India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈచిత్రం టీవీల్లో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ‘కల్కి’ జీతెలుగులో ప్రసారం కానుంది. దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఈనెల 3 నుంచి జపాన్లో స్క్రీనింగ్ అవుతోంది.
తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలి. సోషల్ మీడియాను మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘యువతకు మార్గదర్శి, భారతీయ ఆధ్యాత్మిక మహర్షి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ నుంచి ఎవరు హాజరవుతున్నారో తెలిసింది. విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. భారత్కు ఆయనే ప్రాతినిధ్యం వహిస్తారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణం చేసి రెండోసారి ప్రెసిడెంట్గా వైట్హౌస్లో అడుగుపెడతారు. ఈ కార్యక్రమానికి ఆయా దేశాల ప్రభుత్వాధినేతలు, వ్యాపారులు, సెలబ్రిటీలు హాజరవుతున్నారు.
కెనడా పీఎం రేసులో ముందంజలో ఉన్న భారత సంతతి మహిళ, అనితా ఆనంద్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీకి చెందిన ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఆ పదవిని అనిత స్వీకరిస్తారని అందరూ భావించినప్పటికీ.. తాను కూడా ట్రూడో బాటలోనే వెళ్లాలనుకుంటున్నానని, పదవులపై ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. అనిత తండ్రి తమిళ వ్యక్తి కాగా తల్లి పంజాబీ.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ‘నానా హైరానా’ సాంగ్ను యాడ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నేటి నుంచి థియేటర్లలో ఈ సాంగ్తో కూడిన ప్రింట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. తొలుత 14వ తేదీన సాంగ్ యాడ్ చేస్తామని తెలుపగా రెండు రోజుల ముందే వచ్చేసింది. సాంగ్ లేకపోవడంపై సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో మేకర్స్ వెంటనే యాడ్ చేసినట్లు తెలుస్తోంది.
వారానికి 90 గంటలు పనిచేయాలన్న SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఎడెల్వీస్ మ్యూచువల్ఫండ్ CEO రాధికా గుప్తా తప్పుబట్టారు. తన మొదటి జాబ్లో ఏకంగా వారానికి 100 గంటలు పనిచేయడంతో మానసిక క్షోభకు గురై బాత్రూమ్లో ఏడ్చేదానినని చెప్పుకొచ్చారు. హార్డ్వర్క్ను ఉద్యోగుల పని గంటలతో పోల్చొద్దని, పనిలో నాణ్యత, ఉత్పాదకత ముఖ్యమన్నారు. ఉద్యోగి శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వర్క్ కల్చర్ కావాలన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబోలో రాబోతున్న ‘జైలర్-2’ నుంచి అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్ వీడియో విడుదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్ డిసెంబర్లోనే పూర్తయినట్లు వెల్లడించాయి. ‘సన్ పిక్చర్స్’ సైతం బిగ్ అనౌన్స్మెంట్ కోసం వేచి ఉండాలంటూ ట్వీట్ చేసింది. కాగా, ‘జైలర్’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
బీజీటీలో ఘోర ఓటమి నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అయినా గెలవాలని చూస్తున్న టీమ్ ఇండియాకు షాక్ తగిలినట్లు తెలుస్తోంది. వెన్నులో వాపు కారణంగా భారత పేసర్ బుమ్రా గ్రూప్ స్టేజ్ మ్యాచులన్నీ మిస్ కావొచ్చని సమాచారం. అతడి ఫిట్నెస్ విషయంలో మల్లగుల్లాల కారణంగానే జట్టును ప్రకటించేందుకు ఐసీసీని బీసీసీఐ మరింత సమయం అడిగినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
వివేకానంద జయంతి సందర్భంగా యువతను చైతన్య పరిచేలా ఆయన చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుందాం. ‘విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశచెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుది మెట్టు కాదు’. మరొకటి ‘ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించే ఆలోచించండి. దాని గురించే కలగనంది. మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనీయండి. మిగతా ఆలోచనలను పక్కనబెట్టండి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది’.
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్కిన్ లెస్ చికెన్ రూ.220గా ఉంది. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. సంక్రాంతి పండగ దగ్గర పడటంతో ఎక్కువ మంది నాటుకోళ్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
Sorry, no posts matched your criteria.