Nizamabad

News January 15, 2025

NZB: కేటీఆర్ జైలుకు వెళ్తారు: ఎంపీ అర్వింద్

image

తెలంగాణాలో BRS భూస్థాపితం కాబోతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.

News January 15, 2025

NZB: పసుపు బోర్డుతో అందరికీ లాభం: MP అర్వింద్

image

పసుపు బోర్డుతో కేవలం పసుపు రైతులకే ఉపయోగం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారని, కానీ దాని వల్ల అందరికీ లాభం ఉంటుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పారు. నిజామాబాద్‌లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతులకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 

News January 15, 2025

తాడ్వాయి: గురుకుల పాఠశాలల్లో దరఖాస్తులకు ఆహ్వానం

image

తాడ్వాయి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం సురేఖ తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 23వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 

News January 15, 2025

కామారెడ్డి: అయ్యప్ప ఆలయంలో మకర జ్యోతిని వీక్షించిన భక్తులు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా, శబరిమలైలో భక్తులకు దర్శనమిచ్చే మకరజ్యోతిని వీక్షించేందుకు ఆలయంలో ప్రత్యేక స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. మకర జ్యోతిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘ అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షులు రాజేందర్ ఉన్నారు. 

News January 15, 2025

జాతీయస్థాయి పోటీల్లో ఇందూరు బిడ్డకు స్వర్ణం

image

జాతీయస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అంజలి ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిందని పీడీ అజ్మత్ ఖాన్ తెలిపారు. మహబూబ్ నగర్ లో ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ రాష్ట్ర జట్టు ప్రతిభను చాటారు. జిల్లా చరిత్రలో బంగారు పతకం సాధించడం గొప్ప విషయం అని డైరెక్టర్ సంతోష్ కుమార్, శ్రీదేవి పలువురు అంజలిని అభినందించారు.

News January 14, 2025

NZB: పసుపు రైతుల తరఫున PMకు ధన్యవాదాలు: MP

image

పసుపు రైతుల పక్షాన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. వర్చువల్‌గా మంగళవారం పసుపుబోర్డు ప్రారంభం సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు కోసం నాలుగు దశబ్దాలుగా రైతులు పోరాటం చేస్తున్నారన్నారు. ప్రధాని నిజామాబాద్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పసుపు పండించే రైతులకు మేలు కలుగుతుందన్నారు. 

News January 14, 2025

నవీపేట్: సంక్రాంతి వేడుకల్లో అపశృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చైనా మంజాతో ఓ యువకుడి గొంతుతో పాటు రెండు వేళ్లు తెగాయి. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News January 14, 2025

NZB: గల్ఫ్‌లో యాక్సిడెంట్.. రూ.55 లక్షల పరిహారం

image

గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు కుటుంబానికి రూ.55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి సోమవారం అందజేశారు. 2022లో గల్ఫ్‌లో రాజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. యాబ్ లీగల్ సర్వీసెస్ ద్వారా పరిహారం వచ్చింది. షేక్ ఆల్ అజీజ్, రవుఫ్, మునీత్ తదితరులు పాల్గొన్నారు.

News January 14, 2025

బాల్కొండ: హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి

image

బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.

News January 14, 2025

NZB: పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంగా బోర్డు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అర్వింద్ మంగళవారం వర్చువల్‌గా  ప్రారంభించనున్నారు. పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.