RangaReddy

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

News September 2, 2025

HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

image

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

News September 2, 2025

HYD: గణేశ్ నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

image

గణేశ్ నిమజ్జనానికి GHMC ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కమిషనర్ కర్ణన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలను పరిశీలించారు. బారీకేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశామన్నారు.

News September 1, 2025

RR: వేతనాలు మంజూరు చేయండి సారూ.!

image

తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రాతిపదికన పనిచేస్తున్న బోధన, ఇతర సిబ్బంది వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు ఉద్యోగుల వేతనాలు మంజూరు చేయడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి, పెండింగ్‌లోని వేతనాలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

News August 30, 2025

రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటర్ లిస్ట్ ఇదే

image

స్థానిక సంస్థల ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 526 గ్రామపంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 7,52,254 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 3,76,873 మంది పురుషులు, 3,75,353 మంది మహిళలు, 28 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వార్డుల వారీగా మొత్తం 4,682 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ ఇవాళ్టితో లాస్ట్.

News August 30, 2025

రంగారెడ్డి: ఆశవర్కర్లు జ్వర సర్వే చేపట్టాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, జ్వర సర్వే చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు ప్రబలే ప్రాంతాలను గుర్తించాలని, ఫాగింగ్, రెసిడ్యుల్ స్ప్రే చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగించాలని, ఆశవర్కర్లు ప్రతిరోజు 50 ఇళ్లను సందర్శించి జ్వర సర్వే చేపట్టాలన్నారు.

News August 30, 2025

RR: ఓటర్ లిస్టులో మీ వివరాలు మార్చాలా?

image

పంచాయతీ ఎన్నికల సమరానికి ఓటర్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పొరపాట్లు ఉన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా, అభ్యంతరం వ్యక్తం చేయాలన్నా MPDO, పంచాయతీ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి.
→ Form-6: కొత్తగా పేరు చేర్చుకోవడానికి
→ Form-7: చెల్లని పేరు తొలగించే అభ్యంతరానికి
→ Form-8: పేరు, అడ్రస్, ఇతర కరెక్షన్స్‌కు
→ Form-8A: ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడానికి
నేడే దీనికి ఆఖరు తేది.

News August 29, 2025

RR: మీసేవ కేంద్రాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

మీసేవ కేంద్రాల ఏర్పాటుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని RR జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గండిపేట మండలం వట్టినాగులపల్లి, గండిపేట, కిస్మత్ పూర్, గంధంగూడ, మొయినాబాద్‌లోని అజీజ్ నగర్, హిమాయత్‌నగర్, కనకమామిడి, చౌదరిగూడలోని తుంపల్లి, ఎదిర, సరూర్‌నగర్‌లోని తుమ్మబౌలి, మంచాలలోని లోయపల్లిలో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 29, 2025

HYD: బుల్లెట్లను క్యారీ చేస్తున్న నిందితుడు ఇతడే

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం రేపిన విషయం తెలిసిందే. అమృత్‌సర్ ప్రయాణికుడి లగేజీలో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు 8 లైవ్ బుల్లెట్లు గుర్తించారు. 32 ఏళ్ల పంజాబ్ వాసి సుఖ్దీప్‌సింగ్ ఇండిగో విమానంలో ఢిల్లీ మీదుగా అమృత్‌సర్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. లగేజీలో చెకింగ్‌లో పట్టుబడగా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News August 28, 2025

రంగారెడ్డి: ఐక్యతకు ప్రతీకగా అన్నసాగర్

image

యాలాల మండలం అన్నసాగర్ గ్రామం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు ఏకతాటిపై పండుగలు జరుపుకుంటాయి. ప్రతి సంవత్సరం అంజనేయస్వామి ఆలయంలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు పూజలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం గ్రామస్థుల మధ్య సోదరభావాన్ని పెంచుతోంది.