India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత హయాంలో మోదీ ప్రభుత్వం రైల్వేపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో ఈ స్టాక్స్ రెండు రోజుల్లోనే 33% వరకు క్రాష్ అయ్యాయి. టిటాగఢ్ రైల్వే సిస్టమ్స్ 33, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 26, రైల్ టెల్ కార్ప్, IRCTC చెరో 19, RITES, IRFC, RVNL, టెక్స్మాకో, జూపిటర్ వ్యాగన్స్ షేర్లు 18-23% మేర క్షీణించాయి. NDA-3 ప్రభుత్వం స్థిరపడే దాక ఈ షేర్లలో కరెక్షన్ తప్పకపోవచ్చు.
ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనను ఆపద్ధర్మ పీఎంగా కొనసాగాలని కోరినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8న మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇందులో సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ వాడకానికే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటిన్యూగా 3 గంటలు గడిపే టీనేజర్లలో యాంగ్జైటీ, కోపం, నిరాశ వంటి సమస్యలు ఉన్నాయని ఓ సర్వే పేర్కొంది. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తెలిపింది. దీంతో వీలైనంత ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
TG: APలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని CM రేవంత్ రెడ్డి తెలిపారు. APకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని, అది ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారని చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ అధిష్ఠానంతో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు. CMగా ప్రమాణస్వీకారానికి పిలిస్తే తప్పకుండా వెళ్తానని వెల్లడించారు.
AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
AP: మాచర్ల.. ఇక్కడ రాజకీయం చేయడం నేతలకే కాదు కార్యకర్తలకూ కత్తి మీద సామే. గత 15 ఏళ్లుగా తన అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సామ్రాజ్యాన్ని జూలకంటి బ్రహ్మారెడ్డి(TDP) కూలదోశారు. గతంలో జూలకంటి తండ్రి, తల్లి కూడా ఇక్కడ నెగ్గారు. 1972లో నాగిరెడ్డి ఇండిపెండెంట్గా గెలిచారు. దీంతో ఆయన్ను పల్నాటి పులి అంటారు. 1999లో బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ TDP నుంచి నెగ్గారు.
*అమెరికా- 8,133.46 టన్నులు
*జర్మనీ – 3,352.65 టన్నులు
*ఇటలీ – 2,451.84టన్నులు
*ఫ్రాన్స్ – 2,436.88 టన్నులు
*రష్యా- 2,332.74టన్నులు
*చైనా – 2,262.45టన్నులు
*స్విట్జర్లాండ్ – 1,040 టన్నులు
*జపాన్ – 845.97టన్నులు
*భారత్ – 822.10టన్నులు
NDA ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న TDP కేంద్ర కేబినెట్లో 4 మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. 16 MP సీట్లతో BJP తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉన్న TDP.. లోక్సభ స్పీకర్ పదవితో పాటు రవాణా, వ్యవసాయం, జల్ శక్తి, గ్రామీణాభివృద్ధి, హెల్త్ శాఖలను కోరుతున్నట్లు సమాచారం. సాయంత్రం జరగనున్న NDA సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశముంది.
కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. 17వ లోక్సభను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎల్లుండి బీజేపీ ఎంపీలు పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవనున్నారు. తర్వాతి రోజు(8న) ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
TMCలో మరో ఫైర్ బ్రాండ్ లేడీ సయోనీ ఘోష్ జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ దీదీ లాగానే ఆ పార్టీలో పవర్ఫుల్ మహిళగా గుర్తింపు పొందారు. నటి అయిన ఆమె రాజకీయాల్లోకి వచ్చి చేసేదేమీ లేదని BJP విమర్శించినా.. దానిని సవాలుగా తీసుకుని సివంగిలా దూసుకొచ్చారు. అనర్గళంగా ప్రసంగిస్తూ BJPకి దడ పుట్టించారు. భవిష్యత్తులో ఆమె మంచి నేత అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.