India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నదని, పోచారం వస్తే అత్యంత బలంగా మారుతుందని, గతంలో కూడా తాను శీనన్నతో కలిసి పనిచేశాను, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు.
ఈ నెల 4న కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని NSUI, SFI, AISF, PDSU, AIPSU నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్ మాట్లాడుతూ.. జులై 4 న జరిగే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్కు ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల పరిధిలోని వన్ టైం ఛాన్స్ (సీబీఎస్ఈ) బీఏ, బీ.కాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులకు సంబంధించి ఐదవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య అరుణ మంగళవారం తెలిపారు. ఆగస్టు 4వరకు కొనసాగనున్న ఈ పరీక్షలు ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం.ల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నదని, పోచారం వస్తే అత్యంత బలంగా మారుతుందని, గతంలో కూడా తాను శీనన్నతో కలిసి పనిచేశాను, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు.
బాన్సువాడలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు విజయం కోసం పోటీ పడిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకటయ్యారు. ఆ ఇద్దరు నేతలే శ్రీనివాస్ రెడ్డి (MLA), కాసుల బాల్రాజ్. పోచారం ఇటీవల కాంగ్రెస్లో చేరిన తర్వాత మొదటి సారిగా బాన్సువాడకు వచ్చారు. ఈ మేరకు బాల్రాజ్ వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఏది ఏమైనా ఏళ్ల నుంచి రాజకీయ వైరాన్ని కొనసాగించిన నేతలు ఒక్కటి కావడం ఆసక్తికరంగా మారింది.
పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువులను అవమానించే విధంగా కించపరుస్తూ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందువులు హింస, అసత్యం, ద్వేషం రెచ్చగొడతారని రాహుల్ మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వంద సీట్లు కూడా గెలవని రాహుల్ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.
కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈనెల 4న అథ్లెటిక్స్ పోటీలకు బాల, బాలికల ఎంపిక జరుగుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. 8,10,12 సంవత్సరాల బాలబాలికలకు రన్నింగ్, లంగ్ జంప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాల్గొనే క్రీడాకారులు బర్త్ సర్టిఫికేట్, క్రీడా దుస్తులు, బూట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్లో చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ను సత్య పీర్ల దర్గా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా వ్యాప్తంగా 1,321 మంది ఎస్టీటీలను బదిలీ చేస్తూ డీఈవో దుర్గాప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ గతేడాది జనవరిలో ప్రారంభం కాగా సోమవారంతో ముగిసింది. వారితో పాటు మరో 46 మంది భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను బదిలీ చేశారు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 25 ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
సదాశివనగర్: సదాశివనగర్ మండల కేంద్రంలోని సత్య పీర్ల దర్గా సమీపంలో 44 వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం కామారెడ్డి నుంచి నిజాంబాద్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ఘటన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Sorry, no posts matched your criteria.