India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> MLG: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: SP
> MHBD: నెల్లికుదురులో నల్లబెల్లం పట్టివేత
> WGL: నెక్కొండలో రేషన్ బియ్యం పట్టివేత
> MLG: కంతనపల్లి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
> MHBD: పిడుగుపాటుతో రైతు కూలీ మృతి
> MHBD: చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా
> HNK: జూద కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
> MLG: గొల్లగుడి ఆలయ ఘటనపై కేసు నమోదు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.6 వేలు పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,400 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.14,000 ధర, పసుపునకు రూ.13,767 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.
ట్రైన్ నంబర్- 16032 అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలును నేడు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరంగల్, హసన్పర్తి, కాజీపేట ప్రాంతాల మీదుగా వెళ్లే రైలును రద్దు చేస్తున్నందుకు చింతిస్తున్నామని, దీన్ని గమనించాలని సూచించారు. దేవి కత్రా వద్ద రాత్రి 10:25 ప్రారంభం కావాల్సి ఉండగా రద్దు చేశారు.
వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు నిజాయితీగా సేవలందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు కేటాయించిన 19 మంది నూతన ట్రైని ఎస్సైలు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలను అభినందించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈరోజు మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, కార్పొరేటర్లు, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి WGL చెందిన అర్జున్ చదరంగంలో చరిత్ర సృష్టించాడు. HNK అడ్వకేట్స్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు జ్యోతి దంపతుల కుమారుడు అర్జున్ చదరంగంలో ప్రపంచ ర్యాంకింగ్లో 3వ స్థానంలో నిలిచాడు. 14ఏళ్ల వయసులోనే యూఏఈలో నిర్వహించిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 17వ స్థానంలో నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నారు. తాజాగా జరిగిన 45వ ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో భారత్కు బంగారు పతకాన్ని అందించారు.
ప్రయాణికుల రవాణా కష్టాలను తెలుసుకునేందుకు వరంగల్-2 డిపో కార్యాలయంలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ జోత్న్స తెలిపారు. ప్రయాణికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 99592 26048 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలిపి, సలహాలు ఇవ్వాలని కోరారు.
గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నెక్కొండ, వరంగల్, కాజీపేట, మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న ఈ రైలును పలు కారణాలతో నేడు రద్దు చేశామని, ప్రయాణికులు ప్రయాణానికి వేరే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నెక్కొండ, వరంగల్ రైల్వే స్టేషన్ల వద్దకు ఇప్పటికే చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి వెనుతిరిగి వెళుతున్నారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం మంగళవారం జరగనుంది. కౌన్సిల్ ఎజెండాలో ముఖ్యంగా 10 అంశాల పైన చర్చించనున్నారు. పారిశుద్ధ్య కార్మికుల చెల్లింపులు, పదవీకాలం, రూ.5 భోజన పథకం, మున్సిపల్ అద్దె దుకాణాల వేలం, అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా పనులకు నిధుల మంజూరు, 250 మందిని శానిటేషన్లోకి కొత్తగా తీసుకోవడం తదితర అంశాలపై చర్చించనున్నారు.
‘స్వచ్చతా-హీ-సేవా’ కార్యక్రమాన్ని యజ్ఞంలా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో రివ్యూ అనంతరం మంత్రి మాట్లాడుతూ… అధికారులంతా జవాబుదారిగా వ్యవహరించాలని కోరారు. జిల్లాల్లో ప్రతి రోజు చేపట్టిన కార్యక్రమాల వివరాలను అన్ లైన్ లో ఎంట్రీ చేయాలని సీతక్క సూచించారు.
Sorry, no posts matched your criteria.