India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాన్సువాడకి చెందిన తాళ్ల గంగాధర్ అనే వ్యక్తి మద్యం తాగి మృతి చెందినట్లు సీఐ కృష్ణ తెలిపారు. మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్న గంగాధర్ కొంతకాలం నుంచి మద్యానికి బానిస అయ్యారు. భార్య కొంతకాలం కిందట పుట్టింటికి వెళ్ళిపోయారు. పట్టణంలోని సినిమా థియేటర్ సమీపంలోని ములుగు కాలువలో మంగళవారం గంగాధర్ మృతదేహం లభించిందని పోలీసులు వెల్లడించారు.
ఫోన్కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే బెల్ట్ వచ్చిన ఘటన నవీపేట మండలం శివతండాలో జరిగింది. గ్రామస్థుల ప్రకారం.. రైతు జీవన్కు గతనెల 10న ఓ ఆన్లైన్ కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 25వేల ఫోన్..మీకు లక్కీ డ్రాలో రూ.5 వేలకు వచ్చిందని చెప్పారు. దీంతో రైతు సమ్మతించారు. నిన్న ఆర్డర్బాక్స్ను పోస్ట్మెన్ జీవన్కు ఇచ్చి రూ.5 వేలు తీసుకున్నాడు. డబ్బాను తెరిచి చూడగా అందులో బెల్ట్ ఉండటంతో రైతు అవాక్కయ్యాడు.
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు ఆయనకు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనిల్కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మంగళవారం భారీగా గుట్కాను పట్టుకున్నారు. నగరంలోని మార్కెట్లోని వెల్కమ్ ఏజెన్సీ సంబంధించిన అబ్దుల్ బాసిత్ గోడౌన్లో రూ.4,26,873 గుట్కాను పట్టుకున్నట్లు SHO విజయ్ బాబు తెలిపారు. దాంతో పాటు ఈరోజు ఉదయం డిచ్పల్లిలోని మెంట్రాజ్పల్లి సమీపంలో డీసీఎంలో తరలిస్తున్న రూ.39లక్షల విలువైన గుట్కాను ఎస్ఐ మహేశ్ స్వాధీనం చేసుకున్నారు.
హిస్టరీ జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ను కామారెడ్డి వాసి సాధించారు. గాంధారీ మండలం నేరాల్ తండా గ్రామానికి చెందిన బర్దావల్ మేఘరాజ్ నాయక్ జూనియర్ లెక్చరర్గా రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. మారుమూల తండాలో పుట్టిన కాయితి లబాన్ బర్దావల్ మేఘరాజ్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో గ్రామస్థులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో పాము కాటుతో చిన్నారి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. జోడు శంకరయ్య(60) తన కుటుంబ సభ్యులతో ఇంటి ముందు నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో తన మనమరాలు వైష్ణవి(7)ని పాము కాటేసింది. మనవరాలు ఏడుస్తుండటంతో దగ్గర తీసుకునే శంకరయ్యను కూడా పాము కాటేసింది. దీంతో వైష్ణవి మృతి చెందగా, శంకరయ్య చికిత్స పొందుతున్నాడు.
బాయ్స్ హస్టల్లో యువతికి ఓ స్టూడెంట్ 15రోజుల క్రితం ఆశ్రయమిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ అధికారుల వివరాలిలా.. టీయూలో విద్యార్థి పీజీ చదువుతూ యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నాడు. అతను ఓ యువతికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని తోటి విద్యార్థులు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆ స్టూడెంట్ని సస్పెండ్ చేశారు.
చేపల వేటకు వెళ్ళిన వ్యక్తి ప్రమాదవశాత్తు వల చుట్టుకొని మృతి చెందిన ఘటన మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన పల్లికొండ నరసయ్య చేపలు పట్టేందుకు గ్రామ శివారులోని చెరువులోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా కాళ్లకు, చేతులకు వల చుట్టుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తండ్రిని చంపిన కొడుకుకు KMR జిల్లా కోర్టు సోమవారం జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. బీబీపేట వాసులు బోయిని రాజయ్య తండ్రి నరసయ్యకు ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మే 5న పొలంలో రాజయ్య తండ్రిని కొట్టి చంపాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరగగా నేరం ఋజువు అయ్యింది. ఈ మేరకు జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పును వెలువరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్- 2024 కార్యక్రమ పోస్టర్ను సోమవారం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది సైతం ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు.
Sorry, no posts matched your criteria.