India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒడిశా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ మొత్తం 147 స్థానాలుండగా బీజేపీ 47 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అధికార బీజేడీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 6, సీపీఐ(ఎం) 1, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట ముందంజలో ఉన్నారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైన నేత ప్రజ్వల్ రేవణ్ణ. జేడీఎస్ నుంచి ఆయన హసన్లో సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లీడింగులో ఉన్నారు. ప్రత్యర్థిపై 2327 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మండ్య నుంచి కుమార స్వామి 100937 ఓట్ల లీడింగులో ఉన్నారు. కోలార్ నుంచి అదే పార్టీ నేత మల్లేశ్ బాబు 70485 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి 22,674 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 1,04,227 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నేత భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లురాగా, షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.
ఎన్నికల ఫలితాల కోసం Way2Newsను ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఉదయం గం.8:45 నిమిషంలో ఏకంగా 15 లక్షల కాంకరెంట్ యూజర్లు యాప్లో లైవ్గా ఉన్నారు. ఇక కేవలం 8:30 నుంచి 9గంటల మధ్య 3 మిలియన్లకు పైగా యూజర్లు యాప్లో ఎన్నికల అప్డేట్స్ పొందారు. ఏ యాప్లో ఇవ్వనట్లుగా వేగమైన అప్డేట్స్, లైవ్ గ్రాఫిక్ డిజైన్స్, ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఫలితాలనూ అందిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.
TG: నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9వేల ఓట్ల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. BRS మూడో స్థానంలో ఉంది.
AP: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి వెనుకంజలో ఉన్నారు. అద్దంకిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఆధిక్యంలో ఉన్నారు. సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ లీడింగ్లో కొనసాగుతున్నారు.
కేరళలో 20 స్థానాలకు గాను 18 స్థానాల్లో UDF ఆధిక్యంలో ఉంది. ఒక స్థానంలో బీజేపీ, ఒక స్థానంలో LDF లీడింగ్లో కొనసాగుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ 14, కాంగ్రెస్ 12, జేడీఎస్ 2 చోట్ల ముందంజలో ఉన్నాయి. గోవాలో 2 స్థానాలకు గాను బీజేపీ 1, INC 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మొత్తం 29 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది.
గుజరాత్లో బీజేపీ 22 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కర్ణాటకలో 15 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ 11 స్థానాల్లో, జేడీఎస్ 2 సీట్లలో లీడింగ్లో ఉన్నాయి. రాజస్థాన్లో బీజేపీ 15, కాంగ్రెస్ 8, ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మణిపుర్లో కాంగ్రెస్, NPF ఒక్కో స్థానంలో, మేఘాలయాలో కాంగ్రెస్, ఇతరులు చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. సిక్కింలో ఇతరులు, మిజోరంలో కాంగ్రెస్, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో, నాగాలాండ్లో కాంగ్రెస్, త్రిపురలో బీజేపీ ముందంజలో ఉన్నాయి.
దేశంలో ఎన్డీఏ మేజిక్ ఫిగర్ దాటింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 290 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై మాత్రం కోయంబత్తూరులో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కూడా చెన్నై వెస్ట్లో వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 222 సీట్లలో లీడింగ్లో కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.