India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూదు మతానికి చెందిన వ్యక్తి. ఆయన పూర్వీకులు జర్మన్ నాజీల చేతిలో హత్యకు గురయ్యారు. జెలెన్స్కీ 1978లో జన్మించారు. 20 ఏళ్లకు పైగా టీవీ ప్రోగ్రాంలలో నటుడిగా, స్టాండప్ కమెడియన్గా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ ప్రారంభించి 2018లో Servant of the People అనే పార్టీని స్థాపించి, 2019లో ఘనవిజయం సాధించారు. ఈయన ఆస్తి రూ.260 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 OCT 1న లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనన మరణాల ధ్రువీకరణకు రిజిస్ట్రార్, మున్సిపాల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రం సమర్పించవచ్చని పేర్కొంది. 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారు DL/టీసీ/ సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన పత్రాన్ని సమర్పించాలని తెలిపింది.

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కుమారుడు భార్గవ రెడ్డితో కలిసి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సజ్జల స్క్రిప్ట్ ఆధారంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ని తిట్టానని నటుడు పోసాని కృష్ణమురళి చెప్పడంతో వారు కోర్టు మెట్లెక్కారు. తమను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని తెలిపారు. రాజకీయ కక్షలతోనే ఇరికిస్తున్నారని, బెయిల్ ఇస్తే విచారణకు సహకరిస్తామని కోరారు.

TG: రంజాన్ మాసం సందర్భంగా నేటి నుంచి 24 గంటలు షాపులు తెరిచి ఉండనున్నాయి. ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ వెసులుబాటు కల్పిస్తూ గత నెలలోనే సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే షాపులు, వ్యాపార సముదాయాల్లో పని చేసే సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పని చేస్తే యాజమాన్యం రెట్టింపు జీతం చెల్లించాలని పేర్కొంది. సెలవుల్లో పని చేస్తే ప్రత్యామ్నాయ లీవ్ ఇవ్వాలని ఆదేశించింది.

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. నిన్న ఆర్సీబీపై విజయంతో ఈ ఏడాది ప్లేఆఫ్ చేరుకున్న తొలి టీమ్గా నిలిచింది. గత రెండేళ్లలో ఫైనల్ చేరిన ఈ జట్టుకు కప్పు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ సారైనా మెగ్ లానింగ్ నాయకత్వంలో టీమ్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సారథితో పాటు షఫాలీ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

TG: రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లు, ఉర్దూ డైట్ కాలేజీల్లో ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. కాగా నిన్న రాత్రి నెలవంక కనిపించడంతో నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.

ప్రస్తుతం చాలామంది బ్రేక్ఫాస్ట్లో ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్నే తింటున్నారు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారంగా పాన్ కేక్స్, వాఫ్పల్స్ తీసుకోకూడదు. వీటిని మైదాతో తయారుచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. డీప్ ఫ్రై చేసిన వడ, పూరీ తినకూడదు. శాండ్విజ్, నూడుల్స్, పరోటా వంటివి తినొద్దు. బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ లేకుండా చూసుకోవడం బెటర్.

TG: రాష్ట్రంలో పొలాల సరిహద్దు సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో తీసుకురానున్న భూభారతి చట్టం ప్రకారం భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో మ్యాప్ తప్పనిసరి చేయనుంది. దీని కోసం రాబోయే ఆరు నెలల్లో భూములను సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రతి మండలానికి డిజిటల్ సర్వే పరికరం కొనుగోలు చేయనుంది. అదే సమయంలో సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో ఉంది.

AP: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ నెల 6న వైజాగ్లో జరిగే ఓ కార్యక్రమంలో వీరు వేదిక పంచుకోనున్నారు. 1995లో చివరిసారిగా వీరిద్దరూ కలిసి ఓ వేదికపై కనిపించారు. ఆ తర్వాత విభేదాల కారణంగా దగ్గుబాటి టీడీపీని వీడారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లలో కలుస్తున్నా బహిరంగ వేదికలపై ఎక్కడా కనిపించలేదు.

TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. రూ.751 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 500 పడకల ఆస్పత్రి, ఐటీ టవర్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేస్తారు. తాను చదువుకున్న పాఠశాలలో రూ.61 కోట్లతో నూతన భవనానికి భూమి పూజ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.