Warangal

News April 10, 2025

ములుగు: UPDATE.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని హత్య

image

ములుగు జిల్లా వాజేడు మండలంలో <<16046948>>దారుణ హత్య జరిగిన విషయం<<>> తెలిసిందే. సీఐ కుమార్ తెలిపిన వివరాలు.. టేకులగూడెంకు చెందిన బుల్లబ్బాయి మద్యానికి డబ్బు ఇవ్వాలని తన అన్న విజయబాబును అడిగాడు. తన వద్ద లేవని చెప్పడంతో కోపంతో పదునైన ఆయుధంతో ముఖంపై దాడి చేసి హత మార్చాడు. విజయబాబు చిన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

News April 10, 2025

WGL: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

image

ఉమ్మడి WGL జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు WGL, MHBD, జనగామ, HNK, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ములుగులో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. జర జాగ్రత్త. SHARE IT

News April 9, 2025

వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

image

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

News April 9, 2025

భూపాలపల్లి: పెళ్లి కావట్లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావట్లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిట్యాల మండలం వెంచరామికి చెందిన లక్ష్మణ్(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. తన అమ్మానాన్న చనిపోవడంతో చిన్నమ్మ వద్ద ఉంటున్నాడు. తన కంటే చిన్నవాళ్లకు పెళ్లవుతుందని మనస్తాపంతో పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. లక్ష్మణ్ చిన్నమ్మ కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2025

వరంగల్‌లో CONGRESS VS BRS

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

News April 9, 2025

వరంగల్: వారు దరఖాస్తు చేసుకోండి!

image

ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులు జులై- 2025లో ప్రైవేట్ అభ్యర్థులుగా ఐటీఐ పరీక్షలు రాసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీఐ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లలో 3 ఏళ్లు పైబడిన సర్వీస్ సర్టిఫికెట్, ఎంప్లాయ్ గుర్తింపు కార్డు సమర్పించి ములుగు రోడ్డు వరంగల్ కార్యాలయంలో ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 9, 2025

వరంగల్: నేలకొరిగిన మునగ చెట్లు

image

దుగ్గొండి మండలం శివాజీ నగర్ గ్రామంలో బుస్సారి రామారావు అనే రైతు రెండెకరాల్లో మునగ తోట సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులు రావడంతో మునగ చెట్లు నేలకొరిగాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరుకుతున్నాడు. దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, మిరప తోటలు ఈదురు గాలులతో నేలకొరిగాయి. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

News April 9, 2025

నెక్కొండలో లక్క పురుగుల నుంచి కాపాడండి!

image

నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల లక్క పురుగుల ద్వారా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లక్క పురుగుల నుంచి తమకు కాపాడాలని కోరుతున్నారు. సంబంధిత గోధుమలను తనిఖీ చేసి నివారణ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని తెలుపుతున్నారు.  

News April 9, 2025

జాబ్ మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు: వరంగల్ కలెక్టర్

image

ఈనెల 11న వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్‌లో జరిగే జాబ్ మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈనెల 11న ఉదయం 9:30 గంటల నుంచి జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై నిర్వాహ‌కులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.

News April 9, 2025

WGL: పలు సూచనలు చేసిన వాతావరణ శాఖ అధికారులు

image

వరంగల్ జిల్లా వాతావరణ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. వరంగల్ జిల్లాలోకి ఇప్పుడు తీవ్రమైన తుఫాను కదులుతుందని తెలిపారు. ప్రస్తుతానికి మహబూబాబాద్‌తో పాటు పలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల్లో తీవ్రమైన తుఫానులు, గాలులు విస్తరించబోతున్నాయని పేర్కొన్నారు. కాగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.