Warangal

News September 2, 2024

దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్

image

హనుమకొండ 48వ డివిజన్ పరిధిలోని హాజరత్ సయ్యద్ షా ఆఫ్జాల్ బియబాని దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట MLA నాగరాజు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ, పీఠాధిపతి ఖుస్రో పాషా, మత పెద్దలు తదితరులున్నారు.

News September 2, 2024

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ

image

మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎంపీ బలరాం నాయక్ పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలతో ఎంపీ మాట్లాడి ప్రజలకు ధైర్యం చెప్పి నిత్యం అండగా ఉంటామని చెప్పారు. వరదల వల్ల తెగిపోయిన రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఎంపీ కోరారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి WGL జిల్లాలో జరిగిందిదే! 1/3

image

> దుగ్గొండి: నీటి వరదకు కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం
> మరిపెడ: ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయి అశ్విని అనే యువతి మృతి
> కేసముద్రం: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> మరిపెడ: కూలిన జాతీయ రహదారి.. రాకపోకలు బంద్
> భూపాలపల్లి: సింగరేణికి రూ.35 లక్షల వరకు నష్టం
> తాడ్వాయి: పశువుల మేత కోసం వెళ్లి ఒకరి మృతి
> WGL: పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలు
> MHBD: జిల్లాలో తెగిన పలు చెరువు కట్టలు, రోడ్లు

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి WGL జిల్లాలో జరిగిందిదే! 1/1

image

> దుగ్గొండి: నీటి వరదకు కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం
> మరిపెడ: ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయి అశ్విని అనే యువతి మృతి
> కేసముద్రం: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> మరిపెడ: కూలిన జాతీయ రహదారి.. రాకపోకలు బంద్
> భూపాలపల్లి: సింగరేణికి రూ.35 లక్షల వరకు నష్టం
> తాడ్వాయి: పశువుల మేత కోసం వెళ్లి ఒకరి మృతి
> WGL: పలు ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలు
> MHBD: జిల్లాలో తెగిన పలు చెరువు కట్టలు, రోడ్లు

News September 2, 2024

WGL, MHBD పోలీసులను అభినందించిన డీజీపీ

image

భారీ వర్షాలకు వరదలతో MHBD, నెక్కొండ, కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వరంగల్, మహబూబాబాద్ పోలీస్ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను అభినందిస్తూ డీజీపీ జితేందర్ “X”లో పోస్ట్ చేశారు. రైళ్లలో ఉండిపోయిన దాదాపు 5,616 మంది ప్రయాణికులను పోలీసులు వివిధ వాహనాల ద్వారా కాజిపేట రైల్వే స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వరంగల్ సీపీ, మహబూబాబాద్ ఎస్పీ, పోలీస్ సిబ్బందిని అభినందించారు.

News September 2, 2024

HATS OFF.. మహబూబాబాద్ జిల్లా పోలీస్

image

భారీ వర్షం ధాటికి మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అయింది. వర్షం దంచి కొట్టడంతో ప్రజలు వణుకుతూ ఇళ్లలోనే తలదాచుకున్నారు. మహబూబాబాద్ జిల్లా పోలీసులు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరద ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో ప్రయాణికులకు ఆహారం, మంచినీటిని అందజేసి మానవత్వం చాటుకున్నారు.

News September 2, 2024

BIGBOSSలోకి వరంగల్ యువకుడు

image

ప్రముఖ రియలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 ఆదివారం మొదలైంది. ఇందులో వరంగల్‌కు చెందిన నబీల్ అఫ్రిది చోటు దక్కించుకున్నాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంతే ఇష్టం. కాగా, నబీల్ వరంగల్ డైరీస్ యూట్యూజ్ ఛానల్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

News September 2, 2024

కేసముద్రం: రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో కేసముద్రం ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ-వరంగల్ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిపివేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది త్వరితగతిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

News September 1, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> MHBD: సలాం పోలీసన్న.. జోలె కట్టి వృద్ధురాలిని ఒడ్డుకు చేర్చిన పోలీసులు
> WGL: జిల్లా వ్యాప్తంగా వర్షం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువులు
> MLG: లక్నవరం వేలాడే వంతెన పైకి వరద
> MHBD: భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> MLG: బొగతా జలపాతం ఉగ్రరూపం
> HNK: విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: ఎమ్మెల్సీ
> MHBD: రాళ్లవాగులో చిక్కుకున్న డీసీఎం
> JN: వరద ప్రవాహంలో గల్లంతయిన మేకలు

News September 1, 2024

రేపు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అన్ని కాలేజీలకు సెలవు

image

భారీ వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో సోమవారం అన్ని యూనివర్సిటీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి తెలిపారు. అదేవిధంగా అన్ని డిగ్రీ, పిజి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది పరీక్షల నియంత్రణ అధికారి ద్వారా తెలియజేస్తామన్నారు.