News January 12, 2025

నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్.. బరిలో తెలుగు ప్లేయర్

image

మెగా టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సెర్బియా ప్లేయర్ జకోవిచ్ ఫేవరెట్‌గా ఉన్నారు. ఈ సారి ట్రోఫీ గెలిచి అత్యధిక గ్రాండ్ స్లామ్స్ రికార్డును ఖాతాలో వేసుకోవాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. జకోకు అల్కరాజ్, సినర్ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ రిత్విక్ డబుల్స్ విభాగంలో ఆడుతున్నారు.

News January 12, 2025

పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాళ్లు దాటింది: పవన్

image

APలో NDA పాలన మొదలయ్యాక పంచాయతీ రాజ్ శాఖలో పలు మైలురాళ్లు దాటామని Dy.CM పవన్ కళ్యాణ్ ట్విటర్లో తెలిపారు. ‘YSRCP ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ CC రోడ్లు వేస్తే మా 6నెలల పాలనలో 3750 కి.మీ వేశాం. మినీ గోకులాలు వైసీపీ 268 ఏర్పాటు చేయగా NDA హయాంలో 22,500 నెలకొల్పాం. PVTG ఆవాసం కోసం వైసీపీ రూ.91 కోట్లు వెచ్చిస్తే మా సర్కారు 6 నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చుపెట్టింది’ అని వెల్లడించారు.

News January 12, 2025

రాష్ట్రంలోకి కొత్త బీర్లు, లిక్కర్!

image

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం రానుంది. దీని కోసం కొత్త లిక్కర్, బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు కంపెనీల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు. లిక్కర్ తయారీలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించేది లేదన్నారు. మరోవైపు మద్యం ధరలు పెంచబోమని సీఎం స్పష్టం చేశారు.

News January 12, 2025

నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి వెళ్లనున్నారు. తిరుచానూరులో ఇళ్లకు పైపుల ద్వారా సహజవాయువును సరఫరా చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు. ఈ నెల 15 వరకూ ఆయన ఊరిలోనే గడపనున్నారు. కుటుంబీకులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబం గ్రామానికి చేరుకుంది.

News January 12, 2025

ఈ రోజు చాలా ప్రత్యేకం: బాబీ

image

‘డాకు మహారాజ్’ రిలీజ్ సందర్భంగా దర్శకుడు బాబీ అభిమానులనుద్దేశించి ట్వీట్ చేశారు. ఇవాళ చిత్ర యూనిట్‌కు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. రెండేళ్లుగా అభిమానుల అంచనాలు, ఎమోషన్లు, ఊహలను అందుకోవాలనే తన కలను చేరుకునే క్షణమిదేనని అన్నారు. ముఖ్యంగా బాలయ్య అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రానికి పనిచేసిన యూనిట్‌కు ధన్యవాదాలు చెప్పారు.

News January 12, 2025

‘డాకు మహారాజ్’ పబ్లిక్ టాక్

image

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. యూఎస్‌లో సినిమా ప్రీమియర్లు మొదలయ్యాయి. మూవీలో బాలకృష్ణ నటన, డైలాగ్స్ అదిరిపోయాయని.. తమన్ మ్యూజిక్ ఇరగదీశారని కామెంట్లు చేస్తున్నారు. సినిమా చివరి 30 నిమిషాలు ఊహించేలా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ బాలయ్య అభిమానులకు పసందైన విందు లాంటిదని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.

News January 12, 2025

వారికి రైతు భరోసా ఇవ్వం: మంత్రి పొంగులేటి

image

TG: రైతు భరోసా విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగ్యమైన భూమి ఉన్నవారికి పథకం అమలు చేస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదని స్పష్టం చేశారు. మరోవైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రత్యర్థుల రెచ్చగొట్టే చర్యలకులోను కావొద్దన్నారు. అర్హులను గుర్తించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని తెలిపారు.

News January 12, 2025

మాంజాపై నిషేధాన్ని అమలు చేయండి: హైకోర్టు

image

TG: గాలిపటాలకు నైలాన్ దారాలను లేదా మాంజాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీటి విక్రయాన్ని నిషేధిస్తూ 2017లో NGT ప్రధాన బెంచ్ వెల్లడించిన తీర్పును అమలు చేయాలని పేర్కొంది. ఉత్తర్వుల అమలుపై వివరాలు సమర్పించాలని హోం, అటవీ, పర్యావరణ శాఖల సీఎస్‌లకు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

News January 12, 2025

రిపబ్లిక్ డే పరేడ్‌కు రాష్ట్రం నుంచి 41 మంది

image

TG: న్యూఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు 41 మంది రాష్ట్ర వాసులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాజేశ్వర్ ఉండనుండగా ట్రెయినీ డీజీటీ శ్రావ్యతో పాటు మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

News January 12, 2025

నేడు మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి.