Warangal

News September 23, 2024

WGL: అండర్-19 జిల్లా జట్టు ఎంపిక..

image

ఈనెల 26 నుండి వరంగల్ కేంద్రంగా అండర్-19 అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో జిల్లా జట్టును ఎంపిక చేశారు. సీకేఎం కళాశాల మైదానంలో నిన్న, ఈరోజు ఏర్పాటుచేసిన సెలక్షన్ ప్రాసెస్లో 200 మంది క్రీడాకారులు పాల్గొనగా 18 మందిని జట్టుగా ఎంపిక చేసినట్లు క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జట్టు సభ్యులకు సూచించారు.

News September 23, 2024

రామప్ప దేవాలయం సమీపంలో గుప్తనిధుల తవ్వకం

image

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కనున్న గొల్లగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. గుడి పైకప్పు ధ్వంసం చేసి, లోపల తవ్వకాలు చేపట్టి, శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. గుడి వద్ద దుండగులు ఉపయోగించిన నిచ్చెనతో పాటు పలు వస్తువులు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు వెంకటాపురం ఠాణాలో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.

News September 23, 2024

మంత్రి సీతక్కతో మహేశ్ బాబు భార్య

image

ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు రూ.50 లక్షల విరాళం అందించడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు కాసేపు మహేశ్ బాబు సతీమణి నమ్రతతో సీతక్క ముచ్చటించారు. ఉదారత అందరికీ స్ఫూర్తి అని, మహేశ్ బాబు దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నానని సీతక్క చెప్పుకొచ్చారు.

News September 23, 2024

దీప్తి ప్రపంచానికి ఆదర్శం: మాజీ ఎమ్మెల్సీ

image

మానసిక సామర్థ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, విధిని ఎదిరించి తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి ప్రపంచానికి ఆదర్శమని మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండా మురళీధర్ రావు అన్నారు. అథ్లెట్ దీప్తి సోమవారం మురళీధర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దీప్తి సాధించిన కాంస్య పతకాన్ని మురళీధర్ రావు ఆమెకు అలంకరించి అభినందించారు.

News September 23, 2024

వరంగల్: నేటి నుంచి బొడ్డెమ్మ పండగ ప్రారంభం

image

నేటి నుంచి బొడ్డెమ్మ పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు ప్రధాన ప్రాంతాల్లో, దేవాలయాల్లో జరిగే బొడ్డెమ్మ సంబరాల్లో చిన్నారులు బొడ్డెమ్మ ఆడతారు. తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగను ఆడుకుని చివరికి నిమజ్జనం చేస్తారు.

News September 23, 2024

జనగామ: సీపీఎం సీనియర్ నాయకుడు శ్రీనివాస్ మృతి

image

జనగామ జిల్లా సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ అధ్యక్షుడు కామ్రేడ్ బొట్ల శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్ ఆకస్మిక మృతిపట్ల సీపీఎం జిల్లా నాయకులు, ఇతర పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మృతి ప్రజా పోరాటాలకు, సీపీఎంకి తీరని లోటు అన్నారు.

News September 23, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News September 22, 2024

పెద్దవంగర: అప్పుల బాధతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. SI క్రాంగి కిరణ్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News September 22, 2024

UPDATE.. జనగామ: తల్లిని చంపిన కొడుకు

image

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కొడుకు <<14155815>>తల్లిని <<>>హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సతీశ్ తల్లితో గ్యాస్ కనెక్షన్, కరెంట్ మీటర్, భూమి, డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. ఈక్రమంలో తల్లి లక్ష్మిని రోకలిబండతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

News September 22, 2024

WGL: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలన్నారు.