India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గురువారం నిజామాబాద్లోని ఆయన ఇంటికెళ్లిన వేముల ధర్మపురి సంజయ్ను పరామర్శించారు. అనంతరం డీ. శ్రీనివాస్ మృతిపై వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు.
రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. వానా కాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పాటు జులై 1న బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదలడంతో గోదావరికి వరద నీరు వస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు.
ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు జులై 31 వరకు గడువు పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జూన్ 30తో ముగిసిన గడువును సప్లిమెంటరీ విద్యార్థుల కోసం జులై 31 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 1,700 మంది విద్యార్థులు చేరినట్లు పేర్కొన్నారు.
ఓ బాలుడు స్నేహితుడి ఇంట్లో చోరీ చేసి వారితోనే PSలో ఫిర్యాదు చేసిన ఘటన NZBలో జరిగింది. బొబ్బొలి వీధికి చెందిన మాధవి ఇంటి మరమ్మతులు చేసినందుకు ఆమె కుమారుడి ఫ్రెండ్కి కొంత డబ్బు ఇచ్చింది. కాగా ఆ బాలుడు వారి ఇంట్లో జూన్ 27న రూ.2.20లక్షలు చోరీ చేశాడు. ఈనెల 2న బీరువాలో డబ్బు కనిపించకపోవడంతో మాధవి వారిద్దరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని నింధితుడిగా గుర్తించారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన లింగంపేట్లో చోటు చేసుకుంది. పరిమళ గ్రామానికి చెందిన ఓ బాలికకు మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన భాస్కర్(24)తో ఇన్స్టాలో పరిచయమైంది. దీంతో అమ్మాయికి మాయ మాటలు చెప్పి ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు తెలిపారు.
టీయూలో ఎంఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ధర్మపురి సాయికుమార్ ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించడం అభినందనీయమని ఎకనామిక్స్ విభాగాధిపతి డా.పున్నయ్య పేర్కొన్నారు. అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ను శాలువాతో సత్కరించి అభినందించారు. డా.సంపత్, డా.నాగరాజు, డా.స్వప్న, డా.శ్రీనివాస్, డా.దత్తహరి విద్యార్థులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఇలా ఉన్నాయి. పిట్లంలో12.5, సదాశివనగర్లో 10.8, లింగంపేటలో 10.3, బిక్కనూరులో 10, నిజాంసాగర్లో 9.5, కామారెడ్డిలో 9.3, మద్నూర్లో 8.5, రాజంపేటలో 7.3, గాంధారి, బాన్సువాడలో 5.5, నిజాంసాగర్లో 5.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి రాజారాం తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం చేపట్టనున్న రైతుభరోసా పథకంపై రైతుల సూచనలు కోరుతోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇప్పటివరకు 60 సంఘాల్లో మీటింగ్స్ నిర్వహించారు. 29 సంఘాల్లో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న అభిప్రాయాల్లో 60 శాతం మంది 10ఎకరాల లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వాలని చెబుతున్నారు. గుట్టలు, బీడు భూములకు ఇవ్వొదని కోరుతన్నారు.
ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట దుర్ఘటన పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.
‘ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్లు అద్దెకు ఉండేవారు మాత్రమే’ అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు మంగళవారం పోచారంను తన అనుచరులతో కలువగా పోచారం మాట్లాడుతూ.. బాలరాజుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపు నొప్పి ఎందుకు ? అంటూ కాంగ్రెస్లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.
Sorry, no posts matched your criteria.