India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జనసేన పోటీ చేసిన 21 MLA స్థానాల్లో 14-15 సీట్లు, 2 ఎంపీ స్థానాల్లో గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. పిఠాపురం, పెందుర్తి, విశాఖ సౌత్, యలమంచిలి, అనకాపల్లి, నెల్లిమర్ల, పాలకొండ, రాజానగరం, పి.గన్నవరం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, అవనిగడ్డ, తెనాలి, తిరుపతి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో JSP ఎక్కడెక్కడ గెలుస్తుందో కామెంట్ చేయండి.
AP: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే <<13354570>>పిన్నెల్లి<<>> రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆయనను ఆదేశించింది. అలాగే బెయిల్ను పొడిగించకుండా ఈ నెల 6న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. EVM ధ్వంసం కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ను చూడాలనే లేదని క్రికెటర్ రియాన్ పరాగ్ వ్యాఖ్యానించారు. ‘జట్టులో నేను ఉండి ఉంటే ఏమవుతుందనే కంగారు ఉండేది. టీమ్లో నేను లేను కాబట్టి మ్యాచ్లపై పెద్దగా ఆసక్తి లేదు. చివరకు ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దానితోనే సంతోష పడతా’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ఐపీఎల్లో రియాన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. WCకి ఎంపిక చేస్తారనే చర్చ నడిచినా జట్టులో చోటు దక్కలేదు.
పాకిస్థాన్ ఆర్మీలో బ్రిగేడియర్గా తొలిసారి ఓ మహిళ, క్రైస్తవ వర్గానికి చెందిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ నియమితులయ్యారు. ఆర్మీ మెడికల్ కేర్లో సీనియర్ పాథాలజిస్ట్గా 26 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమెకు తాజాగా పదోన్నతి లభించింది. దీంతో మేరీకి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. కాగా 2021 గణాంకాల ప్రకారం పాక్లో 96.47 శాతం ముస్లింలు, 2.14 శాతం హిందువులు, 1.27 శాతం క్రైస్తవులు ఉన్నారు.
ఇవాళ ఒమన్-నమీబియా మధ్య జరిగిన T20WC మ్యాచ్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఒమన్ టీమ్లోని ఆరుగురు బ్యాటర్లు LBWగా వెనుదిరిగారు. మెన్స్ T20లో ఇంతమంది ఇలా ఔటవడం ఇదే తొలిసారి. గతంలో నెదర్లాండ్స్(vsశ్రీలంక), స్కాట్లాండ్(vsఅఫ్గాన్) బ్యాటర్లు ఐదుగురు LBWగా ఔటయ్యారు. ఇవాళ మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్లో నమీబియా <<13366862>>గెలిచిన<<>> విషయం తెలిసిందే.
NTR హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. అక్టోబర్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ డేట్లో రామ్చరణ్ నటిస్తోన్న గేమ్ఛేంజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో ముందుగా సెప్టెంబర్ 27న దేవర విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డేట్లో రిలీజ్ అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ డిసెంబర్కు పోస్ట్పోన్ అవ్వొచ్చని తెలుస్తోంది.
లోక్సభ-2024 ఎన్నికల్లో కీలక నేతలు ఓటమి పాలవుతారని టైమ్స్ నౌ-ETG ఎగ్జిట్ పోల్స్ సర్వే తెలిపింది. కృష్ణానగర్లో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా, తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మండీలో కంగనా రనౌత్, కన్నౌజ్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తదితర నేతలకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పింది.
TG: దేశంలో, రాష్ట్రంలో రేపటి కౌంటింగ్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో ముందే కచ్చితంగా చెప్పే జ్యోతిషులను సన్మానించి, రూ.10లక్షలు ఇస్తామని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు సాంబయ్య ప్రకటించారు. అలాకాని పక్షంలో జ్యోతిషం తప్పని ఒప్పుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడో ఉండే గ్రహాలు భూమిపై ఉన్న మానవునిపై ప్రభావం చూపుతాయా? అని ప్రశ్నించారు. దీనిపై జ్యోతిషులు మండిపడుతున్నారు.
‘సాహో’ చిత్రంలో హీరో ప్రభాస్కు జోడీగా నటించిన శ్రద్ధా కపూర్కు మళ్లీ తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ప్రభాస్తో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రద్ధా కపూర్ స్పందించారు. ‘ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ పంపించినప్పుడు సినిమా చేస్తా’ అంటూ ఫన్నీగా ఇన్స్టాలో రిప్లై ఇచ్చారు. దీనికి ‘ప్రభాస్ హోమ్ ఫుడ్కి శ్రద్ధా ఫిదా అయ్యారేమో’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
TG: పాలిసెట్ ఫలితాలు నేడు మ.12 గంటలకు విడుదల కానున్నాయి. https://sbtet.telangana.gov.in అధికారిక సైట్తో పాటు Way2News యాప్లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్లో హాల్టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ సహా ఏ ప్లాట్ఫాంకైనా రిజల్ట్ను ఒక్క క్లిక్తో షేర్ చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.