Nizamabad

News June 27, 2024

NZB: సైబర్ మోసం.. నిందితుడికి జైలు శిక్ష

image

ఓ వ్యక్తి తన గొంతును స్త్రీ గొంతుగా మార్చి బాధితున్ని హనీ ట్రాప్ చేసి డబ్బులు కాజేసిన ఘటన జిల్లాలో వెలుగు చూసింది. ఈ మేరకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో హనీ ట్రాప్‌కు సంబంధించిన నేరంలో నిందితుడిని పట్టుకొని జిల్లా కోర్టులో హాజరు పరచగా, అతనికి జైలు శిక్ష విధించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ వెంకటేశ్వర్ రావు సూచించారు.

News June 27, 2024

NZB: డిఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ

image

టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సీ పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. డిఎస్సీ పరీక్ష కొంతకాలం పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు ఇటీవల నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై 2,3 రోజుల్లో స్పష్టతనిచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

News June 27, 2024

ఎడపల్లి: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

image

ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన రఘుపతి శ్రీనివాస్ (35) గురువారం ఉదయం వారి కులస్తులతో కలిసి గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకొని నీటిలో మునిగిపోయాడు. తోటి వారు రక్షించేందుకు చూసినా ఫలితందక్కలేదు. మృతుడి భార్య మమతా ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News June 27, 2024

పిట్లం: గుండెపోటుతో యువకుడు మృతి

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన పిట్లం మండలం హస్నాపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ముజీజ్‌కు బుధవారం ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

News June 27, 2024

నిజామాబాద్: గ్రూప్-2 అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్‌లు

image

టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిజామాబాద్ బీసీ స్టడీ సెంటర్లో గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి గ్రాండ్ టెస్ట్ జులై 08, 09, రెండో టెస్ట్ జులై 15, 16, మూడో టెస్ట్ జులై 22, 23, నాలుగో టెస్ట్ జులై 30, 31వ తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News June 27, 2024

మస్కట్‌లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

image

నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు మస్కట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము(42) మూడు నెలల క్రితం మస్కట్‌కు వెళ్లాడు. అక్కడ బుధవారం రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

News June 27, 2024

ఆర్మూర్ అభివృద్ధి కోసం పోరాటానికి సిద్ధం: ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఆర్మూర్ నియోజకవర్గంలోనూ పైలెట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించాలన్నారు. దీనిపై వారం రోజులలో ప్రభుత్వం నిర్ణయం తెలపాలన్నారు. లేకపోతే దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

News June 26, 2024

NZB: జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల బంద్ విజయవంతమైనట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. బంద్‌లో దామ సునీల్, జగదీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారన్నారు.

News June 26, 2024

NZB: జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ విజయవంతం

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం పాఠశాలల బంద్ విజయవంతమైనట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. బంద్‌లో దామ సునీల్, జగదీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారన్నారు.

News June 26, 2024

మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దు: కామారెడ్డి ఎస్పీ

image

యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సందీపని జూనియర్ కళాశాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సూచించారు. విద్యార్థులు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.