India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు కలెక్టర్కు పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
మేడ్చల్ మండలంలో ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఈ నెల 24న జరిగిన <<15246720>>మహిళ <<>> హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు గురైన మహిళ బోధన్కు చెందిన వివాహితగా గుర్తించారు. భర్తకు దూరంగా కొంపల్లిలో మరో వ్యక్తితో ఆమె ఉంటున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే ఈ కేసులో ఆ వ్యక్తి కీలకంగా మారనున్నాడు. కాగా.. వివాహిత కుటుంబంతో పాటు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలను సేకరిస్తున్నారు.
నిజామాబాద్ నగర శివారులోని మాణిక్భండార్లో ఓ కుటుంబం ఆదివారం శునకాలకు బారసాల చేశారు. మాణిక్ బండారుకు చెందిన నర్సాగౌడ్, మంజుల దంపతులు ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి లూసీ అని పేరు పెట్టారు. లూసీ ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వాటికి ఆ దంపతులు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ నగర శివారు మాణిక్భండార్లో ఓ కుటుంబం ఆదివారం శునకాలకు బారసాల చేశారు. మాణిక్ బండారుకు చెందిన నర్సాగౌడ్ మంజుల దంపతులు ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి లూసీ అని పేరు పెట్టారు. లూసీ ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. వీటికి ఆదివారం ఆ దంపతులు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.
జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల ఉత్తమ ప్రిన్సిపల్గా తిరుమాలపూడి రవికుమార్ ఎంపికయ్యారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు చేతుల మీదుగా ఆదివారం ప్రశంసాపత్రం అందుకున్నారు. కాగా జిల్లా ఇంటర్ విద్య అధికారిగా కూడా రవికుమార్ కొనసాగుతున్నారు.
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.
పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన మంద కృష్ణ మాదిగకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి మంద కృష్ణ అని కొనియాడారు. ఆయనకు పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
NZB జిల్లాలోని 31 గ్రామాల్లో ఆదివారం నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి. పలు గ్రామాలను అధికారులు ప్రకటించారు. మిర్దపల్లి, కోమన్ పల్లి, జలాల్పూర్, లింగాపూర్, లంగ్డపూర్, గన్పూర్, సీతయ్ పేట్, కమలాపూర్, గంగసముందర్, అన్సన్ పల్లి, నారాయణపేట, ముల్లంగి బి, కొడిచెర్ల, తిమ్మాపూర్, నర్సింపల్లి మల్కాపూర్, డొంకల్, వేంపల్లి, చిన్న వాల్ గోట్, జైతాపూర్ తో పాటు మిగతా గ్రామాల్లో పథకాలను అధికారులు ప్రారంభించనున్నారు.
NZB జిల్లాలోని 31 గ్రామాల్లో ఆదివారం నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి. పలు గ్రామాలను అధికారులు ప్రకటించారు. మిర్దపల్లి, కోమన్ పల్లి, జలాల్పూర్, లింగాపూర్, లంగ్డపూర్, గన్పూర్, సీతయ్ పేట్, కమలాపూర్, గంగసముందర్, అన్సన్ పల్లి, నారాయణపేట, ముల్లంగి బి, కొడిచెర్ల, తిమ్మాపూర్, నర్సింపల్లి మల్కాపూర్, డొంకల్, వేంపల్లి, చిన్న వాల్ గోట్, జైతాపూర్ తో పాటు మిగతా గ్రామాల్లో పథకాలను అధికారులు ప్రారంభించనున్నారు.
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.
Sorry, no posts matched your criteria.