India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూపర్ హిట్ మూవీ ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్గా తెరకెక్కుతోన్న ‘సితారే జమీన్ పర్’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కించిన ఈ మూవీలో ఆమిర్ ఖాన్కు జోడీగా జెనీలియా నటించారు. గత చిత్రంలా కాకుండా ఈ సీక్వెల్ ప్రేక్షకులను నవ్విస్తుందని తెలిపారు. ఈ సినిమాకు ఆమిర్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ ఏడాది క్రిస్మస్కు మూవీని విడుదల చేయనున్నట్లు సమాచారం.
TG: ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ఫాక్స్కాన్ ఆగస్టు నుంచి రాష్ట్రంలో ప్రొడక్షన్ ప్రారంభించనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలాన్లో రూ.1200 కోట్లతో నెలకొల్పిన ప్లాంట్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ సంస్థ ద్వారా తొలి ఏడాదిలో 25వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనుండగా, పదేళ్లలో దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుంది.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా కింగ్స్టౌన్లో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో నేపాల్ బౌలర్లు దుమ్మురేపారు. 106 రన్స్కే ఆ జట్టును ఆలౌట్ చేశారు. బంగ్లా బ్యాటర్లలో షకీబ్(17 రన్స్)దే అత్యధిక స్కోరు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర, రోహిత్, సందీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఓడితే బంగ్లా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమవుతాయి.
AP: పోలవరం రాష్ట్ర జీవనాడి. ప్రాజెక్టు ప్రతిపాదనలు.. వాటికి ఆమోదాలు. ఒక్కో ప్రభుత్వం ఒక్కో శిలాఫలకం. బాలారిష్టాలు దాటి పనులు ప్రారంభం. దీనికే దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ప్రాజెక్టు ఓ కొలిక్కి రాలేదు. కేంద్రం సాయంతో ఈసారి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తామని NDA ప్రభుత్వం అంటోంది. మరి 2029 నాటికైనా ఈ ప్రాజెక్టు నుంచి గోదారమ్మ పరవళ్లు చూస్తామా? అని రాష్ట్ర ప్రజానీకం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
AP: జనసేనకు <<13454433>>డిప్యూటీ స్పీకర్<<>> పదవి ఇవ్వాలని ఎన్డీయే సర్కారు నిర్ణయించింది. ఎవరికి ఇవ్వాలన్నదానిపై టీడీపీ, జనసేన అధినేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ చీఫ్ విప్గా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరును చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇతర రాష్ట్రాల కంటే రైల్వే నెట్వర్క్లో వెనుకబడిన తెలంగాణలో రైల్వే లైన్ల సర్వేలే ఏళ్లుగా సాగుతున్నాయి. ఇంకా రైలు కూత వినని ప్రాంతాలెన్నో ఉన్నాయి. తుది సర్వే మంజూరైన ప్రాజెక్టులు 30 ఉండగా.. వీటి పనుల విలువ దాదాపు రూ.83,543 కోట్లు. జూలైలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్పై మన MPలు శ్రద్ధ పెడితేనే ఇవి పట్టాలెక్కుతాయి. 15 కొత్త మార్గాలు, 8 డబ్లింగ్, 3 ట్రిప్లింగ్ ప్రాజెక్టులు ప్రతిపాదనల్లోనే ఉన్నాయి.
TG: ఆగస్టు 15లోపు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాస్బుక్లు, రేషన్కార్డులున్న వారి రుణాలనే మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. MPలు, MLAలు, MLCలు, ఆదాయపన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించనున్నట్లు సమాచారం. కేబినెట్లో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2018 DEC 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2-3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది.
AP: గూడూరు-రేణిగుంట మధ్య 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ లైన్ నిర్మించనుంది. ఈ 2 స్టేషన్ల మధ్య 83.17KM దూరానికి రూ.884 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. 2 రైల్వే వంతెనలు, అండర్పాస్లు నిర్మించాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్టు కోసం 36.58 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే విజయవాడ-గూడూరు మధ్య 3వ లైన్ పూర్తికావొస్తోంది.
ముస్లింల పవిత్ర హజ్ యాత్రలో ఎండ వేడికి తాళలేక 19 మంది యాత్రికులు మరణించారు. వీరంతా జోర్డాన్, ఇరాన్కు చెందిన వారని అధికారులు తెలిపారు. అధికారులు ఎండ నుంచి ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేసినా మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఎండలకు తాళలేక 240 మంది మరణించారు. కాగా ఎల్లుండితో హజ్ యాత్ర ముగియనుంది.
పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత సాయాన్ని ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోదీ బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో.. రూ.2వేలు చొప్పున) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోదీ సంతకం చేశారు.
Sorry, no posts matched your criteria.