Nizamabad

News August 25, 2025

NZB: ఓట్ చోరీ ఆరోపణలు నిరూపించాలి: పల్లె

image

బీజేపీ ఓట్ చోరీ చేసిందని ఆరోపిస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు దమ్ముంటే నిరూపించాలని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి సవాల్ చేశారు. సోమవారం నిజామాబాద్‌లో జరిగిన బీజేపి కార్యకర్తల సమావేశంలో గంగారెడ్డి మాట్లాడారు. ఓట్ చోరీ ఆరోపణలు చేస్తున్న మహేశ్ కుమార్ తన సొంత గ్రామమైన రహత్ నగర్‌లో ఎన్ని ఓట్ల చోరీ జరిగిందో నిరూపించాలన్నారు. లేకుంటే బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.

News August 25, 2025

నిజామాబాద్: కార్మికుల సంక్షేమం ప్రాధాన్యం

image

ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే విధుల్లో నిమగ్నమై ఉండే పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధ్యాన్యత ఇవ్వాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన మాన్యువల్ స్కావెంజర్స్ సర్వే కమిటీ సమావేశం జరిగింది. పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు అమలవుతున్న పథకాలు, ప్రయోజనాల గురించి సూచనలు చేశారు.

News August 25, 2025

నిజామాబాద్: జిల్లాకు రెండు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కళాశాలలు

image

NZB జిల్లాకు మైనారిటీ గురుకుల విద్యా సంస్థల(టెమ్రిస్) ఆధ్వర్యంలో 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) కళాశాలలు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్ కార్యదర్శి షఫీయుల్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటి బాలుర కోసం నాగారంలో, మరొకటి బాలికల కోసం ధర్మపురి హిల్స్‌లోని మదీనా ఈద్గాలో ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా అధికారి బషీర్ తెలిపారు.

News August 24, 2025

NZB: మెడికల్ కాలేజీలో దాడి.. ర్యాగింగ్ కలకలం?

image

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. MBBS నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సీనియర్లు (హౌస్ సర్జన్స్) ర్యాగింగ్‌కు పాల్పడి దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా ర్యాగింగ్, దాడి ఘటనపై ఫిర్యాదు అందిందని విచారణ జరుపుతున్నామని NZB వన్‌టౌన్ SHO రఘుపతి తెలిపారు.

News August 24, 2025

UPDATE: వడ్డీ వ్యాపారులపై దాడుల్లో పట్టుబడినవి ఇవే: CP

image

నిన్న NZB జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన వాటి వివరాలను CP వెల్లడించారు. NZB డివిజన్లో రూ. 1,21,92,750 నగదు, రూ.10.14 కోట్ల విలువైన 137 చెక్కులు, రూ.7.10 కోట్ల విలువైన 170 ప్రామిసరీ నోట్లు, ఆర్మూరులో 324 ప్రామిసరీ నోట్లు, వాటి విలువ రూ.4.97 కోట్లు, రూ.1.85 కోట్ల బాండ్లు, రూ.30.36 లక్షల 62 చెక్కులు స్వాధీనపర్చుకున్నారు.

News August 24, 2025

ఆర్మూర్: దివ్యాంగులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు: డీఈఓ

image

దివ్యాంగులకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా విద్యాధికారి అశోక్ సూచించారు. శనివారం ఆర్మూర్‌లో దివ్యాంగ విద్యార్థులకు సహాయ పరికరాల కోసం లబ్ధిదారుల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. దివ్యాంగుల అవసరాన్ని గుర్తించి సహాయ ఉపకరణాలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులను శిబిరానికి రప్పించడంలో కృషి చేసిన IERPలను అభినందించారు.

News August 23, 2025

NZB: ఆ మెసేజ్‌ల పట్ల వాహనదారులు తస్మాత్ జాగ్రత్త

image

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసాలకు తెరలేపారు. వాట్సాప్‌లో మీ ద్విచక్ర వాహనానికి ఈ-చలాన్ పడిందని మెసేజ్‌లు పంపి Apk లింక్ పంపుతున్నారు. గాభరా పడిన ప్రజలు ఆ లింక్ ఓపెన్ చేయగా వారి ఫోన్ హ్యాక్ అయి వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతున్నాయి. ప్రజలెవరూ అలాంటి Apk లింక్‌లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైం వింగ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News August 23, 2025

NZB: జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై సోదాలు

image

నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు 10 బృందాలు వడ్డీ వ్యాపారుల ఇండ్లలో, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. వడ్డీ వ్యాపారులు ఆస్తులు తనఖా, రిజిస్ట్రేషన్లు చేసుకుని, అధిక వడ్డీలు వసూలు, లైసెన్స్ లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహణపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరుగుతున్నాయి.

News August 23, 2025

NZB: సెప్టెంబర్ 1 నుంచి వారికీ సన్న బియ్యం..!

image

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 4,47,788 ఆహార భద్రతా కార్డులుండగా అందులో 15,21,062మంది సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతనెల నుంచి కొత్త ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తుండగా జిల్లా వ్యాప్తంగా 44,278 నూతన కార్డులు మంజూరయ్యాయి. ఇందులో 1,26,559మంది కొత్త సభ్యులు చేరగా జిల్లాలోని 759 రేషన్ దుకాణాల ద్వారా 7,639 మెట్రిక్ టన్నుల సన్నబియ్యంను SEPT 1 నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

News August 23, 2025

NZB: ఇద్దరు ASIలకు SIలుగా ప్రమోషన్

image

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ASIలకు SIలుగా ప్రమోషన్ లభించింది. మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ASIగా పనిచేస్తూ SIగా పదోన్నతి పొందిన గంగాధర్‌ను జగిత్యాలకు, 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ASI రమేష్‌ను SIగా నిర్మల్‌కు బదిలీ చేశారు. ప్రమోషన్ పొందిన SIలను పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అభినందించి బ్యాడ్జీలు అందజేశారు.