India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం వరకు 105 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సంగెంలో 18.4, నెక్కొండ 15.1, పర్వతగిరి 13.8 మి.మీ. వర్షం కురిసింది. చెన్నారావుపేటలో 12.3, ఖిల్లా వరంగల్, వర్ధన్నపేటలో 7.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. తక్కువగా వరంగల్ పట్టణంలో 2.4 మి.మీ. వర్షం నమోదైంది.
అర్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న సెంటర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇద్దరు నకిలీ డాక్టర్లను పట్టుకున్నట్లు కౌన్సిల్ సభ్యుడు డా.వి.నరేశ్ కుమార్ తెలిపారు. వరంగల్, కాశిబుగ్గ తిలక్నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తూ డాక్టర్ అని పోస్టర్లు కొట్టించుకొని, ఆర్ఎంపీల జిల్లా ప్రెసిడెంట్గా చెప్పకుంటూ రోగులను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు.
పెండింగ్ భూ భారతి సమస్యలపై నివేదికలు తయారు చేయాలని ఆర్డీవో, తహశీల్దార్లకు కలెక్టర్ సత్య శారద సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. భూ భారతి దరఖాస్తుల పెండెన్సీపై సమీక్ష నిర్వహించి, వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు 199.3 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 15.3 మి.మీ.గా ఉంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 24.9 మి.మీ. వర్షం కురిసింది. ఖానాపూర్, దుగ్గొండి మండలాల్లో 24 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేటలో 22.3, గీసుగొండ, వరంగల్లో 16.3 మి.మీ. వర్షం పడింది.
రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ నవరాత్రి ఉత్సవాలను పోలీసులు సూచించిన నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. మండప నిర్వాహకులు పాటించాల్సిన నియమావళిపై ఆయన పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 92 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ సత్య శారద తెలిపారు. వీటిలో అత్యధికంగా భూ సమస్యలపై 33, జీడబ్ల్యూఎంసీకి 18, గృహ నిర్మాణ శాఖకు 9, వైద్యారోగ్య, విద్యా శాఖలకు 4 చొప్పున ఫిర్యాదులు అందాయి. మిగిలిన 24 ఫిర్యాదులు ఇతర శాఖలకు సంబంధించినవి అని కలెక్టర్ పేర్కొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్న ఆయన వరంగల్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
వర్ధన్నపేట మండలం ఇల్లంద సమీపంలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు తుల్లా యాకమ్మ(58)ను ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈ నెల 17, 18 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. వాగులు, వంకల సమీపంలో ఉన్న ప్రమాదకరమైన రోడ్లపై ప్రజలను అప్రమత్తం చేయాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
వరంగల్ జిల్లాలో గత 24 గంటలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో 40.0 మి.మీ వర్షపాతం నమోదైంది. నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 114.8 మి.మీ, దుగ్గొండిలో 99.5 మి.మీ, నర్సంపేటలో 61.8 మి.మీ, సంగెంలో తక్కువగా 12.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.