India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్ అదాలత్ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 18,252 కేసులను పరిష్కరించినట్లు DLSA సూపరింటెండెంట్ శైలజ తెలిపారు. 14 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేయగా, కేసుల పరిష్కారంతో రివార్డు రూపంలో రూ.5.34 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన కేసుల కంటే 4,500 పైగా ఎక్కువ కేసులు పరిష్కారమైనట్లు వివరించారు.
నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం తూమ్పల్లి, కోటగిరిలో 39.7℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు వేంపల్లి 39.5, ఆలూరు 39.4, లక్ష్మాపూర్ 39.3, గోపన్నపల్లి 39.2, ముప్కల్ 39.1, మోర్తాడ్ 38.9, మల్కాపూర్, జక్రాన్పల్లి 38.8, కోనసముందర్ 38.4, బాల్కొండ 38.3, మాచర్ల, మదన్పల్లె, వైల్పూర్ 38.2, జనకంపేట్, భీంగల్ 38.1, నిజామాబాద్ 38, పెర్కిట్, యేర్గట్లలో 37.9℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్ ఆంగ్లంలో రాసిన’లైఫ్ ఆన్ పేపర్ ‘అనే కవితను బళ్ళారి (కర్ణాటక) శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంగ్లిష్ – మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్లో పాఠ్యాంశంగా పొందుపరిచింది. ఇది ఒక గాఢమైన భావోద్వేగ కవిత అని దీనిని పాఠ్యాంశంగా చేర్చడం పట్ల కార్తీక్ హర్షం వ్యక్తం చేశారు.
ఎడపల్లి మండలంలోని ఠాణాకలన్ గ్రామానికి చెందిన సురేశ్(24) అనే యువకుడు కుటుంబ కలహాలతో శుక్రవారం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం మృతదేహం నీటిపై తేలి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP వెంకట్ రెడ్డి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాశ్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే, నాగారానికి చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.10.17 లక్షల నగదుతో పాటు, చోరీకి వినియోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
నిర్మల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన షేక్ ఇమ్రాన్, నాందేడ్కు చెందిన అమన్, బాసరకు చెందిన షేక్ అర్బాజ్ ముగ్గురు కలిసి NZBలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. వారిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా అమన్ పరారీలో ఉన్నట్లు ACP వెల్లడించారు.
మార్చి 10వ తేదీ నుంచి ఇంటర్ సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మూల్యాంకన కేంద్రంలో సంస్కృతం బోధించే అధ్యాపకులు అందరూ రిపోర్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులను వెంటనే ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు రిలీవ్ చేయాలని ఆయన ఆదేశించారు.
కాంగ్రెస్ వల్లే నవోదయ విద్యాలయం వెనక్కి వెళ్లిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం సమ్మతించించగా రూరల్ నియోజకవర్గంలో విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలం కూడా చూపించారన్నారు. కానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవోదయ విద్యాలయాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.
మాక్లూర్ మండలం అమ్రాద్ తండాలో దారుణం జరిగింది. రేషన్ బియ్యం విషయంలో జరిగిన వాగ్వాదంలో ముగ్గురు అన్నదమ్ములపై కత్తులతో దాడి చేశారు. జ్యోతిరామ్ అనే వ్యక్తి భార్య గ్రామంలో రేషన్ డీలర్గా ఉన్నారు. అయితే తమకు బియ్యం ఇవ్వడం లేదని అన్నదమ్ముళ్లు విక్రమ్, పీర్ సింగ్ గొడవపడ్డారు. అక్కడే ఉన్న జ్యోతిరామ్తో పాటు ఆయన సోదరులు శ్రీనివాస్, రాజునాయక్ అడ్డుకోగా ఆగ్రహంతో విక్రమ్ఆ ముగ్గురిపై కత్తితో దాడి చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉందని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు.
Sorry, no posts matched your criteria.