RangaReddy

News May 8, 2025

ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News May 7, 2025

హయత్‌నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

image

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2025

నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

News May 7, 2025

HYDలో 3 ప్రాంతాల్లో వ్యభిచారం.. అరెస్ట్

image

HYDలో‌ వ్యభిచార స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 48 గంటల్లో 3 చోట్ల ఈ ముఠాలకు చెక్ పెట్టారు. గురువారం బంజారాహిల్స్‌లో ఇద్దరు యువతులతో విటులు పట్టుబడ్డారు. శుక్రవారం లాలాగూడలో వ్యభిచారం చేయిస్తూ ఉగండా దేశస్థులు చిక్కారు. శ్రీనగర్‌కాలనీలోని ఓ స్పా సెంటర్‌లో తనిఖీ చేయగా ఆరుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News May 7, 2025

హైదరాబాద్‌లో పాకిస్థాన్ యువకుడి అరెస్ట్

image

ఉగ్రదాడి అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ జాతీయులను వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఇటువంటి సమయంలో పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. నగర యువతిని పెళ్లి చేసుకున్న ఫయాజ్ ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డాడు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

News May 7, 2025

HYD‌లో ఎన్నిక.. BJP వైపు మళ్లిన ఒక్కరు!

image

HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్‌లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

News May 7, 2025

HYD: ఓయూలో పరీక్షలు వాయిదా

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్‌డీ (పీహెచ్‌డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేసుకున్నట్లు వివరించారు. తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.SHARE IT

News April 25, 2025

HYD: విద్యార్థులూ.. ఈ నంబర్లకు కాల్ చేయండి!

image

ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. త్వరలో 10వ తరగతి ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఎగ్జామ్‌లో పాసైన వారి సంగతి అటుంచితే ఫెయిల్ అయిన వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వారికి భరోసా ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మానసిక వేదనకు గురవుతున్న వారు ఈ నంబర్లకు 7893078930, 04066202000, 9493238208, 9152987821, 14416 కాల్ చేయండి. వీరి సూచనలు ఒత్తిడిని తగ్గిస్తాయని అధికారులు చెబుతున్నారు.

News April 25, 2025

HYD: పచ్చటి కాపురంలో కలహాల చిచ్చు..!

image

పెళ్లైన కొన్నేళ్లకే ఆలుమగల మధ్య విభేదాలు పచ్చటి కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. చిన్నవాటిని పెద్దగా చూస్తూ కాపురంలో సర్దుకోలేక HYD ఉమెన్ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. వారి మధ్య అన్యోన్యత దెబ్బతింటుందని, పెళ్లయ్యాక లావు అయ్యావని, అంతకు ముందు నువ్వు ఇలా లేవని ఒకరినొకరు దూషించుకుంటున్నట్లు ఉప్పల్ WPS పోలీసులు తెలిపారు.

News April 24, 2025

బల్కంపేట ఎల్లమ్మ గుడిలోని సంపులో పడి వ్యక్తి మృతి

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి సంపులో పడి మృతిచెందాడు. కాచిగూడకు చెందిన బి.బాలాజీ (48) కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ ఆలయానికి వచ్చాడు. అక్కడ నీటి సంపులో ఫోన్‌ పడిపోయింది. ఫోన్‌ తీసేందుకు యత్నించి సంపులో పడిపోయాడు. సిబ్బంది నిచ్చెన సాయంతో బాలాజీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.