News June 20, 2024

నేడు 8మంది మంత్రుల బాధ్యతల స్వీకరణ

image

AP: నేడు రాష్ట్ర సచివాలయంలో 8మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయశాఖ మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ బాధ్యతల్ని చేపట్టనున్నారు.

News June 20, 2024

ఏసీలకు భారీ డిమాండ్.. పెరిగిన ధరలు

image

ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ఏసీల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలోనే ధరలను స్వల్పంగా పెంచిన కంపెనీలు.. తాజాగా మరోసారి 6 నుంచి 8 శాతం వరకు సవరించాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో వోల్టాస్, LG, లాయిడ్ సంస్థలు తమ కెపాసిటీని రెండింతలు చేశాయి. విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏసీ స్టాకులను ఉత్తరాదికి తరలిస్తున్నాయి.

News June 20, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ కారు

image

AP: టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున సీఎం చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో నెగ్గారు.

News June 20, 2024

కీచక ఎస్సై.. మొదటి నుంచి లైంగిక ఆరోపణలు

image

TG: మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసులో డిస్మిస్ అయిన కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ వ్యవహారశైలి మొదటి నుంచే వివాదాస్పదంగా ఉంది. 2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిని లైంగికంగా వేధించాడు. ఎత్తు, కొలతలు చూస్తానంటూ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా అత్యాచారం చేసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి.

News June 20, 2024

DSC.. నేడే చివరి తేదీ

image

TG: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి DSC దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి FEBలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3 నాటికే గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. నిన్న సా. వరకు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. tsdsc.aptonline.in/tsdsc/

News June 20, 2024

అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

image

పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ CM పవన్ పలు ప్రశ్నలను సంధించారు. ‘ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది? సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఎందుకు ఇవ్వట్లేదు?’ అని ప్రశ్నించారు. వీటికి అధికారులు సరిగా సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం.

News June 20, 2024

మహిళా క్రికెట్‌లో ఇదే తొలిసారి

image

దక్షిణాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో అరుదైన రికార్డు నమోదైంది. ఈ మ్యాచులో స్మృతి మంధాన(136), హర్మన్‌ప్రీత్ కౌర్(103), లారా(135), కాప్(114) సెంచరీలు నమోదు చేశారు. మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో నలుగురు బ్యాటర్లు ఒకే మ్యాచులో సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో SAపై టీమ్ ఇండియా 4 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

News June 20, 2024

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని విజ్ఞప్తి

image

AP: పోలీసు ఉద్యోగాల భర్తీకి మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ JAC రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు CM చంద్రబాబుని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రూప్-2 మెయిన్స్ 2నెలలు వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులు ప్రిపరేషన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సిలబస్ ఎక్కువగా ఉందని వివరించారు. డిప్యూటీ DEO మెయిన్స్‌కు 1:100 విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు.

News June 20, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్లే: కిషన్ రెడ్డి

image

AP: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఫైల్ పెండింగ్‌లో ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పట్లో ప్రైవేటీకరణ జరగదన్నారు. ప్రజలు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్‌ను కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. సంస్థకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. గనుల వేలంలో పాల్గొని విశాఖ స్టీల్ కూడా క్యాప్టివ్ మైన్స్ సొంతం చేసుకోవచ్చని తెలిపారు.

News June 20, 2024

10,083 మంది టీచర్లకు ప్రమోషన్

image

TG: మల్టీ జోన్-1(వరంగల్)లోని 19 జిల్లాల్లో మొత్తం 10,083 మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారు. వీరిలో 4,910 మంది భాషా పండిట్లు, 4,207 మంది ఎస్జీటీలు, 966 మంది PETలున్నారు. భాషా పండిట్లు స్కూల్ అసిస్టెంట్(లాంగ్వేజ్)గా, PETలు స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్)గా మారారు. SGTలు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ అయ్యారు. నిన్ననే వారికి కేటాయించిన స్కూళ్లలో జాయిన్ అయ్యారు.