Nizamabad

News January 29, 2025

NZB: వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా: కవిత

image

వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు? అంటూ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత‌ ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని, ఒక పక్క వ్యాపారుల మోసం, మరో పక్క ప్రభుత్వం శీత కన్ను వేయడం వల్ల వేరుశనగ రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ వేరుశనగ కొనుగోలు జరపాల్సిన దుస్థితి రావడం దారుణమని కవిత ఆరోపించారు.

News January 29, 2025

నిజామాబాద్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో​ అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన మారుతి నగరంలో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సాయినగర్ ​రోడ్​ నంబర్-1​లో మంగళవారం మారుతి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News January 29, 2025

నవీపేట్: జీవితం మీద విరక్తి చెంది వ్యక్తి మృతి

image

నవీపేట్ మండలం పాల్దే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టి అప్పులు ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అతని భార్య వెంటనే 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 29, 2025

ఎడపల్లి:  రక్తపు మడుగులో వ్యక్తి మృతి

image

ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గ్రామానికి చెందిన బత్తుల నర్సయ్య(60) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో ఇంట్లో మృతి చెంది ఉన్నాడని గ్రామస్థులు తెలిపారు. మృతికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News January 29, 2025

NZB: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష: ACP

image

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష పడినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 22 మంది పట్టుబడ్డారన్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో హాజరు పర్చగా అందులో ఆరుగురికి స్పెషల్ జ్యుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహన్ బేగం 1 రోజు నుంచి 3 రోజుల వరకు జైలు శిక్ష విధించారు.

News January 28, 2025

NZB: క్షయ వ్యాధిని అరికట్టాలి: DMHO

image

చిన్న పిల్లల్లో క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో పిల్లల వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఎన్టీఈపీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చిన్న పిల్లలు క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్సను అందించాలని సూచించారు.

News January 28, 2025

నిజామాబాద్‌: ప్రతి విద్యార్థి అపార్ నమోదు చేసుకోవాలి: DIEO

image

ప్రాథమిక స్థాయి విద్యార్థి దశ నుంచి కళాశాల స్థాయి విద్యార్థులు అందరూ అపార్ నమోదు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాలులో అపార్ నమోదు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి తన కెరీర్లో అభివృద్ధి, ఉద్యోగం పొందేందుకు  అపార్ అవసరమని అన్నారు.

News January 28, 2025

కామారెడ్డి: భర్తను హత్య చేయించిన భార్య..!

image

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూరు శివారులో లభ్యమైన <<15278298>>నారాయణ<<>> మృతదేహం మిస్టరీ వీడింది. హత్నూర పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. బిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నారాయణ భార్య లక్ష్మి నర్సవ్వ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.

News January 28, 2025

NZB: నీలకంఠేశ్వర స్వామి రథం గురించి తెలుసా?

image

సుదీర్ఘ చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరాలయం విమాన రథం విశేష పేరుగాంచింది. ఏగిన కలపతో రూపుదిద్దుకున్న రథం ఎత్తు 28 అడుగులు, వెడల్పు 11 అడుగులు దేవుళ్ల చిత్ర పటాలు, ఏనుగులు, గుర్రాల బొమ్మలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకల్లో భాగంగా ఈ విమాన రథాన్ని సోమవారం నుంచి ముస్తాబు చేస్తున్నట్లు ఆలయ ఈవో యస్.రవీందర్ తెలిపారు.

News January 28, 2025

ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్

image

ఆర్మూర్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఆయనను మున్సిపల్ కమిషనర్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో  సన్మానించి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.