News December 20, 2024

ఇవాళ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

AP: అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, మన్యం, అనకాపల్లి, అన్నమయ్య జిల్లాలు సహా పలుచోట్ల రాత్రి నుంచి వర్షం పడుతోంది. దీంతో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. వర్షంలో స్కూలు, కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని, ముందే సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News December 20, 2024

అశ్విన్‌లో ఆవేదన, బాధ కనిపించాయి: కపిల్ దేవ్

image

భారత స్టార్ ఆటగాడు అశ్విన్‌ ఇలా ఆటను వదిలేయడం తనను షాక్‌కు గురిచేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. కొన్ని రోజులు ఆగి సొంత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించాల్సిందన్నారు. అతనిలో ఆవేదన, బాధ కనిపించాయని.. తన వైపు కథేంటో వినాలని ఉందని చెప్పారు. బ్యాటర్లకు ఎక్కువగా ప్రశంసలు దక్కే ఆటలో అశ్విన్ సత్తా చాటి 100కు పైగా టెస్టులు ఆడారన్నారు. BCCI అతనికి ఘనమైన వీడ్కోలు పలకాలని కపిల్ దేవ్ అన్నారు.

News December 20, 2024

STOCK MARKETS: ఇవాళా నష్టాలేనా!

image

స్టాక్‌మార్కెట్లు నేడూ లాభపడే సూచనలు కనిపించడం లేదు. నిన్న US, EU సూచీలన్నీ భారీ నష్టాల్లో ముగిశాయి. మరోవైపు రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠమైన 85.08కు చేరుకుంది. FIIల అమ్మకాలు కొనసాగుతున్నాయి. నేడు ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నిక్కీ పెరిగినా గిఫ్ట్ నిఫ్టీ 67 పాయింట్లు తగ్గిపోవడం అశుభసూచకం. ఓవర్ సోల్డ్ పరిస్థితుల్లో సూచీల్లో స్వల్ప పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉందంటున్నారు నిపుణులు.

News December 20, 2024

అమెరికా వీసా కష్టాలకు చెక్!

image

అమెరికా వీసా కోసం ఇకపై నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. నిబంధనల్లో మార్పులు చేయడంతో కొత్త సంవత్సరం నుంచి దరఖాస్తుదారులు వారి అపాయింట్‌మెంట్‌ను ఎలాంటి అదనపు రుసుము లేకుండా మరో వీసా కేంద్రానికి మార్చుకోవడంతో పాటు ఒకసారి రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. రెండోసారి రీ షెడ్యూల్ చేసుకోవాలని భావిస్తే కొత్త అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది.

News December 20, 2024

మతపరమైన పాలనపై సిరియాలో నిరసనలు

image

మతపరమైన పాలన తమకొద్దంటూ వందలాదిమంది సిరియా ప్రజలు నిరసనల బాట పట్టారు. రాజధాని డమాస్కస్‌లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద గుమిగూడి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు హక్కుల్ని కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటూ డిమాండ్ చేశారు. ‘50 ఏళ్లకు పైగా నియంతృత్వ పాలనలో నలిగిపోయాం. ఇప్పుడైనా మాకు లౌకిక, ప్రజాస్వామ్య పాలనను ఏర్పాటు చేయాలి’ అంటూ నినాదాలు చేశారు.

News December 20, 2024

కొత్తగా 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు: శ్రీధర్ బాబు

image

TG: ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న మహబూబ్‌నగర్, మంచిర్యాలను కార్పొరేషన్లుగా మారుస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తున్నామన్నారు. అటు కోహీర్, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇస్నాపూర్, చేవెళ్ల, మొయినాబాద్, మద్దూర్, దేవరకద్ర, కేసముద్రం, స్టేషన్ ఘన్‌పూర్, అశ్వారావుపేట, ఏదులాపురం పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తున్నామన్నారు.

News December 20, 2024

నేడు జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

image

TG: లగచర్ల దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న రైతులు ఇవాళ విడుదల కానున్నారు. రెండు రోజుల క్రితం వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. గురువారమే వారు రిలీజ్ కావాల్సి ఉండగా, సాయంత్రం 6 గంటలలోగా బెయిల్‌కు సంబంధించిన పత్రాలు సిద్ధం కాకపోవడంతో విడుదల చేయలేదు. దీంతో నేడు ఉదయం రిలీజ్ చేయనున్నారు.

News December 20, 2024

3 ప్రధాన సంస్థలతో ఒప్పందాలు: మంత్రి లోకేశ్

image

AP: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందుకోసం 2కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థతో సీడాప్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్, స్వయం ఉపాధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఆదాయం కల్పించడం ఈ ఒప్పందాల లక్ష్యమని పేర్కొన్నారు.

News December 20, 2024

ఆ చిన్నారికి జికా వైరస్ లేదు!

image

AP: నెల్లూరు జిల్లా మర్రిపాడు (M) వెంకటాపురానికి చెందిన బాలుడి(6)లో జికా వైరస్ లక్షణాలు కనిపించిన విషయం తెలిసిందే. వైద్యం కోసం అతడిని తల్లిదండ్రులు చెన్నైలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా TN ప్రభుత్వం సైతం వారికి అండగా నిలిచింది. చిన్నారి రక్తనమూనాలను హెల్త్ లేబరేటరీలో పరీక్షించగా జికా వైరస్ లేదని తేలినట్లు DMHO పెంచలయ్య తెలిపారు. కాగా, పుణే వైరాలజీ ల్యాబ్ నుంచి వివరాలు రావాల్సి ఉందని ఆయన చెప్పారు.

News December 20, 2024

ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం కొనసాగింపు

image

AP: రాష్ట్రంలోని మసీదుల ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇమామ్‌లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. 2024 ఏప్రిల్ నుంచి ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం ఏటా రూ.90 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి N.MD. ఫరూక్ తెలిపారు.