Nizamabad

News July 7, 2024

NZBలో అగ్నిప్రమాదం.. చిన్నారులను రక్షించిన ఫైర్ సిబ్బంది

image

నిజామాబాద్‌లోని పులాంగ్ రోడ్డులో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం రాత్రి ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో దట్టమైన మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే మొదటి అంతస్తులో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు చిక్కుకోగా వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు.

News July 7, 2024

ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

image

ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో TSP జేఏసీ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TSP జేఏసీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TSP జేఏసీ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ నాయకులు నవీన్, వేదంత్ మౌర్య, లవకుమార్, అభిమన్యు, రవి, ప్రవీణ్, ప్రసాద్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News July 6, 2024

KMR: చిన్నారి విక్రయం.. ఇద్దరు డాక్టర్లతో సహా పలువురి అరెస్ట్

image

ఓ చిన్నారిని విక్రయించిన కేసులో ఇద్దరు డాక్టర్లతో పాటు పలువురిని శనివారం అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తండ్రి కొడుకులైన ఇట్టం సిద్దిరాములు, ఇట్టం ప్రవీణ్ కుమార్‌తో పాటు ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆస్పత్రి వాచ్మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, భూపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.

News July 6, 2024

NZB: జీజీ‌హెచ్‌ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్

image

రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ శనివారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)ను సందర్శించారు. ఆయన ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించి తగిన సూచనలు అందజేశారు. కాగా ఆసుపత్రికి కావలసిన అవసరాల గురించి GGH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ కర్ణన్ దృష్టికి తీసుకెళ్లారు, దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.

News July 6, 2024

జుక్కల్ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్

image

జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం ఓ ప్రకటనలో తెలిపారు

News July 6, 2024

బోధన్: ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలి మృతి

image

ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బోధన్‌లో జరిగింది. సాలూరకు చెందిన లక్ష్మీ బాయ్(71) జూన్ నెల 28న హున్సాలోని కూతురు ఇంటికి వెళ్లింది. బాత్‌రూమ్‌కు వెళ్తుండగా నీళ్ల బకెట్‌ తగలడంతో నీళ్లు ఒంటిపై పడి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం NZB ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI నాగనాథ్ తెలిపారు.

News July 6, 2024

నిజామాబాద్‌లో నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన

image

ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు సంబంధించి శనివారం తొలివిడత ధ్రువపత్రాల పరిశీలన నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ సమన్వయకర్త శ్రీరాంకుమార్ తెలిపారు. ఈ నెల 13వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థులు ఈనెల 12 వరకు స్లాట్ బుక్ చేసుకోవాలని, ఈ నెల 8 నుంచి 10 వరకు వెబ్ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

News July 6, 2024

నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం

image

జిల్లాలోని నవీపేట మండలం కమలాపూర్, మోకన్ పల్లి శివారులో శుక్రవారం చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన గాంధీ తన మేకలను తీసుకొని గుట్టకు వెళ్లాడు. సాయంత్రం చిరుత తన మందపై దాడి చేసినట్లు రైతు పేర్కొన్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో NZB బీట్ ఆఫీసర్ సుధీర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ జహుర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరత సంచారం నిజమేనని వెల్లడించారు.

News July 6, 2024

బాసరలో ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

image

ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ పడి మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలను గోదావరిలో తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు చూసి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా బాసర ఎస్ఐ గణేశ్ వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News July 6, 2024

సదాశివనగర్: రైతుపై కత్తులతో దాడి చేసిన దుండగులు

image

రైతుపై కత్తులతో దాడి చేసిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తనూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పర్వతరావు (62) గురువారం పంటచేనులో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు పరుగెత్తి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. దాడికి గల వివరాలు తెలియాల్సి ఉంది.