India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ రిజర్వ్డ్ ఎస్సై BC(A)లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడో బెటాలియన్లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.
అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని పెండింగ్ పనులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. WGL కలెక్టరేట్, నూతన బస్టాండ్, సూప్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని, కాజీపేట రైల్వే ఫ్లై-ఓవర్ చేపట్టాలని కోరుతున్నారు. టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?
TGPSC విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్లో నయీంనగర్కి చెందిన పులి సాయితేజ 507 మార్కులతో సత్తా చాటారు. సాయితేజ్ తండ్రి కిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా సాయితేజ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచారు.
కరీంనగర్లోనే లోయర్ మానేరు డాం వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనులు కొనసాగుతున్నందున నేడు ఉదయం 8గంటల నుంచి 6గంటల వరకు నీటి సరఫరా జరగదని మున్సిపల్ అధికారులు తెలిపారు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం, మడికొండ, కడిపికొండ బట్టుపల్లి రాంపూర్ ఎల్లాపూర్ నేటి సరఫరా జరగదని పేర్కొన్నారు. ఇట్టి ప్రాంతవాసులు గమనించి సహకరించాలని ఎస్సీ ప్రవీణ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..1/2 సాగునీటి తీరును క్షేత్రస్థాయిలో అధికారులు కలిసి పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు సాగునీరు అందించేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరగాలని హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద అన్నారు. పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, బల్దియా కమిషనర్ పరిశీలించారు. పూడిక తీత మట్టి తరలింపు రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలకు సంబంధించి వేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులు మట్టి తరలించేందుకు ఇచ్చే వాహనాల రూట్లను పరిశీలించారు.
రాయపర్తి మండల పరిధిలో, ఉకల్, ఘటికల్, జగన్నాథపల్లి, గ్రామాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీబీఎం 54, 57, కాల్వ వరి పంట పొలాలను కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ సందర్భంగా వరికి నీరును సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సత్య శారద అదేశించారు. వరి సాగు చేసే రైతులకు నూతన పద్ధతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
మంత్రి కొండా సురేఖ తన CMRF చెక్కును అందజేశారు. చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రశాంత్ కుమారుడు నయన్ కుమార్ మాటలు రాక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏ హాస్పటల్కి పోయినా రూ. 8 నుంచి 10లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచనతో తక్షణమే వారి పరిస్థితి తెలుసుకొని కింగ్ కోటిలోని ప్రభుత్వ ENT ఆసుపత్రికి రూ. 8లక్షలను CMRF చెక్కును మంత్రి అందజేశారు.
Sorry, no posts matched your criteria.