Nizamabad

News September 23, 2024

NZB: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. పదిమంది అరెస్ట్

image

నగరంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వన్ టౌన్ పరిధిలోని నాగేంద్రుడి గుడి వెనకాల గల ప్రదేశంలో పేకాట ఆడుతుండగా వన్ టౌన్ SHO విజయబాబు, తన సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9200 నగదు, రెండు బైక్లు, 9 స్మార్ట్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు.

News September 22, 2024

షబ్బీర్ అలీని కలిసిన నిఖత్ జరీన్

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తనను డీఎస్పీగా నియమించడం పట్లం హర్షం వ్యక్తం చేస్తూ షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

News September 22, 2024

పిట్లం: నీటి కుంటలో పడి రైతు మృతి

image

ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందిన ఘటన పిట్లం మండలం కారేగాంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కారేగాం గ్రామానికి చెందిన బేగరి దశరథం (55) తన పంట పొలానికి నీటిని తోడేందుకు మోటారును పెద్ద చెరువు కుంటలో వేశాడు. మోటారు మోరాయించడంతో దాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News September 22, 2024

నస్రుల్లాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం.. అంకోల్ గ్రామానికి చెందిన కుర్మరామ్‌గోండ(40) శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

News September 22, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్లు

image

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మార్కెట్ కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ మార్కెట్ కమిటీకి ముప్పిడి గంగారెడ్డి, కమ్మర్‌పల్లికి పాలేపునర్సయ్య, వేల్పూర్‌కు కోతినేటి ముత్యం రెడ్డి, బిక్కనూర్‌కు పాత రాజును ఛైర్మన్‌లుగా నియమించారు.

News September 22, 2024

NZB: విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్న నాగన్న గారి బావి

image

లింగంపేట్ మండల శివారులోని అతి పురాతన ప్రసిద్ధిగాంచిన నాగన్న గారి మెట్ల బావి శనివారం సాయంత్రం విద్యుత్ దీపాలతో కాంతులీనుతుంది. శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నాగన్న గారి మెట్ల బావి పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో అధికారులు భావి వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున బావిని సందర్శించారు.

News September 21, 2024

గాంధారి: ఇంట్లో భారీ చోరీ

image

గాంధారి మండలంలోని కమ్మరిగల్లీకి చెందిన కుమ్మరి రంజిత్ ఇంట్లో చోరీ జరిగింది. రంజిత్ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి గురువారం వేములవాడకు వెళ్లి శుక్రవారం వచ్చారు. కాగా అప్పటికి ఇంటి తలుపులు తీసి ఉన్నట్లు, బీరువాలోని 7 తులాల బంగారం, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. ఈ మేరకు సీఐ సంతోష్ కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News September 21, 2024

మోపాల్: పేదరికం జయించి ఎస్సై ఉద్యోగం సాధించాడు

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్‌కు చెందిన లచ్చిరాం- నిర్మల దంపతుల కుమారుడు మూడు అజయ్ పేదరికం జయించి ఎస్సై ఉద్యోగం సాధించాడు. వారి తల్లిదండ్రులు వారికున్న రెండు ఎకరాల భూమిని సాగు చేస్తూ అజయ్‌ను HYDలో ఉన్నత చదువులు చదివించారు. మొదటగా అజయ్ రైల్వేలో ఉద్యోగం సాధించాడు. ఆ ఉద్యోగం చేస్తూనే ఎస్సై జాబ్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఎస్సై ఉద్యోగం సాధించిన అజయ్‌ని గ్రామస్థులు అభినందించారు

News September 21, 2024

కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దోమకొండ అంబర్పేట్‌కి చెందిన వీణ (23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి (24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన సాయి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వీణ సైతం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 21, 2024

ఎల్లారెడ్డి: హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి నిద్రించిన జిల్లా కలెక్టర్

image

ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల వసతి గృహంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించారు. అంతకు ముందు ఆయన విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్నాయా? భోజనం ఎలా ఉంటున్నది? మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

error: Content is protected !!