Nizamabad

News October 21, 2024

NZB: ‘పదవుల కేటాయింపులో వారికి రెండో ప్రాధాన్యం’

image

వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పదవుల కేటాయింపులో రెండో ప్రాధాన్యం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల కృషి తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. కష్టపడే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటుందని హామీ ఇచ్చారు.

News October 21, 2024

బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి జూపల్లి

image

బీఆర్‌ఎస్‌ నేతలు సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అవాస్తలు, ఆరోపణలను కాంగ్రెస్‌ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. రాజకీయ లబ్ధికోసం గ్రూప్‌-1 అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నగరంలోని సోమవారం నుడా ఛైర్మన్‌గా కేశ వేణు బాధ్యతల స్వీకరణ అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

News October 21, 2024

NZB:టీయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరిరావు

image

తెలంగాణ యూనివర్సిటీ వీసీగా టీ. యాదగిరిరావు బాధ్యతలను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో గత కొంతకాలంగా వీసీ పోస్ట్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రభుత్వం ప్రొఫెసర్ టీ. యాదగిరిరావును *నియమించింది. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.

News October 21, 2024

కామారెడ్డి: ‘కలిసి పని చేద్దామంటే బీజేపీ MLA అడ్డువస్తున్నాడు’

image

కామారెడ్డి గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు. కామారెడ్డిని కలిసి అభివృద్ధి చేద్దామంటే BJP ఎమ్మెల్యే అడ్డు వస్తున్నాడని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు.

News October 21, 2024

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు

image

నిజామాబాద్ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 545 ఉన్నాయి. వార్డుల సంఖ్య 5022, మహిళ ఓటర్ల సంఖ్య 4,43,548 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 3,87,017 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 15 మంది, మొత్తం 8,30,580 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 2018 పంచాయతీ ఎన్నికల్లో 4,932 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 5,022కు పెంచారు.

News October 21, 2024

కామారెడ్డి: ‘కలిసి పని చేద్దామంటే బీజేపీ MLA అడ్డువస్తున్నాడు’

image

కామారెడ్డి గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు. కామారెడ్డిని కలిసి అభివృద్ధి చేద్దామంటే BJP ఎమ్మెల్యే అడ్డు వస్తున్నాడని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు.

News October 21, 2024

కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదు: కోదండరాం

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదనీ, కోట్లాది మంది ఉద్యమాలతో ఎంతో మంది బలిదానాలు చేయడంతో తెలంగాణ సిద్ధించిందన్నారు. కార్యక్రమంలో ఎన్జీవో నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, పలువురు పాల్గొన్నారు.

News October 21, 2024

పదేళ్లు BRS రాష్ట్రాన్ని దోచుకుంది: జూపల్లి కృష్ణారావు

image

తెలంగాణను పదేళ్లపాటు BRS దోచుకుందని మంత్రి జూపల్లి కృష్ణ రావు ఆరోపించారు. కామారెడ్డి గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా లూటీ చేస్తే.. కాంగ్రెస్ ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ కే దక్కుతుందన్నారు.

News October 21, 2024

SRSP 17 గేట్లు ఎత్తివేత

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి అదనపు నీరు వస్తుండడంతో ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టు అధికారులు మొత్తం 17 గేట్లు ఎత్తారు. వీటి ద్వారా 53,108 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుండి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 67,562 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను తాజాగా 1091అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉంది.

News October 20, 2024

లింగంపేట్: కానిస్టేబుల్‌కు అంటుకున్న మంటలు

image

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో అడ్డుకోబోయిన కానిస్టేబుల్ రమేష్ రెడ్డికి మంటసెగ తాకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ రమేష్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అంతకుముందు ధర్నాలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.