News June 19, 2024

స్మృతి మంధాన అరుదైన ఘనత

image

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా స్మృతి (7) నిలిచారు. ఈ క్రమంలో మిథాలీ రాజ్ (7) రికార్డును ఆమె సమం చేశారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో ఈ ఫీట్ అందుకున్నారు. మిథాలీ ఈ ఫీట్‌ను 211 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా, స్మృతి 84 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం.

News June 19, 2024

మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత తీసుకున్న మహేశ్!

image

మహేశ్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. కృష్ణా(D) పెదప్రోలుకు చెందిన రాజేశ్.. తొలుత కృష్ణకు, ఇప్పుడు మహేశ్‌కు వీరాభిమాని. ఆయన ముగ్గురు పిల్లలకు అర్జున్, అతిథి, ఆగడు అని పేర్లు కూడా పెట్టారు. ప్రస్తుతం రాజేశ్ కిడ్నీ పాడైపోయి మంచానపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఆ ముగ్గురి పిల్లల చదువుకయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ స్టోరీని షేర్ చేశారు.

News June 19, 2024

ఆ సిటీలో పనిచేస్తే ప్రోత్సాహకాలు ఇస్తాం: ఇన్ఫోసిస్

image

కర్ణాటక హుబ్బళ్లిలోని డెవలప్మెంట్ సెంటర్‌లో పని చేసేందకు ఉద్యోగులు ఆసక్తి చూపించకపోవడంతో వారికి ఇన్ఫోసిస్ ఆఫర్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చి పనిచేస్తే ₹8లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. కనిష్ఠంగా బ్యాండ్-3 అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు రెండేళ్లలో రూ.1.25లక్షల ప్రోత్సాహకం ఇస్తామంది. ఇక బ్యాండ్ 4- ₹2.5లక్షలు, బ్యాండ్ 5- ₹5లక్షలు, బ్యాండ్ 6- ₹8లక్షల ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది.

News June 19, 2024

కెప్టెన్, వైస్ కెప్టెన్ సెంచరీలు.. భారత్ భారీ స్కోర్

image

సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(136), కెప్టెన్ హర్మన్(103) సెంచరీలతో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 325 రన్స్ చేసింది. షఫాలీ వర్మ(20), హేమలత(24), రిచా ఘోష్(25) పర్వాలేదనిపించారు. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.

News June 19, 2024

కారులోనే అస్థిపంజరాలుగా మారిన ప్రేమజంట!

image

5నెలల క్రితం లేచిపోయిన ప్రేమజంట అస్థిపంజరాలుగా కనిపించింది. మధ్యప్రదేశ్‌లోని గోపి గ్రామంలో జరిగిందీ ఘటన. కువారీ నది గేట్లు ఎత్తగా నీటిమట్టం తగ్గి తేలిన కారును గ్రామస్థులు గుర్తించారు. అందులో అస్థిపంజరాలుండగా పోలీసులకు సమాచారమిచ్చారు. సమీప గ్రామానికి చెందిన నీరజ్, మితిలేశ్‌‌ మృతదేహాలుగా పోలీసులు నిర్ధారించారు. వారి ప్రేమ వ్యవహారం నచ్చని వారు మర్డర్ చేసి, నదిలో పారేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

News June 19, 2024

ఢిల్లీలో మండుతున్న ఎండలు

image

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలతో పాటు వడగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎండ వేడికి తాళలేక ఇవాళ ఐదుగురు వడదెబ్బతో మరణించారు. పదుల సంఖ్యలో ICUలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు యూపీ, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్‌లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News June 19, 2024

గౌతమ్ గంభీర్‌ను BCCI అడిగిన 3 ప్రశ్నలివే?

image

టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం నిన్న బీసీసీఐ గౌతమ్ గంభీర్‌ను ఇంటర్వ్యూ చేసింది. 40 నిమిషాల ఈ ఇంటర్వ్యూలో 3 కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
1.టీమ్ కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించి మీ ఆలోచనలేంటి?
2.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పుడు.. జట్టులో మార్పులు ఎలా చేస్తారు?
3. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు, వర్క్ లోడ్‌, ఐసీసీ ట్రోఫీలు గెలవకపోవడానికి కారణాలేంటి?

News June 19, 2024

ఈ ఏడాది దేశాన్ని వీడనున్న 4300మంది శ్రీమంతులు!

image

ఈ ఏడాది 4300మంది శ్రీమంతులు భారత్‌ను వీడనున్నారని హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ అంచనా వేసింది. అత్యధికులు యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని వెల్లడించింది. గత ఏడాది ఈ సంఖ్య 5100గా ఉండటం గమనార్హం. చైనా, యూకే తర్వాత ఆ స్థాయిలో మిలియనీర్లు తరలిపోతున్న దేశంగా భారత్ ఉందని వివరించింది. మొత్తంగా ఈ ఏడాది 1.28లక్షలమంది యూఏఈ లేదా అమెరికాకు వలస వెళ్తారని సంస్థ అభిప్రాయపడింది.

News June 19, 2024

భక్తులకు నాణ్యమైన మజ్జిగ ఇవ్వండి: TTD ఈవో

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధునాతన యంత్రాలతో పాటు క్వాలిటీని మెరుగుపరిచేందుకు ఫుడ్ కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు. భక్తులకు నాణ్యమైన మజ్జిగను పంపిణీ చేయాలని ఆదేశించారు. పాంచజన్యం కిచెన్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.

News June 19, 2024

రష్యాకు కిమ్ సపోర్ట్.. కారు గిఫ్ట్ ఇచ్చిన పుతిన్!

image

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మద్దతు ప్రకటించారు. 24ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉ.కొరియాకు వచ్చిన నేపథ్యంలో ఇరు దేశాలు సహకరించుకునేలా కిమ్ ఒప్పందం చేసుకున్నారు. రష్యాకు ఆపద వస్తే ఉ.కొరియా, కిమ్‌కు ఆపద వస్తే రష్యా ఆదుకునేలా ఈ డీల్ జరిగింది. అంతేకాదు ఇరు దేశాధినేతలు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారు. కిమ్‌కు రష్యాకు చెందిన ఔరస్ లగ్జరీ కారును పుతిన్ గిఫ్ట్ ఇచ్చారట.