Nizamabad

News August 25, 2024

NZB: సభ్యత్వ నమోదు విజయవంతం ఎంతో కీలకం

image

బీజేపీ పార్టీ పోలింగ్ బూత్ స్థాయి నుండి మరింత బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం ఎంతో కీలకమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాలలో ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థ గత నిర్మాణంలో భాగంగా సెప్టెంబరు 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి ఖచ్చితంగా 200 సభ్యత్వం చేయాలని సూచించారు.

News August 24, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

image

* సిర్నాపల్లిలో అంత్యక్రియలో వెళ్లి మృతి చెందిన యువకుడు* పిట్లంలో 3 ఇసుక టిప్పర్లు పట్టివేత* బాన్సువాడ పట్టణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి* ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు* ఆర్మూర్ రుణమాఫీ కోసం వేల సంఖ్యలో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులు* రైతులకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు.

News August 24, 2024

గాంధారి: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పత్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని వారు గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న బంగారం, నగదు చోరికి గురైనట్లు పేర్కొన్నారు.

News August 24, 2024

NZB: కొడుకును చంపిన తండ్రికి పదేళ్ల జైలు శిక్ష

image

కొడుకును చంపిన తండ్రికి పదేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NZB జిల్లా జడ్జి సునీత శక్రవారం తీర్పునిచ్చారు. నవీపేట్ మం. మోకాన్‌పల్లికి చెందిన కిషన్ గతేడాది రూ.9 లక్షలకు పొలం అమ్మాడు. డబ్బులు కావాలని కొడుకు శ్రీకాంత్ అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 14న శ్రీకాంత్ తన తండ్రి ఫోన్ తీసుకోవడంతో అతడిపై కిషన్ కర్రతో దాడి చేసి చంపేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 24, 2024

నిజామాబాద్ జిల్లాలో పెరిగిన చిరుతల సంఖ్య

image

జిల్లాలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతుంది. ఇటీవల పశువులు, జనాలపై చిరుతల దాడులు పెరిగాయి. NZB, ఇందల్వాయి, వర్ని, రేంజల్ పరిధిలో గడిచిన మూడేళ్లలో చిరుతల సంఖ్య 80 వరకు పెరిగింది. కాగా ఆ ప్రాంతం పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుతలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని సౌత్ రేంజ్ ఇన్‌ఛార్జ్ అధికారి రవిమోహన్ సూచించారు.

News August 24, 2024

NZB: DSP రీజినల్ ఇన్‌ఛార్జ్‌గా సుమన్‌కు బాధ్యతలు

image

ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రీజినల్ ఇన్‌ఛార్జ్‌గా కండెల సుమన్‌ను నియమిస్తూ ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ లేఖలో వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం రీజియన్‌లో పార్టీ నిర్మాణ కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఇంతటి బాధ్యతలు అప్పగించినందుకు విశారధన్ మహారాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News August 23, 2024

కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో 9 ఇండ్లలో భారీ చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి వివేకానంద కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, స్నేహపురి కాలనీలలో దొంగలు బీభత్సం సృష్టించారు, 9 ఇండ్లలో బంగారం, వెండి, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు వరకు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరిలోకి వెళ్తే ఇంట్లో విలువైన వస్తువులు ఉంచవద్దని సూచించారు.

News August 23, 2024

ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలే: CP

image

U/S 163 BNSS ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. రేపు ఛలో ఆర్మూర్ పేరిట రైతుల ఆందోళన నేపథ్యంలో CP శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆర్మూర్ డివిజన్ పరిధిలో సంబంధిత అధికారి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ప్రజలు ఏదైనా చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ ఉత్తర్వులు 25వ తేదీ ఉదయం వరకు అమల్లో ఉంటాయన్నారు.

News August 23, 2024

NZB: సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోండి: DEO

image

జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్‌లో 6వ తరగతిలో సీట్లకు ప్రవేశ పరీక్షల కోసం సెప్టెంబర్ 9లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ DEO దుర్గాప్రసాద్ తెలిపారు. దరఖాస్తులను www.navodaya.gov.in, www.nvsadmission classnine.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

News August 23, 2024

NZB: మూడేళ్లలో మురుగుకాలువల్లో పడి ముగ్గురు మృతి

image

ఈ నెల 21న నిజామాబాద్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో మూడేళ్ల చిన్నారి అనన్య మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గత మూడేళ్లలో కాలువలో పడి మృతి చెందిన వారి సంఖ్య మూడుకి చేరింది. 2023లో గౌతంనగర్‌లో 70 ఏళ్ల వృద్ధురాలు, 2022లో అదే కాలనీకి చెందిన 8 ఏళ్ల బాలుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు.

error: Content is protected !!