Warangal

News September 27, 2025

వరంగల్: ఎన్నికల నగారాపై పల్లెల్లో ఆసక్తి..!

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జిల్లాలోని పల్లెల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. దీంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు యువకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బరిలో ఉంటే ఎలా ఉంటుందని ఆశవాహులు స్థానికంగా వాకబు చేస్తున్నారు. జిల్లాలో పంచాయతీలు-317, ZPTC-11, MPTC-130 స్థానాలు ఉన్నాయి.

News September 27, 2025

లలితా పరమేశ్వరి అవతారంలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు

image

వరంగల్‌ శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు లలితా పరమేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు, అర్చకులు పాల్గొన్నారు.

News September 26, 2025

HNK: రేపు జిల్లా కోర్టులో పార్కింగ్‌కి వేలం

image

HNK జిల్లా కోర్టు ప్రాంగణంలో 2025-26 సం.కి గాను సైకిల్, స్కూటర్, కారు స్టాండ్ నిర్వహణ కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 27న సా. 4గం.కి ఈ బహిరంగ వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు సూపరింటెండెంట్(అకౌంట్స్), ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్, HNK పేరున రూ.1000 డిపాజిట్ చేసి, ఈ డిపాజిట్‌ను 27న మ.3 గం.లోపు చెల్లించాలన్నారు. కోర్టు కాంప్లెక్స్‌లో వేలం జరుగుతుందన్నారు.

News September 26, 2025

WGL: విద్యార్థులకు రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్

image

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే నిరుపేద SC విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హులైన వారికి రూ.20 లక్షల స్కాలర్‌షిప్ ఇస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుకునే వారు ఈ పథకానికి అర్హులన్నారు. telanganaepass.ogg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News September 26, 2025

స్కందమాతగా ఐనవోలు భ్రమరాంబిక అమ్మవారు

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని భ్రమరాంబిక అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. మరో 5 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

News September 26, 2025

వరంగల్ జిల్లాలో 28.2 MM వర్షపాతం నమోదు

image

గత 24 గంటల్లో వరంగల్ జిల్లాలో 366.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గీసుకొండ మండలంలో 59.1 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 58.2 మిల్లీమీటర్లు, ఖిల్లా వరంగల్‌లో 52.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 28.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. కాగా, నెక్కొండ, పర్వతగిరి మండలాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

News September 25, 2025

రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ

image

WGL కలెక్టరేట్ సమావేశ హాలులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులను నిర్వర్తించనున్న రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు, జిల్లా శిక్షణ నోడల్ అధికారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు.

News September 25, 2025

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..!

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.2,235 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.6,400, పచ్చి పల్లికాయకు రూ.4,100 ధర వచ్చింది. అలాగే గురువారం పసుపు మార్కెట్‌కు రాలేదని వ్యాపారులు తెలిపారు. ఉదయం మార్కెట్లో చిరు జల్లులు పడినప్పటికీ కొనుగోళ్లు జరిగాయి.

News September 24, 2025

ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి: డిప్యూటీ కలెక్టర్

image

2025-26 వానాకాలం సీజన్‌ వరి ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో రైతుల వద్ద పండిన ప్రతీ గింజను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. అక్టోబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

News September 23, 2025

వరంగల్: పెరిగిన చిరుధాన్యాల ధరలు

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే మంగళవారం చిరుధాన్యాల ధరలు పెరిగాయి. సూక పల్లికాయ క్వింటా నిన్న రూ.6,000 ధర పలకగా.. నేడు రూ.6,500 ధర వచ్చింది. అలాగే పచ్చి పల్లికాయకి నిన్న రూ.3,300 ధర వస్తే.. నేడు రూ.4,500 అయింది. మక్కలు(బిల్టీ)కి నిన్న రూ.2,215 ధర రాగా.. నేడు రూ.2,230 వచ్చింది. మరోవైపు దీపిక మిర్చి రూ.14 వేలు, ఎల్లో రకం మిర్చి రూ.22 వేలు, పసుపు(MB) రూ.7560 ధర పలికాయి.