India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు లీడ్లో ఉన్నారు. బాపట్ల MP స్థానంలో TDP అభ్యర్థి కృష్ణప్రసాద్ లీడింగ్లో ఉన్నారు. అవనిగడ్డలో జనసేన నేత బుద్ధప్రసాద్ ముందంజలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ లీడింగ్లో ఉన్నారు. ఇటు విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి లీడింగ్లో ఉన్నారు.
మెదక్లో BRSకు షాక్ తగిలేలా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముందంజలో ఉన్నారు. గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో గెలుపొందడంతో మరోసారి గెలుస్తామని బీఆర్ఎస్ ఆశించినా తొలి రౌండ్లో నిరాశే ఎదురైంది.
ఏపీలో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్ప మిగతా మంత్రులందరూ వెనుకబడ్డారు. ప్రస్తుతానికి NDA కూటమి 80+ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
AP: విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ బరిలో నిలిచారు. అటు బొబ్బిలిలో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
AP: దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ వెనుకంజలో ఉన్నారు. సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు.
ఎర్లీ ట్రెండ్స్ సరళిని గమనిస్తే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. పోటీ ఏకపక్షంగా లేకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 612 పాయింట్ల నష్టంతో 22,651, బీఎస్ఈ సెన్సెక్స్ 2117 పాయింట్లు పతనమై 74,313 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1440 పాయింట్లు ఎరుపెక్కి 49,539 వద్ద ఉన్నాయి. ప్రస్తుత పతనంతో మదుపర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు.
బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ లీడింగులో ఉన్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత 2,365 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో తొలి రౌండులో సీఎం జగన్ 1,888 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. పెనుకొండలో సవిత వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ లీడింగులో ఉన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 3,773 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 3,214 ఓట్లు పడ్డాయి.
TG: ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి మొదటి నుంచి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రఘురాంరెడ్డి రెండో రౌండ్ ముగిసే సమయానికి 55,654 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గతంలో ఇది బీఆర్ఎస్ సిటింగ్ సీటు.
AP: కొండపి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డీబీవీ స్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ వెనుకంజలో ఉన్నారు. అలాగే సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ లీడింగ్లో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున వెనుకంజలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.