India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉపాధ్యాయ వృత్తి సవాల్ లాంటిదని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సహనం, ఓర్పు, సమన్వయంతో పనిచేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయ్యేలా కృషి చేయాలన్నారు.
> WGL: రాయపర్తిలో దొంగల బీభత్సం
> BHPL: గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
> MLG: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
> BHPL: చెరువులో పడి పశువుల కాపరి మృతి
> JN: ఎమ్మార్వో ఆఫీస్ ముందు పురుగు మందుతో మహిళా ఆందోళన
> MLG: జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం
> HNK: స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్టు మృతదేహం
> WGL: బాలికను వేధించిన కేసులో యువకుడిపై పోక్సో కేసు
> WGL: WAY2NEWS స్పెషల్.. ఓరుగల్లు కీర్తి, వరంగల్ దీప్తి..
> MHBD: ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు: త్రిపుర గవర్నర్
> WGL: రేపు నిర్వహించే జాబ్ మేళా వాయిదా
> JN: కొమురవెల్లి దేవస్థానానికి మహిళా అఘోర
> HNK: జిల్లా కేంద్రంలో సందడి చేసిన గంగవ్వ
> WGL: దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ మృతి
> BHPL: ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
భద్రాది కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు కమిటీ డివిజన్ కమిటీ ఆజాద్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టు లేక కలకలం రేపుతుంది. రఘునాధపాలెంలోనే జరిగిన ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పనేనని, మావోయిస్టు పార్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే ఎజెండా అన్నారు. ఈ ఎన్కౌంటర్కు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్కు నిరసనగా ఈనెల 9న భద్రాద్రి జిల్లా బందుకు పిలుపునిచ్చారు.
కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో గురువారం అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్న విధానాన్ని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డ్రోన్ పథకం ద్వారా సులభతరమైన పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చన్నారు. ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమని, ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని అన్నారు.
జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సెప్టెంబర్ 6 శుక్రవారం (రేపు) నిర్వహించే జాబ్ మేళా రద్దు అయినట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాబ్ మేళను వాయిదా వేసినట్లు వారు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలో తెలుపుతాం అన్నారు.
తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్నిస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకల్లో ఎంపీ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. చదువు చెప్పే వారు మాత్రమే గురువులు కాదని, సన్మార్గంలో నడిపించే ప్రతి ఒక్కరూ గురువులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT
విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక భూమిక వహిస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు ఎంపీ కావ్య శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు.
విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని మంత్రి సీతక్క అన్నారు. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చదువు మాత్రమే అన్ని రకాల అణచివేతలు, నిర్బంధాల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.