Warangal

News September 18, 2024

రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి కొండా సురేఖ

image

రాష్టంలోని పలు దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, తదితర అంశాలపై సెక్రటేరియట్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్ రావు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 18, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ

image

వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీకి అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన మెదక్ ఎంపీకి స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

News September 18, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,810

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. ఈరోజు రూ.7,810కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News September 18, 2024

పద్మాక్షి అమ్మవారి శరన్నవరాత్రులకు రావాలని సీఎంకు ఆహ్వానం

image

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవికి వచ్చేనెల 3 నుంచి 14 వరకు శరన్నవరాత్రులు జరుగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-గీతా రెడ్డి దంపతులను పద్మాక్షి అమ్మవారి దేవాలయ వేద పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని కలిసి ఆహ్వానించారు. సీఎంకు అమ్మవారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.

News September 18, 2024

రైలు కిందపడి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

image

రైలు కిందపడి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన విజ్ఞాన్(32) తల్లి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో తల్లికి ఏమైనా జరుగుతుందేమోనని భయాందోళనకు గురైన విజ్ఞాన్ చింతలపల్లి రైల్వేగేటు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News September 18, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MHBD: చేపల వేటకు వెళ్ళి వ్యక్తి మృతి..
> WGL: మట్కా నిర్వహిస్తున్న మహిళా అరెస్టు..
> MHBD: బైక్ అదుపు తప్పి ఒకరికి తీవ్ర గాయాలు…
> WGL: బట్టల బజార్ మ్యాచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం..
> MHBD: గంజాయి పట్టివేత…
> WGL: మతిస్తిమితం లేని మహిళపై అత్యాచారం…
> WGL: అనారోగ్యంతో ప్రయాణికుడు మృతి…

News September 17, 2024

WGL: ఘోరం.. మతిస్తిమితం లేని మహిళపై అఘాయిత్యం

image

MHBD(D) కేసముద్రం(M)లో మతిస్తిమితం లేని మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 10న ఇద్దరు యువకులు సదరు మహిళ ఇంటికి వెళ్లారు. వారిలో ఒకరు ఆమె కొడుకును బయటకు తీసుకెళ్లగా, మరొక వ్యక్తి అత్యాచారం చేశాడు. బయటకు వెళ్లేటప్పుడు ఆమె కొడుకు ఫోన్‌లో వీడియో రికార్డింగ్ పెట్టి వెళ్లడంతో ఈ విషయం బయటపడింది. మహిళ కుటుంబం ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది.

News September 17, 2024

వరంగల్: అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు

image

వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్ జంక్షన్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ, కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ సత్యశారదదేవి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు ఉన్నారు.

News September 17, 2024

వరంగల్: జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్, ఎంపీ

image

వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యఅతిథి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

News September 17, 2024

MHBD: బ్రెయిన్ ట్యూమర్‌తో యువతి మృతి

image

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ.. యువతి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీనగర్‌కు చెందిన హరిదాస్యపు వైష్ణవి(24) బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో గత కొద్ది రోజులుగా బాధపడుతోంది. కాగా, చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.