News March 4, 2025
ఆదోనికి పోసాని కృష్ణమురళి

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఆదోని PSకు తరలిస్తున్నారు. అక్కడ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసి తీసుకెళ్తున్నారు. మరోవైపు, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. రాజంపేట జైలులో ఉన్న ఆయన్ను నిన్న పోలీసులు పీటీ వారంట్పై నరసరావుపేట తీసుకురాగా, జడ్జి 10 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
Similar News
News March 31, 2026
నాగర్ కర్నూల్ జిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు

దేశవ్యాప్త నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రకటనతో జిల్లాలో చర్చ మొదలైంది. అసెంబ్లీ స్థానాలు 50% పెరిగే అవకాశం ఉండటంతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 4 స్థానాలు 7కు చేరవచ్చు. జనాభా ప్రాతిపదికన (సుమారు 1.40 లక్షల ఓటర్లు) కొత్తగా ఆమనగల్లు, వంగూరు, పెద్దకొత్తపల్లి మండలాలు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News March 31, 2026
‘భస్మాసుర హస్తం’ అంటే?

ఉపకారం చేసినవాడికే అపకారం తలపెట్టే సందర్భంలో ‘భస్మాసుర హస్తం’ జాతీయాన్ని ఉపయోగిస్తాం. పురాణాల్లో భస్మాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకొని, తన చేతిని ఎవరి తలపై పెడితే వారు భస్మం అయిపోవాలనే వరం పొందుతాడు. అయితే దాన్ని శివుడిపైనే పరీక్షించాలనుకుంటాడు. చివరికి విష్ణుమూర్తి ‘మోహిని’ అవతారమెత్తి భస్మాసురుడి చేయిని అతని నెత్తిన పెట్టుకొనేలా చేసి హతం చేస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 31, 2026
పోలీసుల అండతో TDP గూండా రాజ్యం: జగన్

AP: పోలీసుల అండతో TDP గూండా రాజ్యం నడుపుతోందని YCP చీఫ్ YS జగన్ దుయ్యబట్టారు. గురజాల నియోజకవర్గ నేతలు జగన్ను తన నివాసంలో కలిశారు. TDP మూకలు దాడులు చేస్తున్నాయని, FEBలో ఇద్దరిని చంపారని తెలిపారు. దీనిపై జగన్ మాట్లాడుతూ వారి దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని, వ్యవస్థను దిగజార్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ అందిస్తుందని భరోసా ఇచ్చారు.


