India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరగగా, బీజేపీ ఎంపీ అరవింద్ హిందుత్వ ఎజెండాతో దూసుకెళ్తున్నారు. గణేశ్ గుప్తా అభివృద్ధి నినాదంతో BRS కేడర్లో జోష్ నింపుతున్నారు. బోధన్, నిజామాబాద్లలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనతో రాజకీయం వేడెక్కింది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది.

నిజామాబాద్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరగగా, బీజేపీ ఎంపీ అరవింద్ హిందుత్వ ఎజెండాతో దూసుకెళ్తున్నారు. గణేశ్ గుప్తా అభివృద్ధి నినాదంతో BRS కేడర్లో జోష్ నింపుతున్నారు. బోధన్, నిజామాబాద్లలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనతో రాజకీయం వేడెక్కింది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమర్థవంతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నం అయి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఎన్నికల విధుల్లో నిమగ్నం అయి ఉన్న పోలీసు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.

పోలీస్ శాఖలో ప్రతి సిబ్బంది పాత్ర అత్యంత ముఖ్యమని, వారు తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని CP సాయి చైతన్య సూచించారు. శనివారం ఆయన కోర్ట్ డ్యూటీ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారం త్వరితగతిన ముగిసేలా సాక్ష్యులను ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్షపడేలా చూసి పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్లోని ఐడీఓసీలో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ IIIవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు శనివారం జరిగిన పరీక్షలను వర్సిటీ ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు మొత్తం 1,977 మందికి 1,899 మంది విద్యార్థులు హాజరు కాగా 78మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ గంటా చంద్రశేఖర్ తెలిపారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో బంధువులు పోటీ పడుతున్నారు. ఒకే పార్టీ నుంచి భార్యా మరొకచోట నుంచి భర్త, ఒకే పార్టీ నుంచి తండ్రి ఒక చోట నుంచి కూతురు ఒక చోట, పక్కపక్కనే గల డివిజన్లో అన్నదమ్ముల కూతుర్లు అక్కాచెల్లెళ్లు కూడా ఒకే పార్టీ నుంచి పక్కపక్కనే గల డివిజన్ల నుంచి పోటీ చేస్తున్నటువంటి సన్నివేశం ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ అభ్యర్థుల్లో జోష్ నింపింది. సభకు ముందు CM పోటీ పడుతున్న అభ్యర్థులతో చిట్ చాట్ చేస్తూ అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని గెలుస్తారని పేర్కొనడంతో వారికి గెలుపుపై ధీమా ఏర్పడింది. దాంతో మరింత ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.

నిజామాబాద్ కార్పొరేషన్లో సగం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సీఎం మాట్లాడారు. ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారబోతున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయని హితవు పలికారు. అన్ని సర్వేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని వారికి వివారించారు
Sorry, no posts matched your criteria.