India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయదశమి పర్వదినం సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. దుర్గాదేవి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, ఈ దసరా అందరికీ విజయాలను చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు.
వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 23, 27న పోలింగ్ జరగనుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల హ్యాండ్బుక్పై సంపూర్ణ అవగాహనతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు.
దసరా రోజు పాలపిట్టను చూడటం శుభమని నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ఈ విశ్వాసంతో కొందరు అత్యుత్సాహానికి లోనై పాలపిట్టలను పట్టి పంజరాల్లో బంధిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఫలితంగా ఈ అరుదైన పక్షి ఉనికే ప్రమాదంలో పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాధాన్యం కలిగిన 104 పక్షి జాతుల్లో పాలపిట్ట ఒకటి. వాటిని పట్టి బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టానికి విరుద్ధమని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. వరంగల్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అక్టోబర్ 23, 27 తేదీల్లో రెండు విడతలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని జయరామ్ తండా(S) గ్రామ పంచాయతీ పరిధిలోని సుక్య తండాకు చెందిన సంతోశ్ కుమార్ గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. పర్వతగిరి మండలం పెద్దతండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సంతోశ్ గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ఎక్సైజ్ శాఖ ఎస్సైగా ఎంపికయ్యారు. దీంతో తండావాసులు అభినందలు తెలుపుతున్నారు.
సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టరేట్కు రావద్దని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా ప్రజావాణి ఉంటుందని పేర్కొన్నారు.
కేయూ పరిధిలో LLB మూడేళ్ల ‘లా’ కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. అక్టోబర్ 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 14న మూడో పేపర్, 16న నాలుగో పేపర్, 18న ఐదో పేపర్ పరీక్షలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని అన్నారు.
వరంగల్ జిల్లా ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.
1 నర్సంపేట ST (మహిళ)
2 ఖానాపూర్ ST (జనరల్)
3 వర్ధన్నపేట SC (మహిళ)
4 గీసుకొండ SC (జనరల్)
5 నల్లబెల్లి BC (జనరల్)
6 నెక్కొండ BC (జనరల్)
7 సంగెం BC (మహిళ)
8 రాయపర్తి BC (మహిళ)
9 పర్వతగిరి BC (జనరల్)
10దుగ్గొండి OC (జనరల్)
11 చెన్నారావుపేట OC కేటాయించారు.
స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో, ఇతర అధికారులు.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్లను ఖరారు చేపట్టారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల వారీగా రిజర్వేషన్ల ఖరారు చేసి ప్రకటిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.