India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ ఏపీకి చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో ఆయనకు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో విశాఖ రైల్వే జోన్ సహా రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఎక్కడికెళ్లినా మనీకి బదులుగా UPIని వినియోగించడం పెరిగిపోయింది. దీంతో మార్కెట్లో చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా ప్రతిచోట డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, ప్రజలు అత్యధికంగా PhonePay వాడుతున్నట్లు తేలింది. డిసెంబర్-2024 UPI మార్కెట్ షేర్ ప్రకారం PhonePayని 47.7%, GooglePayని 36.7%, Paytmని 6.87% మంది వాడుతున్నారు. ఇంతకీ మీరు ఎక్కువగా ఏ పేమెంట్ యాప్ వాడుతారో కామెంట్ చేయండి.
భారత వాయుసేనలో అగ్నివీర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిన్నటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వగా 17.5-21 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ఇంటర్ పూర్తి చేసిన వారు అప్లై చేసేందుకు అర్హులు. అగ్నిపథ్ స్కీం ద్వారా నాలుగేళ్ల ప్రొబేషన్ తర్వాత 25శాతం మందిని విధుల్లోకి తీసుకుంటుంది. ట్రైనింగ్లో జీతం గరిష్ఠంగా రూ.40వేలు ఇస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
బంగ్లా మాజీ PM షేక్ హసీనా వీసా గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్టు తెలుస్తోంది. గత ఆగస్టు నుంచి ఆమె భారత్లోనే తలదాచుకుంటున్నారు. గడువు పెంపుతో ఆమె మరికొంత కాలం ఇక్కడే ఉండేందుకు వీలవుతుంది. అయితే ఇది రాజకీయ ఆశ్రయం కల్పించినట్టు కాదని తెలుస్తోంది. నిన్న ఆమె పాస్పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దుచేసింది. ఓవైపు ఆమెను తిరిగి పంపించాలని యూనస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు.
TG: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. <
TG: కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్లను సరఫరా చేయలేమని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. గత ఐదేళ్లుగా బీర్ల ధరల పెంపునకు TGBCL అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతటి భారీ నష్టాల్లో తాము బీర్లను సరఫరా చేయలేమని పేర్కొంది. కాగా రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఈ బీర్లు దొరకకపోవడంతో కొన్నేళ్లుగా మందుబాబులు జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదులు చేశారు.
ఫస్ట్ ఇయర్ బోర్డు పరీక్షల తొలగింపుపై తుది నిర్ణయం జరగలేదని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. కొత్త ప్రతిపాదనలపై ప్రస్తుతం సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది.
TG: ACB విచారణకు లాయర్ను అనుమతించాలన్న <<15097073>>KTR<<>> పిటిషన్పై ఈ సాయంత్రం హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ఇలాంటి దర్యాప్తును న్యాయవాది చూసే అవకాశం ఉందా? అని ACB తరఫు లాయర్ను న్యాయస్థానం ప్రశ్నించింది. సాయంత్రం గం.4లోపు చెబుతామని దర్యాప్తు సంస్థ తరఫున హాజరైన AAG కోర్టుకు తెలిపారు. దీంతో అప్పుడు తిరిగి ప్రారంభమయ్యే విచారణలో ప్రభుత్వ కౌన్సిల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించనున్న SHARWA37 సినిమా ఈనెల 14న లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి & కొణిదెల ఫ్యామిలీలు కలిసి ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. అదేరోజు ఫస్ట్ లుక్& టైటిల్ రివీల్ చేస్తామని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మేనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించనుండగా రామ్ అబ్బరాజు తెరకెక్కించనున్నారు.
లాయర్తో ACB విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న KTR వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. లాయర్ను ఆయనతో పాటు కూర్చోబెట్టలేమని స్పష్టం చేసింది. దూరంగా ఉండి లాయర్ గమనించేందుకు మాత్రం పర్మిషన్ ఇస్తామని KTR లంచ్ మోషన్ పిటిషన్పై విచారణలో తెలిపింది. వెంట వెళ్లే ముగ్గురు లాయర్ల పేర్లను ఇవ్వాలని మాజీ మంత్రి కౌన్సిల్ను ఆదేశించింది. తదుపరి విచారణను సాయంత్రం గం.4కు వాయిదా వేసింది.
Sorry, no posts matched your criteria.