India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్లో ఎరుపెక్కిన ఆకాశం ఆకట్టుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 5:45 నిమిషాల నుంచి 6:30 గంటల వరకు నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారింది. ఎరుపు వర్ణం పులుముకున్న ఆకాశాన్ని తెల్లవారుజామున వాకింగ్, ఇతర పనులకు వెళ్లే వారు ఆసక్తిగా వీక్షించారు. పలువురు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.
గాంధారిలో పనిచేసే ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ను మహారాష్ట్ర పోలీసులు లింగ నిర్ధారణ కేసులో శుక్రవారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ మండలానికి చెందిన ఓ గర్భిణికి లింగనిర్ధారణ చేయడంతో ఉద్గీర్లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు దానికి కారణమైన డా.ప్రవీణ్ను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం మహారాష్ట్రకు తరలించారు.
పిట్లంలోని అంగన్వాడి 7 వ కేంద్రంలో ఆట పాటలు, చదువుతో అలసి పోయిన చిన్నారులు మధ్యాహ్నం ఆహారం తీసుకున్నాక గాఢ నిద్రలోకి జారుకున్నారు. రోజూ మాదిరిగానే పూర్వ ప్రాథమిక టీచర్ ప్రవీణ జ్యోతి బాల తరగతులు చేపట్టారు. అనంతరం పిల్లలు ఆహారం తీసుకొని టీచర్ సూచనల మేరకు నిద్రించారు. ఎల్లలు కల్లలు ఎరుగని బాలలు సుఖమెరగకుండా చక్కగా కొద్ది సేపు పడుకొని లేచారు.
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ… బతుకమ్మ పండుగకు ముందు 9, 5,3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ గ్రామంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
నిజామాబాద్ నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హాజరయ్యారు. దీంతో షాపింగ్ మాల్ ప్రాంగణం యువతి యువకులతో నిండిపోయింది. నటులతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. అంతకుముందు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. మావూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE)ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితర సహచర మంత్రులతో కలిసి సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమ ముగింపులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జలసౌధలో వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనని అన్నారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్లో <<14198416>>వియ్యంకుడిని <<>>హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కంజర్కు చెందిన సత్యనారాయణ తన కూతురిని అదే గ్రామానికి చెందిన నరహరి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. కాగా ఇటీవల వర్ష ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం అల్లుడే అనే అనుమానంతో అతడి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో గోవర్ధన్ ఇంట్లో లేపోవడంతో అతడి తండ్రి కళ్లలో కారం చల్లి కర్రలతో కొట్టి చంపాడు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేయనున్నారు. హైదరాబాద్ రోడ్డులో వెలిసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రానున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించి, తిరిగి హైదరాబాద్ వెళ్తారు. అయితే అభిమాన హీరో, హీరోయిన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొనున్నారు. ఇందుకోసం పోలీసులు భారీ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని.. ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసులు ప్రచారం చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. గురువారం పిట్లంలో ఓ వాహన చోదకుడు తాను వెళ్తున్న వాహనం పై హెల్మెట్ ధరించకుండా.. బైక్ వెనకాల అలంకార ప్రాయంగా తగిలించుకొని వెళ్తున్న దృశ్యమిది.
2008 DSC ద్వారా 70, 30% ఎంపికైన తెలుగు మీడియం SGT అభ్యర్థులకు ఈ నెల 27- అక్టోబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని NZB DEO దుర్గాప్రసాద్ తెలిపారు. అభ్యర్థులకు సంబంధించిన జాబితాను www.schooledu.telangana.gov.in వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో కూడిన 2 జిరాక్సు సెట్లతో ఉదయం 10:30 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.