India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది. 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధివిధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.
వయనాడ్, రాయ్బరేలి నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉంది. దీంతో అక్కడి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘మా ప్రియమైన పెద్దన్న రాహుల్ గాంధీ. మమ్మల్ని వదిలి వెళ్లకండి. కచ్చితంగా వెళ్లాల్సి వస్తే.. మీ సోదరి ప్రియాంకాగాంధీని మమ్మల్ని చూసుకోమని చెప్పండి’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.
TG: సింగరేణి కార్మికులు, ఉద్యోగుల గృహ రుణాల వడ్డీ రాయితీపై యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఇంటి నిర్మాణం ప్రారంభించిన/ కొనుగోలు చేసిన ఏడాదిలో బ్యాంకు రుణం పొందితేనే రాయితీని ఇచ్చేది. ఇప్పుడా కాలపరిమితిని ఎత్తేసింది. అలాగే ప్రస్తుతం 8.33% కన్నా తక్కువ వడ్డీకి రుణం తీసుకున్నవారికి మాత్రమే 6-7% రాయితీ ఇస్తుండగా, ఇకపై 8.3% వరకు వర్తింపజేయనుంది. ఈ నిర్ణయంతో 4వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్డేట్ చేసుకునేందుకు UIDAI <
పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడును తెలంగాణ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. ‘2014లో యంగెస్ట్ ఎంపీల్లో మీరూ ఒకరు. లోక్ సభలో మీ పనితీరు అద్భుతంగా ఉండేది. అప్పుడే సీనియర్ ఎంపీలందరూ మిమ్మల్ని గుర్తించారు. మన దేశానికి మీలాంటి విజ్ఞానవంతులు, వాగ్ధాటి గల యువ నాయకుడు మన దేశానికి అవసరం. మిమ్మల్ని కేంద్రమంత్రిగా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గోల్డ్ స్కీమ్ పేరుతో తనను మోసగించారని ఓ వ్యాపారి కోర్టులో ఫిర్యాదు చేశారు. సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్స్ శిల్పా, రాజ్కుంద్రాతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లు, మరో ఉద్యోగి మోసం చేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను జడ్జికి చూపడంతో కేసు నమోదుకు ఆదేశించారు.
T20WC హిస్టరీలో అత్యంత వేగంగా(3.1 ఓవర్లలో 48) లక్ష్యాన్ని <<13436346>>ఛేదించిన<<>> జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒమన్తో మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. గతంలో శ్రీలంక 5 ఓవర్లలో(VSనెదర్లాండ్స్) 40, న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో(VSఇంగ్లండ్) 52, ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలో(VSనమీబియా) 73, విండీస్ 5.5 ఓవర్లలో(VS ఇంగ్లండ్)60 టార్గెట్లను ఛేజ్ చేశాయి.
AP: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు మెగా మోసం చేశారన్న YCP విమర్శలకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘ఐదేళ్లు మెగా డీఎస్సీ అని ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని నువ్వు ఎక్కడ? వచ్చిన మొదటి రోజే 16వేల టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు ఎక్కడ?’ అని Xలో రిప్లై ఇచ్చింది. కాగా, 25,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్న చంద్రబాబు.. 16,347 పోస్టులే ఇచ్చారని అంతకుముందు వైసీపీ ట్వీట్ చేసింది.
AP: వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం పేరును టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. 2014-19 మధ్య పెట్టిన పేరునే కొనసాగించనుంది. ఇకపై వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జులై 1న రూ.7,000 ఇస్తుంది. దివ్యాంగులకు రూ.6వేలు అందనుంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
TG: డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45%, ఇతరులకు 40% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50%, ఇతరులకు 45% మార్కుల నిబంధన ఉండేది. కాగా భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాసైతే సరిపోతుంది.
Sorry, no posts matched your criteria.