India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి పరిస్థితిపై స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ తాజాగా వివరాలు వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు మాత్రం మూడు రోజుల అబ్జర్వేషన్లో ఉండాలని తెలిపారు. రుయా ఆస్పత్రిలో ఉన్నవారిని స్విమ్స్కు తరలించగా, మొత్తం 13మంది అక్కడ చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ఇక్కడికే వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
TG: ఫార్ములా-e రేసు కేసులో KTR నందినగర్ నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయల్దేరారు. కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్ రావు ఆయనతో పాటు వెళ్తున్నారు. కాగా, విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే లాయర్ను అనుమతించనున్నారు. కేటీఆర్ విచారణ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ACB ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. IAS దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు KTRను విచారించనున్నారు.
కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆసుపత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నిరాకరించిందని 72 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే ఈ పథకం అమలుపై ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వైద్యులు ఉచిత చికిత్సకు నిరాకరించారు. డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైనా స్కీం అందలేదనే ఆవేదనతో అతను సూసైడ్ చేసుకున్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు.
కేంద్రం గత ఏడాది 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్(ABPMJAY) పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇంట్లో 70 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కాగా ఈ పథకానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. వీటిలో కర్ణాటక కూడా ఉండగా కేంద్రం నుంచి క్లారిటీ లేకనే పథకం అమలు చేయట్లేదని పేర్కొంది.
సీనియారిటీ పరంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మల్టీస్టారర్ చేస్తానని హీరో రామ్ చరణ్ చెప్పారు. ఇప్పటికే ఈ హీరో ఎన్టీఆర్తో RRRలో నటించిన సంగతి తెలిసిందే. ఓ షోలో RC తన ఇష్టాయిష్టాలను వెల్లడించారు. తనతో నటించిన హీరోయిన్లలో సమంత బెస్ట్ అని తెలిపారు. అక్కాచెల్లెళ్లలో తనకు సుస్మిత అక్క అంటే ఇష్టమని పేర్కొన్నారు. భార్య ఉపాసన అంటే భయం లేకున్నా ఉన్నట్లుగా నటిస్తానని అన్నారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శిస్తారు. పవన్ తిరుమల వెళ్లేందుకు ఇవాళ్టి తన పర్యటనలు అన్నీ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధించినట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు.
TG: అభయహస్తం పథకంలోని రూ.385 కోట్ల నిధులను మహిళలకు తిరిగివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2009లో అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్లపాటు చెల్లించారు. ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు సర్కార్ గుర్తించింది. 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి రూ.545 కోట్లకు చేరాయి. ఇప్పుడు వీటిని తిరిగివ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.
AP: తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయింది. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఇవాళ కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది.
వన్డే వరల్డ్ కప్లో తర్వాత గాయంతో క్రికెట్కు దూరమైన మహ్మద్ షమీ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్లో ఆయన రీఎంట్రీ ఇస్తారని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లోనే ఆయన ఆడుతారని భావించినా ఫిట్నెస్ లేమితో జట్టులోకి రాలేదు. ఇంగ్లండ్తో సిరీస్కు బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో షమీ టీమ్లోకి వస్తే భారత బౌలింగ్ పటిష్ఠం కానుంది.
Sorry, no posts matched your criteria.