Nizamabad

News June 20, 2024

NZB: ట్రాక్టర్ పై నుంచి పడి మున్సిపల్ కార్మికురాలి మృతి

image

నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో మున్సిపల్ ట్రాక్టర్ పై నుంచి పడి కార్మికురాలు మృతి చెందింది. డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న కార్మికురాలు లలిత (50) అకస్మాత్తుగా ట్రాక్టర్ పై నుంచి కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడంతోనే లలిత పడిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

News June 20, 2024

నిజామాబాద్‌లోని ఓ బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

image

నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. బోర్గం ప్రాంతంలోని ఓ బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారి తారా సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. బార్‌లో కాలం చెల్లిన ఫుడ్ కలర్, సాస్‌ను సీజ్ చేశారు. నిల్వ ఉంచిన మటన్ కీమా, చికెన్‌ను చెత్త కుప్పలో పడవేశారు. సీజ్ చేసిన వాటిని ల్యాబ్‌కి పంపినట్లు అధికారులు తెలిపారు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బార్‌పై చర్యలు చేపడతామని వెల్లడించారు.

News June 20, 2024

నిజామాబాద్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

నిజామాబాద్‌లోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వినాయక్‌నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆ ఇంటి పై దాడి చేసి ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంజీవ్ తెలిపారు.

News June 20, 2024

కోటగిరి: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. కోటగిరి మండలం కొత్తపల్లికి చెందిన సాయి, పోశవ్వ దంపతులు బైక్‌పై బుధవారం మండల కేంద్రానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి కొత్తపల్లికి వెళ్తుండగా ఏక్లాస్ పూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 20, 2024

ఐఐఎంలో సీటు సాధించిన నాగిరెడ్డిపేట విద్యార్థిని

image

నాగిరెడ్డిపేట మండలంలోని మెల్లకుంట తండా గ్రామానికి చెందిన వీణ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ సైనిక శిక్షణ కళాశాలలో చదువుతూ దేశంలోనే ఉన్నతమైన ఐఐఎం సంబల్పూర్‌లో ఎంబీఏ సీటు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాండురంగ శర్మ, గ్రామస్థులు అభినందించారు.

News June 20, 2024

NZB: ఆర్టీసీలో స్టూడెంట్ పాస్ కోసం దరఖాస్తులు ప్రారంభం

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ కోసం దరఖాస్తులు ప్రారంభమైనట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాఠశాలలు, కళశాలల యాజమాన్యాలు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను చెల్లించి సంబంధిత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News June 19, 2024

బిక్కనూరు: బావమరిదిని చంపిన బావ

image

గడ్డి మందు తాగి ఈనెల 14న రంజిత్ చికిత్స పొందుతూ మృతిచెందిన కేసును  పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బాబా శేఖర్, బిక్కనూర్‌కి చెందిన రంజిత్ కలిసి కొద్దిరోజుల క్రితం ఓ బైక్‌ను దొంగిలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. ఆ బైక్‌ను తానే సొంతం చేసుకోవాలని బాబా శేఖర్ తన బావమరిది రంజిత్‌కు కళ్ళు సీసాలో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సీఐ వెల్లడించారు.

News June 19, 2024

బాన్సువాడ: రూ.2.09లక్షలు పొగొట్టుకున్న యువకుడు

image

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ యువకుడు రూ.2.09 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. తాడ్కోల్ గ్రామానికి చెందిన మహేందర్ ఫోన్‌కు ఈనెల 8న ఓ మెసేజ్ వచ్చింది. క్లిక్ చేయడంతో రూ.400 బోనస్ అతని అకౌంట్లో జమయ్యాయి. దీన్ని నమ్మిన యువకుడు విడతల వారీగా రూ.2.09 లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ఎలాంటి రిఫండ్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

News June 19, 2024

NZB: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో భారీ ర్యాలీ

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డ్‌ను రద్దు చేసి 24 లక్షల నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ NSUI, AISF, SFI, PDSU, PDSU, AIPSU విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో బుధవారం నిజామాబాద్‌లో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

News June 19, 2024

ఇందల్వాయి: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

అప్పుల బాధతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి మండలంలో జరిగింది. ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని త్రియంబకపేట్ గ్రామానికి చెందిన బైరీ గణేశ్ (22) ఏడాది క్రితం బతుకుదెరువుకు సౌదీ వెళ్ళాడు. అక్కడ 6నెలలు గడిపి సరైన ఉపాధి అవకాశాలు దొరక్క తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పులు అధికమవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.