News May 30, 2024

మంత్రుల పేషీలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు

image

AP: జూన్ 3న సచివాలయంలోని మంత్రుల పేషీలు, ఛాంబర్లను ఖాళీ చేయించి, స్వాధీనం చేసుకోవాలని అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. సచివాలయం నుంచి ఎలాంటి సామగ్రి బయటికి వెళ్లకుండా చూడాలని సూచించింది. తమ అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తరలించొద్దని స్పష్టం చేసింది. కాగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.

News May 30, 2024

మీరు వ్యాసం రాయగలిగినా సరే దూరంగా ఉండండి: వాహనదారుడు

image

పుణే పోర్షె కేసు సంచలనమైన వేళ ఓ వ్యక్తి తనదైన శైలిలో వాహనదారులకు వార్నింగ్ ఇచ్చాడు. 300 పదాల వ్యాసం రాయగలిగినా సరే తన వాహనానికి తగిన దూరం పాటించాలంటూ ఓ నోట్ తన కారుకు అంటించాడు. పుణే పోర్షె కేసులో 300 పదాల వ్యాసం రాయాలని కోర్టు ఇటీవల నిందితుడిని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే‌లో ఓ కారుపై దర్శనమిచ్చిన ఈ నోట్ నెట్టింట వైరలవుతోంది.

News May 30, 2024

TG రాజముద్ర మార్పుపై పునరాలోచన?

image

తెలంగాణ రాజముద్ర మార్పుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు ఓ వర్గం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొత్త చిహ్నానికి 200కు పైగా సూచనలు వచ్చాయి. సాంకేతిక సమస్యల కారణంగా ఆవిష్కరణ వాయిదా పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరికాసేపట్లో స్పష్టత రానుంది.

News May 30, 2024

ఎయిర్ ఇండియా ఫ్లైట్ లేట్.. రూ.2.08 లక్షలు ఫైన్

image

విమానాన్ని ఆలస్యంగా నడిపినందుకు ‘ఎయిర్ ఇండియా’కి రూ.2.08 లక్షల జరిమానా పడింది. బెంగళూరుకు చెందిన జితేందర్ కుమార్ అనే వ్యక్తి గతేడాది సెప్టెంబర్ 25న స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి బయల్దేరారు. అయితే, విమానం ఆలస్యంగా వెళ్లడంతో స్విట్జర్లాండ్ ఫ్లైట్ మిస్ అయ్యారు. ఆయన కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించగా.. 8 నెలల తర్వాత ఎయిర్ ఇండియాకు ఫైన్ విధిస్తూ తీర్పు వెలువడింది.

News May 30, 2024

T20WC: నేపాల్ క్రికెటర్‌కు భారీ ఎదురుదెబ్బ

image

నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానేకు అమెరికా భారీ షాక్ ఇచ్చింది. అమెరికాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు మరోసారి ఆ దేశం వీసా నిరాకరించింది. దీంతో సందీప్ పొట్టి ప్రపంచకప్‌కు దూరం కానున్నారు. కాగా అత్యాచారం కేసులో ఇటీవలే సందీప్‌కు కాఠ్‌మాండూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఆయనను వరల్డ్ కప్ జట్టుకు ఆ దేశ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ అమెరికా మాత్రం ఆయనకు వీసా నిరాకరించింది.

News May 30, 2024

ప్రజ్వల్‌ రేవణ్ణకు 10రోజుల డెడ్‌లైన్: MEA

image

కర్ణాటక MP ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్ రద్దు దిశగా చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. తన పాస్‌పోర్టు ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలని ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చామంది. ఈమేరకు విధించిన డెడ్‌లైన్‌(10 రోజులు)లోగా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రజ్వల్ ఈరోజు అర్ధరాత్రి బెంగళూరుకు చేరుకోనుండగా.. ఆయనను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

News May 30, 2024

ఇంటర్ కాలేజీలకు రేపటితో ముగియనున్న సెలవులు

image

తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు రేపటితో వేసవి సెలవులు ముగియనున్నాయి. దీంతో జూన్ 1న కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ కాలేజీలకు మార్చి 31 నుంచి ఇంటర్ బోర్డు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుచుకుంటాయి.

News May 30, 2024

తుది అంకానికి సార్వత్రిక ఎన్నికలు

image

సుమారు రెండున్నర నెలలుగా దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మొత్తం 543 ఎంపీ స్థానాలతో పాటు AP, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 16న EC షెడ్యూల్ విడుదల చేసింది. తొలి విడత-APR 19, రెండో విడత-APR 26, మూడో విడత-మే 7, నాలుగో విడత-మే 13, ఐదో విడత-మే 20, ఆరో విడత-మే 25న జరిగాయి. జూన్ 1న చివరి విడత పోలింగ్ అనంతరం 4న ఫలితాలు రానున్నాయి.

News May 30, 2024

ముస్లిం యువకుడు, హిందూ యువతి పెళ్లి చెల్లదు: ఎంపీ హైకోర్టు

image

ముస్లిం యువకుడు, హిందూ యువతి పెళ్లి చేసుకోవడం ముస్లిం లా ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా తీర్పుచెప్పింది. మతాంతర వివాహంగా రిజిస్టర్ అయ్యేందుకు అనుమతినివ్వాలని, తమకు రక్షణ కల్పించాలని ఓ జంట చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇద్దరూ మతం మార్చుకోవడానికి సిద్ధంగా లేరని, ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నప్పటికీ ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

News May 30, 2024

ప్రసారాల్లో జియో సరికొత్త రికార్డ్!

image

ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రసారంలో కొత్త రికార్డుల్ని సృష్టించినట్లు జియో సినిమా ప్రకటించింది. ఈ సీజన్‌లో 62 కోట్ల వీక్షణలు నమోదైనట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 53శాతం ఎక్కువ. ఇక వీక్షణ సమయం 35వేల కోట్ల నిమిషాలుగా ఉందని తెలిపింది. గత ఏడాది తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ ఏడాది తొలిమ్యాచ్‌ను 51శాతం ఎక్కువగా (11.3 కోట్లమంది) చూశారని పేర్కొంది. ప్రేక్షకుడు సగటున 75 నిమిషాలను వెచ్చించారని చెప్పింది.