News March 17, 2024

ఇసుకలో జగన్ రూ.40వేల కోట్ల స్కామ్: పవన్

image

AP: ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40వేల కోట్లు దోచేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీనిపై ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని ఆరోపించారు. ‘రాష్ట్రం డ్రగ్స్‌కు రాజధాని అయిపోయింది. ఇక్కడ 30వేల మందికిపైగా మహిళలు అదృశ్యమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక్కసారీ స్పందించలేదు. రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది’ అని ఆరోపించారు.

News March 17, 2024

8th ఫెయిలయ్యా.. నాన్న ఏడ్చారు: మాధవన్

image

నటుడు మాధవన్ పలు ఆసక్తికర విషయాలను ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ‘‘నేను మెరిట్ స్టూడెంట్ కాదు. 8వ తరగతిలో గణితంలో ఫెయిల్ అయ్యాను. కానీ, నేను టాటా స్టీల్స్‌లో జాబ్ కొట్టి, పెళ్లి చేసుకొని మా నాన్న ఉన్న ఇంట్లోనే ఉండాలని మా పేరెంట్స్ కోరిక. ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ నా అప్లికేషన్‌‌ను రిజెక్ట్ చేసినప్పుడు ‘నేను నీకేం తక్కువ చేశాను’ అని మా నాన్న నాతో కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

News March 17, 2024

మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు: పవన్

image

AP: రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారని పేర్కొన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

News March 17, 2024

PHOTO: ఒకే ఫ్రేమ్‌లో మోదీ, చంద్రబాబు, పవన్

image

AP: చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న సభా వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.

News March 17, 2024

BIG ALERT.. పరీక్ష తేదీలు మార్పు?

image

ఏపీ ఈఏపీసెట్ తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌పై సందిగ్ధం నెలకొంది. త్వరలోనే కొత్త తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అటు ప్రస్తుతం EAPCET దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా.. ఏప్రిల్ 15 వరకు చేసుకోవచ్చు.

News March 17, 2024

ఒక సంస్థ నుంచే DMKకి ₹509 కోట్ల విలువైన బాండ్లు

image

ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ పేరు అందరినీ ఆకర్షించింది. ఆ సంస్థ అత్యధికంగా ₹1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ కొనుగోలు చేసిన బాండ్ల మొత్తంలో ₹509 కోట్లు తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలోని DMK పార్టీ ఖాతాలోకి చేరడం విశేషం. ఈ విషయాన్ని EC తాజాగా వెల్లడించింది. ఒక పార్టీకి ఇంతపెద్ద మొత్తంలో బాండ్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

News March 17, 2024

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు.. కొత్త డేటా

image

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను EC తాజాగా మరోసారి వెల్లడించింది. ఏయే పార్టీకి ఎన్ని కోట్ల విలువైన బాండ్లు వచ్చాయో వివరించింది. BJP-రూ.6,986cr, టీఎంసీ-రూ.1,397cr, కాంగ్రెస్-రూ.1,344cr, బీఆర్ఎస్-రూ.1,322cr, బీజేడీ-రూ.944.5cr, డీఎంకే-రూ.656.5cr, వైసీసీ-రూ.442.8cr, టీడీపీకి రూ.181.35 కోట్ల మొత్తంలో బాండ్ల ద్వారా సమకూరిందని పేర్కొంది. 2019-20లో బీజేపీ అత్యధికంగా రూ.2,555 కోట్ల విలువైన బాండ్లను పొందింది.

News March 17, 2024

కాంగ్రెస్‌లోకి మరో నలుగురు BRS MLAలు?

image

TG: కాంగ్రెస్‌లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశానన్న CM రేవంత్ వ్యాఖ్యలతో BRS శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఇవాళ చేవెళ్ల MP రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజుల్లో మరో నలుగురు BRS MLAలు కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. ఇటీవల CMను MLAలు ప్రకాశ్ గౌడ్, యాదయ్య, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్, తెల్లం వెంకట్రావు తదితరులు కలిసిన విషయం తెలిసిందే.

News March 17, 2024

మోదీ జీకి స్వాగతం: చంద్రబాబు

image

AP: టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి సభ కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి చంద్రబాబు Xలో స్వాగతం పలికారు. ‘మోదీ జీ.. మా రాష్ట్ర ప్రజలు మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. మనం కలిసికట్టుగా సంక్షేమం, అభివృద్ధి, సమర్థవంతమైన పాలనలో కొత్త మైలురాళ్లను నెలకొల్పుదాం’ అని ట్వీట్ చేశారు.

News March 17, 2024

అభిమానులకు ఇషాన్ కిషన్ విజ్ఞప్తి

image

తమను చూసేందుకు మైదానానికి, నెట్స్ వద్దకు వచ్చే అభిమానులకు ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ చేసేందుకు వస్తారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ విసిరేయొద్దు. దయచేసి గ్రౌండ్‌ను క్లీన్‌గా ఉంచండి. చిన్న చిన్న విషయాలే. కానీ అన్నీ కలిపితే మొత్తంగా మెరుగవుతాం. అన్నీ మనం చేయగలిగినవే’ అని తెలిపారు. ఈ నెల 24న గుజరాత్‌తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.