India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని హైవే బైపాస్లో రాజధాని బస్సులో భారీ నగదు చోరీ జరిగినట్లు ఎస్సై శివానందం తెలిపారు. కొంపల్లికి చెందిన మసాలా వ్యాపారి అమీన్ అబ్దుల్ లాలా నిజామాబాద్ నుంచి రాజధాని ఆర్టీసీ బస్సులో రూ.5 లక్షల నగదుతో కొంపల్లికి వెళ్తున్నారు. తూప్రాన్ దాబా వద్ద బస్సు ఆగగా భోజనానికి దిగి వచ్చే సరికే నగదు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది.
కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. శాంతిభద్రలకు నియోజకవర్గ ప్రజలు సహకరిస్తారని ఆయన పేర్కొన్నారు.
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి తెలిపారు. వారికి అందిన సమాచారం మేకు దాడులు నిర్వహించి పేకాటాడుతున్న వారి వద్ద 5 సెల్ఫోన్లు, 11,520 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. అనంతరం వారిని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనతో పాటు సీఐ పురుషోత్తం, సిబ్బంది ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అహ్మదీ బజార్లో ఉన్న ఉర్దూ ఘర్లో గ్రూప్ -2, గ్రూప్ -3 అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తెలిపారు. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బైక్పై తరలిస్తున్న 2.250 కిలోల ఎండు గంజాయిని నిజామాబాద్లోని చంద్రశేఖర్ కాలనీ ఎక్స్రోడ్ వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నగరంలో బాబా ఖాన్, బీబీపేట్కి చెందినకిషన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
బిక్కనూర్ శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి ఆటోమొబైల్ సామాన్ తరలిస్తున్న టాటా ఏస్ వాహనం బిక్కనూర్ వద్ద డివైడర్ను ఢీకొంది. కరీంనగర్కు చెందిన శేఖర్(47) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేశారు.
అత్తింటి వేధింపులు తాళలేక నిజామాబాద్ ఆర్యనగర్కు చెందిన వివాహిత యువతి లావణ్య(23) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్యకు తొమ్మిది నెలల కిందట ఆర్యనగర్కు చెందిన వెంకటేశ్తో వివాహం జరిగింది. ఆషాఢం కావడంతో సుభాష్ నగర్లోని తన పుట్టింటికి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డొంకేశ్వర్ మండలం నూత్పల్లికి చెందిన సాయన్న సౌదీలో ఈనెల 4న మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయన్న మృతదేహాన్ని తొందరగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆర్మూర్లో ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడును కలిసి అభ్యర్థించారు. స్పందించిన కోటపాటి సౌదీ రాయబార కార్యాలయానికి కావలసిన సమాచారాన్ని పంపించామని పేర్కొన్నారు.
బిచ్కుందలోని ATM మెషిన్ను దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరికి వినియోగించిన వాహనం మహారాష్ట్ర సరిహద్దులో కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్కు చేరుకొని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండగులు పారిపోతూ మార్గమధ్యలో పెద్ద ఏడ్గిలో 2 బైక్లను సైతం చోరీ చేశారనీ SI సత్యనారాయణ తెలిపారు.
నేడు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. నిజామాబాద్తో పాటు పక్కనే ఉన్న నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.
Sorry, no posts matched your criteria.