Warangal

News September 5, 2024

వరంగల్: దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ మృతి

image

WGL జిల్లాలో విషాదం నెలకొంది. దేశానికి కాంస్యం తీసుకొచ్చిన దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ బుధవారం మృతి చెందారు. RDF స్కూల్‌లో PETగా పనిచేసిన వెంకటేశ్వర్లు మొదటగా దీప్తి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. దీప్తి విజయం వెనక ఉన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. గత 6-7 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. జాతీయ స్థాయి క్రీడల్లో ఎందరో విద్యార్థులు రాణించడానికి ఈయన కృషి చేశారు. SHARE

News September 5, 2024

వరంగల్: దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ మృతి

image

WGL జిల్లాలో విషాదం నెలకొంది. దేశానికి కాంస్యం తీసుకొచ్చిన దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ బుధవారం మృతి చెందారు. RDF స్కూల్‌లో PETగా పనిచేసిన వెంకటేశ్వర్లు మొదటగా దీప్తి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. దీప్తి విజయం వెనక ఉన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. గత 6-7 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. జాతీయ స్థాయి క్రీడల్లో ఎందరో విద్యార్థులు రాణించడానికి ఈయన కృషి చేశారు. SHARE

News September 4, 2024

ట్విట్టర్ వేదికగా దీప్తికి మంత్రి అభినందనలు

image

తెలుగు రాష్ట్రాల నుంచి పారా ఒలంపిక్స్‌లో తొలి పథకాన్ని సాధించిన ఓరుగల్లు బిడ్డ దీప్తి జీవాంజికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. ఎన్నో కష్టాలను అధిగమించి ప్రపంచ వేదికపై కాంస్య పతకాన్ని గెలుచుకోవడం దేశానికే గర్వకారణమన్నారు. పేద కుటుంబం నుంచి పతక విజేత వరకు దీప్తి సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో మంత్రి అభినందనలు తెలిపారు.

News September 4, 2024

WGL: మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి

image

మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @దాదా రణదేవ్ దాదా మృతిచెందాడు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో అతను మృతిచెందినట్టు దంతేవాడ పోలీసులు ధ్రువీకరించారు. మరణించిన జగన్ స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం టేకులగూడెమని దంతేవాడ ఎస్పీ ప్రకటించారు.

News September 4, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రికార్డు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మొక్కజొన్న ధర ఎవరూ ఊహించని ధర పలికి రికార్డు క్రియేట్ చేసింది. కాగా, గత వారం రూ.2,910 ధర పలికి రికార్డు నమోదు చేసిన మొక్కజొన్న నిన్న రూ.2,858కి తగ్గింది. అయితే ఈరోజు మార్కెట్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.2,970 ధర పలికింది. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 4, 2024

దీప్తిని ప్రశంసించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

image

పారిస్ వేదికగా జరుగుతోన్న Paralympics2024లో దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన జీవాంజి దీప్తి మనందరికి గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

News September 4, 2024

వరంగల్: కటిక పేదరికం.. కాంస్య పతకం

image

జీవాంజీ దీప్తి. ఇప్పుడు ఏనోట విన్నా ఇదే పేరు. పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పథకాన్ని సాధించింది. విశ్వ క్రీడల్లో నెగ్గి ఓరుగల్లు మెడలో మొదటి మెడల్ వేసింది. దీప్తి స్వగ్రామం WGL జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. వీరిది నిరుపేద కుటుంబం. దీప్తి పతకం నెగ్గి ఓరుగల్లుకు గర్వకారణంగా నిలిచింది.

News September 4, 2024

వరదలతో గ్రేటర్ వరంగల్‌కు రూ.20 కోట్ల పైనే నష్టం

image

భారీ వర్షాలు, వరదలతో గ్రేటర్ వరంగల్‌కు రూ.20 కోట్ల పైనే నష్టం వాటిల్లిందని ఇంజినీర్లు తాత్కాలిక అంచనాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో పూర్తిస్థాయి నష్టం అంచనా వేసేందుకు మంగళవారం బల్దియా ఇంజినీర్లు రంగంలోకి దిగారు. ఇంజినీరింగ్, ప్రజా రోగ్యం, డీఆర్ఎఫ్ విభాగాల నుంచి వరద నష్టం వివరాలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ అశ్విని తానాజీ ఆదేశించారు.

News September 4, 2024

HNK: ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం

image

దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ఉపకార వేతనం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ వి.హనుమంతు తెలిపారు. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www.india-post.gov.in గల వెబ్‌సైట్లో పరిశీలించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 13లోపు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, హనుమకొండ చిరునామాలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News September 4, 2024

మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలి: జనగామ కలెక్టర్

image

వినాయక చవితి పండుగ పురస్కరించుకొని ప్రజలు మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని, కాలుష్య నియంత్రణకు సహకరించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలని వినియోగించాలని రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలతో ఉన్న ప్రతిమలను వినియోగించొద్దన్నారు.