Nizamabad

News December 19, 2024

ఎంపీ ధర్మపురి అరవింద్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

image

ఎంపీ ధర్మపురి అరవింద్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పీఎస్‌లలో నమోదైన కేసుల్లో విచారణాని ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. బంజారాహిల్స్‌, అబిడ్స్‌ పీఎస్‌లలో అరవింద్‌పై 3 కేసులు నమోదు అయ్యాయి. అప్పటి సీఎం కేసీఆర్‌ను కించపర్చేలా మాట్లాడారంటూ ఫిర్యాదులు రాగా, కేసులను కొట్టేయాలంటూ అరవింద్ పిటిషన్లు దాఖలు చేశారు.

News December 19, 2024

KMR: రూ. 250 కోట్ల రుణాలు జనవరి 31 లోగా పంపిణీ చేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, శ్రీనిధి ద్వారా అర్హత కలిగిన సంఘాలకు రుణాలను 250 కోట్ల రుణాలు పంపిణీ టార్గెట్ ఉందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడువచ్చే జనవరి 31 లోగా టార్గెట్ ప్రకారం లక్ష్యానికి అనుగుణంగా రుణాల పంపిణీ చేపట్టాలన్నారు. అదే విధంగా రుణాల పంపిణీతో పాటు రికవరీ వంద శాతం చేయాలని తెలిపారు.

News December 18, 2024

నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో నేటి చలి తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో చలిప్రభావం తగ్గగా కామారెడ్డి జిల్లాలో చలితీవ్రత నిలకడగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. KMR జిల్లాలో అత్యల్పంగా జుక్కల్ లో 7.6, మేనూర్ 7.8, పుల్కల్ 9.1, బిచ్కుంద 9.2,సర్వాపూర్, బీబీపేట్ లో 9.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా కోటగిరి 8.4,గోపన్ పల్లి, సాలూర లో 9.9,పొతంగల్, రుద్రూర్, తూంపల్లి, మెండోరాలో 10.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 18, 2024

బాల్కొండ: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. అనంతరం వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసిల్దార్ శ్రీధర్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎంపీఓ గంగ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

News December 18, 2024

NZB: అర్ధరాత్రి వరకు హోటల్స్ తెరిచి ఉంచిన ముగ్గురికి జైలు శిక్ష

image

అర్ధరాత్రి వరకు హోటల్లు తెరిచి ఉంచిన ముగ్గురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు వన టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఒలంపియా బేకరీ యజమాని షేక్ అమాన్, స్టార్ హోటల్ యజమాని అస్లాం, న్యూ ప్యారడైస్‌కు చెందిన అత్నూర్ అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు కోర్టులో హాజరుపరచగా అస్లాం, అత్నుస్‌కు ఒకరోజు, అమన్‌కు 2 రోజుల జైలు శిక్ష విధించారు.

News December 17, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు వివరాలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్నటికి, నేటికీ నిలకడగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా జుక్కల్ 6.9, మేనూర్ 7.4, బిచ్కుంద 8.2,సర్వాపూర్, రామలక్ష్మణపల్లి 8.4, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కోటగిరి 8.8, గోపన్ పల్లి 9.1,నిజామాబాద్, సాలుర, పోతంగల్ లో 9.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

News December 17, 2024

NZB: వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

image

ఉమ్మడి NZB జిల్లాలో ఆదివారం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకోగా, రోడ్డు ప్రమాదంలో ఒకరు, గొడవలో గాయపడి మరోవ్యక్తి మృతి చెందాడు. NZBలో షేక్ ఇమ్రాన్, నవీపేట గోదావరిలో దూకి సుధాకర్, మోపాల్‌లో చెరువులో దూకి మహిళ, గాంధారిలో పురుగు మందు తాగి పోశయ్య, దోమకొండలో ఉరేసుకొని రాకేశ్ మృతి. ఇదిలా ఉంటే మోపాల్లో బైక్ అదుపుతప్పి రాములు, NZBలో బైక్ పార్కింగ్ కోసం గొడప పడి యువకుడి మృతి.

News December 17, 2024

NZB: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు

image

నిజామాబాద్ నగరంలో వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్‌ఛార్జి సీపీ సింధు శర్మ ఆదేశాలతో, స్టార్ స్పోర్ట్స్ ఏసీపీ నరేంద్ర చారి తన సిబ్బందితో కలిసి పాంగ్రా బోర్గం ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకోగా, వారి నుంచి 3,500 నగదును సీజ్ చేశారు. అనంతరం నాలుగో టౌన్‌లో అప్పగించారు.

News December 17, 2024

KMR: 229 సైబర్ కేసుల్లోని రూ. 33,14,895 నగదు ఇప్పించాం:SP

image

ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో సైబర్ బాధితులు పోగొట్టుకున్న 229 కేసుల్లోని రూ. 33,14,895 నగదును తిరిగి అప్పగించినట్లు జిల్లా SP సింధూ శర్మ తెలిపారు. గత జూన్, సెప్టెంబర్ తో పాటు శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాల్లో బాధితులు తిరిగి పొందే విధముగా కోర్ట్ ద్వారా వివిధ బ్యాంక్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు SP వివరించారు.

News December 16, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మేనూరులో అత్యల్పంగా 6.9 గా నమోదు అయింది. జుక్కల్ 7.1, బిచ్కుంద 7.5, రామలక్ష్మణపల్లిలో 7.8, లింగంపేట 8.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కోటగిరి 7.5, గోపన్ పల్లి 7.6, మెండోరా 8.2,పోతంగల్ 8.5, సాలూర 8.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.