India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్య కేసు పరిష్కారం కోసం ఎదురుచూస్తోన్న ఆమె తల్లికి న్యాయం చేయాలని నటి పూనమ్ కౌర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ కేసు త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. 2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించగా.. అత్యాచారం చేసి, హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో గత ప్రభుత్వం ఈ కేసును CBIకి అప్పగించింది.
AP: ఎన్నికల్లో ఘోర ఓటమిపై వైఎస్ జగన్ పోస్ట్మార్టం మొదలుపెట్టారు. తాడేపల్లిలోని నివాసంలో ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో పాటు ఓడిన నేతలతోనూ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలు, ఓట్లు తగ్గడంపై వారితో చర్చిస్తున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాశ్ సహా పలువురు ఓటమికి గల కారణాలను జగన్కు వివరించారు.
AP: అక్రమాస్తుల కేసులో CBI విచారణ ఎదుర్కొంటున్న YCP అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ హాజరవ్వక తప్పని పరిస్థితి ఉంది.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఒమన్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. ఛేదనలో ఒమన్ జట్టు 125/9కే పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా 39 రన్స్ తేడాతో గెలిచింది. ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలిగిన ఒమన్ ప్రత్యర్థి బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది.
AP సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబును కలిసేందుకు పలువురు IAS, IPS ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించిన DIG కొల్లి రఘురామిరెడ్డి, జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన PSR ఆంజనేయులుకు CBNను కలిసేందుకు అధికారులు అనుమతించలేదు. అటు రఘురామిరెడ్డిని అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం నిన్న ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
లోక్సభ ఎన్నికల్లో టాప్-10 రిచెస్ట్ అభ్యర్థుల్లో నలుగురు మాత్రమే ఎన్నికయ్యారు. గుంటూరు టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో అత్యంత ధనిక ఎంపీగా నిలిచారు. ఆయన తర్వాత బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి (రూ.4,568 కోట్లు), కురుక్షేత్ర (హరియాణా) నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ (రూ.1,230 కోట్లు), నెల్లూరు టీడీపీ MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(రూ.716 కోట్లు) ఉన్నారు.
ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, బీఎల్ సంతోష్ సహా పలువురు భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కేబినెట్ కూర్పు, మిత్రపక్షాలకు మంత్రి పదవుల కేటాయింపు సహా పలు అంశాలపై వీరంతా చర్చిస్తున్నారు. ఈ నెల 8న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆయా అంశాలను ఈలోగా కొలిక్కి తెచ్చేలా కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు.
నటి కంగన MPగా గెలవడంపై లేడీ కమెడియన్ సోనాలి థాకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘రాబోయే 4 ఏళ్లు హిమాచల్లో హృతిక్ రోషన్ సినిమా షూటింగ్లు జరగవేమో’ అని సెటైర్ వేశారు. తాను హృతిక్తో రిలేషన్షిప్లో ఉన్నానని కంగనా గతంలో చెప్పగా, దాన్ని హృతిక్ కొట్టిపారేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. దాన్ని ఉద్దేశిస్తూ తాజాగా సోనాలి జోక్స్ వేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో BJP నుంచి కంగన పోటీ చేశారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను 10 ఏళ్లలో దేశం నుంచి 36 కోట్ల డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించాలి అనుకుంటున్నా. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు, బస్సులు వీటికి ప్రత్యామ్నాయాలుగా మారాయి. డీజిల్ వాహనాల్లో రూ.100 ఖర్చయితే ఈవీల్లో కేవలం రూ.4ల విద్యుత్ సరిపోతుంది’ అని చెప్పారు. గడ్కరీ వ్యాఖ్యలపై మీ కామెంట్.
AP: 151 MLAలున్న జగన్ పార్టీని ప్రజలు 11 సీట్లలోనే గెలిపించడంతో తప్పు ఎక్కడ జరిగిందనేది YCP అధినేత సహా ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. వైసీపీ కంచుకోటల్లోనూ కూటమి అభ్యర్థులు బంపర్ మెజార్టీలు సాధించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్కా 90% YCP ఓట్లు, ఆ పార్టీకి పట్టున్న గ్రామాల్లోనూ కూటమికి మెజార్టీ రావడంతో తలలు పట్టుకుంటున్నారు. YCPపై ఇంత వ్యతిరేకతకు గల కారణాలు మీరు ఏమని అనుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.