Nizamabad

News March 29, 2024

మద్నూర్‌లో ఘరానా దొంగ అరెస్ట్

image

మండలంలో జరిగిన <<12933675>>భారీ చోరీ<<>> కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రూ.13.50 లక్షల నగదును రికవరీ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మద్నూర్ మండలంలో నివాసం ఉండే మహాజన్ బాలాజీ ఇంట్లో ఈ నెల 26న రాత్రి చోరీ జరిగింది. బీరువాలో దాచిన 25 తులాల బంగారం, నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

News March 29, 2024

అడ్లూరు ఎల్లారెడ్డి శివారులో వ్యక్తి హత్య

image

కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన పెద్ద చెరువు సమీపంలో వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు టవల్ మెడకు బిగించి హత్య చేసినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన కడల సాయిలు (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

News March 29, 2024

సంఘం అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా: ఎంపీ అర్వింద్

image

బుక్స్ పేపర్ అండ్ స్టేషనరీ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. గురువారం నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డులో నిర్మించనున్న సంఘం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యపాల్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

News March 28, 2024

పెద్ద కొడప్గల్: ఎస్సై పై దాడి చేసిన వారిపై కేసు

image

పెద్ద కొడప్గల్ ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై దాడికి పాల్పడిన దుండగులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద ఎస్సై తెలిపారు. బేగంపూర్ గేటు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై కాస్లాబాద్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి గొడవకు దిగి, దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.

News March 28, 2024

NZB: ఎంపీ బరిలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు

image

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే గెలుపు కొరకు మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓటమి పాలైన బాజిరెడ్డి గోవర్ధన్ BRS నుంచి, కోరుట్ల ఎమ్మెల్యేగా ఓటమి పాలైన సిట్టింగ్ ఎంపీ అర్వింద్ ధర్మపురి BJP నుంచి, జగిత్యాల ఎమ్మెల్యేగా ఓటమి పాలైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేయనున్నారు.

News March 28, 2024

కర్ణాటకలో నిజామాబాద్ దంపతుల ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గాయత్రీ నగర్ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి(53)గా పోలీసులు గుర్తించారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవార్ పేట్ పరిధిలోని లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌కు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

NZB: ఎంపీ అభ్యర్థులు ఖరారు.. ఇక సమరమే..!

image

ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో NZB పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు అయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, BRS అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ల పేర్లను ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అందరి అంచనాలను తారుమారు చేస్తూ తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది. ఇక వీరందరూ.. ప్రజాక్షేత్రంలో రాజకీయ సమరం మొదలు పెట్టాల్సి ఉంది.

News March 28, 2024

NZB: అవినీతిలో ‘తగ్గెదేలే’.. ప్రతీ పనికి డబ్బులివ్వాల్సిందే..!

image

ఉమ్మడి NZB జిల్లాలో కొందరు అధికారులు లంచాలు తీసుకోవడంలో తగ్గేది లేదంటున్నారు. కొందరు ఉద్యోగులు ACBకి చిక్కుతున్నా తమ పంథాను మార్చుకోవడం లేదు. ఈ ఏడాది JANలో KMRలో ట్రాన్స్‌కో AE గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. తాజాగా కమ్మర్ పల్లి MPDO ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్ హరిబాబు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకోవడం సంచలనంగా మారింది.

News March 28, 2024

NZB: రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష

image

రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి 8 నెలల జైలుశిక్ష విధిస్తూ రైల్వే మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జూలు శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన గజం సత్యం కలిసి కామారెడ్డి, నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లలో 9 సెల్‌ఫోన్లు దొంగలించారని సాయిరెడ్డి వివరించారు.

News March 28, 2024

నిజామాబాదీలు జర జాగ్రత్త..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీలు దాటుతోంది. నిన్న బుధవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని ముగ్పాల్ మండలం మంచిప్పలో 42.2, నిజామాబాద్ లో 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో 40.9, తాడ్వాయిలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.