India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ పార్లమెంట్కు సంబంధించి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఈ స్థానాన్ని ఎంతో కీలకంగా భావించి అభ్యర్థుల ప్రకటన కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రేపోమాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కాగా ఆరూరి రమేశ్కు బీజేపీ నుంచి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిని కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించి బంగపడ్డ ఆయనకు, నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి రఘువీర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న మువ్వా విజయ్బాబును కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను విజయ్బాబు నిర్వర్తించి కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయనకు ప్రభుత్వం గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది.
విధుల్లో ఉన్న ఎంపీవోను ఎంపీపీ ఆగ్రహంతో చెప్పుతో కొట్టిన ఘటన కోడేరులో జరిగింది. బాధితుడి వివరాలు.. పెండింగ్ బిల్లుల విషయంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇరువురు మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎంపీపీ వెంకటరాధ దుర్భాషలాడుతూ.. నా మాట ఎందుకు వినడంలేదంటూ ఎంపీ చెప్పుతో కొట్టి ఆగ్రహంతో వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఎంపీవో శ్రావణ్కుమార్ ఫిర్యాదుతో ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేశారు.
ఉమ్మడి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. ప్రధానంగా ఇంధల్వాయి, డిచ్పల్లి, సిరికొండ, ధర్పల్లి, జుక్కల్ నియోజకవర్గంలో పడిన ఈ రాళ్లతో కోతకు వచ్చిన వరి నేలరాలింది. పూతకు వచ్చిన నువ్వుల పంట విరిగిపోగా.. మామిడి పిందెలు రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అకాల వర్షానికి దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు. SHARE IT
పెద్దపల్లి BSP ఇన్ఛార్జ్, దాసరి ఉష పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర BSP మాజీ అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్తో చర్చించి ఆయన రాజీనామా అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనను నాయకురాలిగా తీర్చిదిద్దిన పార్టీకి రుణపడి ఉంటానని చెప్పారు. కాగా, మోదీ బెదిరింపులతోBSP, BRS పొత్తు రద్దు కావడంతో వీరు రాజీనామా చేశారు.
నిర్మల్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టణంలో శనివారం తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని హోటల్లు, మిల్క్ సెంటర్ యజమానులకు జరిమానా విధించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వాసు రామ్ తెలిపారు. మూడు హోటల్లు, మూడు మిల్క్ సెంటర్లకు రూ. 92000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఆహారాన్ని కల్తీ చేయవద్దని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కేశవపట్నంకి చెందిన తిరుపతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కేశవపట్నం నుంచి హుజురాబాద్ వెళ్తున్న టాటా ఏసీ ట్రాలీలో ప్రయాణిస్తున్న తిరుపతి, డ్రైవర్ గఫర్ హుజురాబాద్ మండలం సింగపూర్ శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తిరుపతి అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.
లోకసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విధివిధానాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదివారం వెల్లడించనున్నట్లు డిపిఆర్ఓ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ హాజరుకావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.