India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రవి పటేల్ (40) గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులతో గత కొద్ది రోజులుగా భూతగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్ను MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. నిన్న (శుక్రవారం) రాత్రి 9 గంటలకు 52,164 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా రాగ శనివారం ఉదయం 10 గంటలకు అది తగ్గి 23,964 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఔట్ ఫ్లోగా 703 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMC లకు గాను ప్రస్తుతం 42.325 TMC ల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రావణ మాసం సందర్భంగా ఆర్టీసీ రీజియన్ పరిధిలో స్పెషల్ ఆఫర్ అందించనున్నామని ఆర్ఎం జానీ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా పెళ్లిళ్లు ఇతర వేడుకలకు బస్సులను ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రైవేట్ బస్సుల కంటే తక్కువ ఛార్జీ తీసుకుంటామని డ్రైవర్లకు కూలీ చెల్లించే అవసరంలేదన్నారు. అరుణాచలం వరకు బస్సు సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు.
UNION బ్యాంక్లో అవకతవకలకు పాల్పడిన మాజీ సీనియర్ మేనేజర్అరెస్టయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్లోని బ్యాంకు బడాబజార్ సీనియర్ మేనేజర్ అజయ్ ఖాతాదారులను నమ్మించి రూ.3కోట్లు వసూలు చేశారు. వారి హామీపత్రాలను వాడుకొని డబ్బులు తీసుకున్నాడు. మోసపోయిన బాధితుల్లో ఒకరు జులై 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అజయ్ను శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రీతమ్(27) భిక్కనూరు(M) TU పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో వీడ్కోలు సమావేశం ఉండడంతో పనుల నిమిత్తం శుక్రవారం బయటికి వెళ్లాడు. బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో ప్రీతమ్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా బేల(M) సాంగిడికి చెందిన వాడని తోటి విద్యార్థులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సర్పంచ్ పదవికి పోటీ చేయాలని పలు గ్రామాల్లో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఓడిన, పోటీ చేయలేక వెనక్కి తగ్గిన వారు ఈసారి తగ్గేదేలే అంటున్నారు. కాగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.
ఈ నెల 5 నుంచి 9 వరకు కొనసాగనున్న ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తాహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జీపీ ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు .
* బోధన్ – బీదర్ రైల్వే లైన్ ను నిర్మించండి: MP సురేష్ షెట్కార్
* CM రేవంత్ టీచర్లతో ముఖాముఖి.. సభకు తరలి వెళ్లిన జిల్లాలోని ఉపాధ్యాయులు
* ఇందల్వాయి: శీలం జానకీ బాయి జలసోయగం (డ్రోన్ షాట్)
* క్రీడాకారిణి ప్రతిభకు ప్రోత్సాహకం అందించాలి: జుక్కల్ MLA తోట
* మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ రాజీవ్
* KMR జిల్లాల్లోని పలు PSలో బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐలు
* SRSPకు కొనసాగుతున్న వరద
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కామారెడ్డికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 15 మంది నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశాడని ఆయన తెలిపారు. కానీ వారికి ఎలాంటి ఉద్యోగాలు కల్పించకపోగా.. ఫేక్ జాబ్ లెటర్లు అందజేసి పత్తాలేకుండా పోయాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో ప్రవీణ్ను అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.