు అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా వచ్చి కేంద్రం గేట్లు మూసి ఉండటంతో నిరాశతో వెనుదిరిగారు.