Nizamabad

News November 17, 2024

రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ వాసి మృతి

image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శనగర్ మలుపు వద్ద ఓ కారు కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో NZB జిల్లా డిచ్పల్లికి చెందిన సురేశ్ స్పాట్‌లో మృతిచెందగా, కుత్బుల్లాపూర్‌కు చెందిన నరసింహారావు, శివకుమార్ సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు ముగ్గురు కలిసి కారులో మహారాష్ట్రలోని గానుగాపూర్‌ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

News November 17, 2024

KMR: జిల్లాలో గ్రూప్-3 రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు: SP

image

ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరిగే గ్రూప్-3 రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా SP సింధు శర్మ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు.

News November 16, 2024

NZB: టిప్పర్ ఢీకొని తండ్రీ కొడుకుకు గాయాలు

image

నిజామాబాద్ నగరంలోని రాజా రాజేంద్ర చౌరస్తాలో శనివారం టిప్పర్, బైక్ ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామానికి చెందిన భూమారావ్, అతని కుమారుడు ధనుష్ పెద్ద బజార్ నుంచి న్యాల్ కల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పులాంగ్ చౌరస్తా నుంచి వర్నీ చౌరస్తా వైపు వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. దీనితో తండ్రీకొడుకులకు గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు.

News November 16, 2024

కామారెడ్డి జిల్లాలో దారుణం.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

image

కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. లింగంపేట మండలం పోల్కంపేటలో కాంతమయ్యకు చెందిన ఆవును గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి <<14617109>>గొడ్డలితో నరికి <<>>చంపిన విషయం తెలిసిందే. కాగా ఆవుకు పశువైద్యురాలు అన్న జోనస్ పోస్ట్ మార్టం నిర్వహించారు. నిందితులను పట్టుకునేందుకు రెండు టీమ్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

News November 16, 2024

రాజంపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరి మృతి

image

రాజంపేట మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన రవీందర్ ప్రమాదవశత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ పుష్ప రాజ్ తెలిపారు. గ్రామానికి చెందిన ఆయన తన వ్యవసాయ బావి వద్ద పంటకు పురుగుల మందు కొట్టేందుకు వెళ్లారు. బావి వద్ద కరెంటు లేకపోవడంతో నీటి కోసం బావిలో దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందినట్లు ఆయన వివరించారు.

News November 15, 2024

మహారాష్ట్రలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ ఛైర్మన్

image

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బిలోలి మండలంలోని సావళి గ్రామంలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని, కాంగ్రెస్ అభ్యర్థి నివర్తిరావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

News November 15, 2024

కామారెడ్డి: పోల్కంపేటలో ఆవును నరికి చంపారు..!

image

కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన ఈరోజు వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లింగంపేట మండలం పోల్కంపేటలో సాకలి కాంతమయ్యకు చెందిన ఆవు మెడను గుర్తుతెలియని ఆగంతకులు రాత్రి గొడ్డలితో నరికి చంపారు. ఉదయం వచ్చి యజమాని చూడగా ఆవు రక్తపు మడుగులో ఉండడం చూసి బోరున విలపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు. 

News November 15, 2024

కామారెడ్డి: ఏసీబీకి చిక్కిన పోలీసులు.. UPDATE

image

కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల క్రితం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ కేసులో బెయిల్ కోసం నిందితుడి దగ్గరి నుంచి నుంచి సదరు పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం రైటర్ రామస్వామికి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.

News November 15, 2024

గ్రూప్-4 ఫలితాలు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 548 మంది 

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం గ్రూప్-4 తుది ఫలితాల ప్రకటనలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 548 మందిని ఉద్యోగులను కేటాయించింది. నిజామాబాద్ 360, కామారెడ్డి జిల్లాకు 188 ఉద్యోగులను కేటాయించినట్లు తెలిపింది. గత సంవత్సరం అనేక అవరోధాలను ఎదుర్కొని తదుపరి మూడు నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని అనంతరం తుది ఫలితాలను ప్రకటించింది.

News November 15, 2024

కామారెడ్డి: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఆరుగురిపై కేసు

image

కామారెడ్డికి చెందిన ఇంటర్ విద్యార్థి జశ్వంత్(17) HYD శ్రీ <<14605745>>చైతన్య <<>>కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు చేయగా ఘటన స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. బంధువులతో గొడవల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. ‘అమ్మను, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి నాన్నా’ అంటూ లెటర్‌లో రాశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.