India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చి విజేత ఎవరో తేల్చలేని పరిస్థితి నెలకొంటే.. డ్రా తీసి విజేతను ప్రకటిస్తారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లోని సెక్షన్ 102 ఈ అవకాశం కల్పించింది. అయితే.. అందుకోసం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా వస్తుంది. 2019లో రాజస్థాన్లో, 2017లో ముంబైలో ఇలాగే ఫలితం తేలింది. <<-se>>#ELECTIONS<<>>
TG: మంచిర్యాల జిల్లా భీమారంలో ఈరోజు 47.2°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత. భద్రాద్రి కొత్తగూడెం(47.1°C), పెద్దపల్లి(46.7°C), కుమురంభీమ్(46.6°C), ఖమ్మం(46.5°C) అత్యధిక ఉష్ణోగ్రతలను చూశాయి. హైదరాబాద్లో 43.0°C ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజులు ఇలాగే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై ఆ తర్వాత వేడి తగ్గే అవకాశం ఉందని వివరించింది.
గంభీర్ టీమ్ ఇండియా కోచ్ అవుతారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘మేం(KKR) IPLలో 3 టైటిళ్లు సాధించినా MI, CSK కంటే వెనకబడే ఉన్నాం. ఇప్పటికీ అత్యంత విజయవంతమైన జట్లలో మేం లేము. అలా జరగాలంటే మరో 3 టైటిళ్లు నెగ్గాలి. మా తర్వాతి లక్ష్యం అదే. ఇప్పుడే ఆ జర్నీ ప్రారంభమైంది. KKRను విజయవంతమైన జట్టుగా నిలపడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు’ అని అన్నారు.
VVPAT సిస్టమ్ 2013 నుంచి వినియోగంలోకి వచ్చింది. ఈవీఎంలకు అనుసంధానమైన ఈ యంత్రం అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తుతో స్లిప్ను రూపొందిస్తుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నంబర్స్ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఇలా ఎంపిక చేసిన VVPATలలోని స్లిప్పులు లెక్కించి ఈవీఎం రిజల్ట్తో సరిపోల్చుతారు. ఈవీఎం, స్లిప్ల ఓట్లలో వ్యత్యాసం ఉంటే స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుంటారు.
యమునా నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన ఓ శివాలయాన్ని కూల్చివేసేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘శివుడికి మన రక్షణ అవసరం లేదు. మనమే రక్షించమని, ఆశీర్వదించమని ఆయనను కోరుకోవాలి. నదీ తీరాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తే ఆయన సంతోషిస్తారు’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో గుడిని కూల్చివేయొద్దని ఆలయ నిర్వాహకులు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది.
2023-24FYకి సంబంధించిన ITR ఫైలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఉద్యోగస్థులు జూన్ 15 వరకు వేచి చూడటం ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వారి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఫాం 26AS మే 31న అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత 15 రోజుల్లో TDS సర్టిఫికెట్లు వస్తాయి. సో, జూన్ 15లోపు చేస్తే ITRలో ఇన్ఫర్మేషన్ అసంపూర్తిగా నమోదయ్యే అవకాశం ఉంది. తద్వారా ఫైన్ కూడా భరించాల్సి ఉంటుంది.
TG: ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను స్వాగతిస్తున్నామని TJS చీఫ్ ప్రొ.కోదండరాం అన్నారు. తొలిసారి తమను భాగస్వాముల్ని చేస్తున్నారని, గతంలో ఎప్పుడూ ఆహ్వానం అందలేదని చెప్పారు. తాము కోరుకున్న గీతం, చిహ్నాలను ప్రభుత్వం తీసుకొస్తోందని వెల్లడించారు. జయజయహే తెలంగాణ పాట రాసింది ఎవరనేది ముఖ్యమని, పాడింది కాదన్నారు. లోగో మారిస్తే బాగుంటుందని, కట్టడాలు మాత్రమే చిహ్నం కాదని అభిప్రాయపడ్డారు.
పొట్టి ప్రపంచకప్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి పేరిట ఉంది. 2010లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆయన నాలుగు క్యాచ్లు పట్టారు. ఆ రికార్డు ఇప్పటికీ బద్దలు కాలేదు. బ్రెట్లీ, సులేమాన్ బెన్, సిమన్స్, ఏబీ డివిలియర్స్, వార్నర్, సురేశ్ రైనా, బ్రావో, మిల్లర్, స్టోక్స్ తదితర ప్లేయర్లు తలో మూడు క్యాచ్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
రాష్ట్రంలో తొలి ఫలితం తూ.గో జిల్లా కొవ్వూరు లేదా ప.గో జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 2 సెగ్మెంట్లలోనూ 13 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి, అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గాల ఫలితాలు చివరగా వెలువడే ఛాన్స్ ఉంది. ఈ రెండు స్థానాల్లో 29 రౌండ్ల చొప్పున కౌంటింగ్ చేయనున్నారు. భీమిలి, పాణ్యం ఫలితాలు కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.
TG: దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం ఉ.10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ఫాస్ట్ తర్వాత అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్పై నిర్వహించే వేడుకలకు సీఎం హాజరవుతారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.