Nizamabad

News January 22, 2025

దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలి: NZB కలెక్టర్

image

గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను, ప్రత్యేకించి అద్దె ఇంట్లో ఉన్నామని వచ్చే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు.

News January 22, 2025

నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లాలో తూంపల్లి 11.1, జాకోరా 11.9, చందూర్ 12.0, నిజామాబాద్ సౌత్, కోటగిరి 12.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

News January 22, 2025

NZB: అడవిపంది దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

image

అడవిపంది దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ఎడ్దూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని పంట చేలల్లో మంగళవారం గొర్రెలు మేపుతున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన శివ సాయిపై అడవిపంది దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో నిర్మల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

News January 22, 2025

నిజామాబాద్ జిల్లాలో తొలిరోజు 20,588 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన గ్రామసభల్లో 20,588 అప్లికేషన్స్ స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 4,326, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 2,708, రేషన్ కార్డుల కోసం 13,554 అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల గ్రామసభ ప్రశాంతంగా జరగ్గా, మరికొన్ని చోట్ల రసాభాసగా మారింది. గాదెపల్లిలో సభ బహిష్కరించారు.

News January 22, 2025

నవీపేటలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

image

ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను ఇద్దరు మైనర్లు (12), (13) శనివారం ఆడుకుందామని పిలిచి లైంగిక దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు.

News January 22, 2025

బాల్కొండ: రాష్ట్ర స్థాయి పోటీలకు బాల్కొండ విద్యార్థిని

image

బాల్కొండ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నవనీత జిల్లా స్థాయిలో SCERT & ELTA సంయుక్తంగా నిర్వహించిన ఆంగ్ల ఉపన్యాస పోటీల్లో రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో ప్రథమ బహుమతి పొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే తమ పాఠశాల విద్యార్థులు మండల స్థాయి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని పలువురు అభినందించారు.

News January 22, 2025

NZB: ప్రణాళికకు అనుగుణంగా సభలు నిర్వహించాలి: కలెక్టర్

image

ప్రణాళికకు అనుగుణంగా ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న గ్రామ సభల నిర్వహణపై మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

News January 21, 2025

NZB: జిల్లా జడ్జిని కలిసిన రైతు కమిషన్ సభ్యులు

image

నిజామాబాద్ నగరంలోని జిల్లా జడ్జి సునీత కుంచాలను ఆమె కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, ఆకుల రమేష్ న్యాయవాదులు పాల్గొన్నారు.

News January 21, 2025

NZB: పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు

image

పోగొట్టుకున్న బంగారాన్ని బాధితుడికి అప్పగించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి ష్యూరిటీ కోసం జనార్దన్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అతను 3 గ్రాముల బంగారాన్ని పోగొట్టుకున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైజుద్దీన్‌కి బంగారం దోరకడంతో మంగళవారం జనార్దన్‌కు ట్రాఫిక్ సీఐ అందజేశారు. నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్‌ను సీఐ అభినందించాడు.

News January 21, 2025

NZB: సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ: కలెక్టర్

image

సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.