India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలోని సినీ స్టార్లలో FY24కు గాను అత్యధిక ట్యాక్స్(₹92 కోట్లు) చెల్లించిన వ్యక్తిగా కింగ్ఖాన్ షారుఖ్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దళపతి విజయ్(₹80కోట్లు), సల్మాన్ ఖాన్(₹75కోట్లు), అమితాబ్ బచ్చన్(₹71కోట్లు), అజయ్ దేవగణ్(₹42కోట్లు), రణ్బీర్ కపూర్(₹36కోట్లు), హృతిక్ రోషన్(₹28కోట్లు), కపిల్ శర్మ(₹26కోట్లు), కరీనా కపూర్(₹20కోట్లు), మోహన్ లాల్(₹14కోట్లు), అల్లు అర్జున్(₹14కోట్లు) ఉన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్తో పాటు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నెట్ఫ్లిక్స్లో నాన్ ఇంగ్లిష్ సినిమాల్లో ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తెలియజేస్తూ చేసిన పోస్ట్ను నాగ్ అశ్విన్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.1100+ కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ సీబీఐ కేసులో ఇంకా జైలులోనే ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆప్ నేతల్లో ఆసక్తి నెలకొంది.
హీరోయిన్ ప్రణితా సుభాష్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆమెకు ఓ కూతురు ఉండగా, ఇవాళ మరో బిడ్డకు తల్లి అయ్యారు. ఈమె తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, హలో గురు ప్రేమ కోసమే, బ్రహ్మోత్సవం, రభస, డైనమైట్, పాండవులు పాండవులు తుమ్మెద తదితర చిత్రాల్లో నటించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. BSE సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 82,387 వద్ద చలిస్తోంది. NSE నిఫ్టీ 10 పాయింట్లు ఎగిసి 25,209 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 24:26గా ఉంది. అల్ట్రాటెక్, టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, JSW స్టీల్ టాప్ గెయినర్స్. HDFC లైఫ్, HCL టెక్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా, బ్రిటానియా టాప్ లూజర్స్.
సమాజంలో ఎందరో ఆదర్శ ఉపాధ్యాయులున్నారు. డబ్బు ఆశించకుండా ఉచితంగా చదువు చెప్పే గురువులను ఈరోజు గుర్తుచేసుకుందాం. పశ్చిమబెంగాల్కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ద్విజేంద్రనాథ్ తన స్వగ్రామంలోని నిరుపేద పిల్లలకు చదువు చెప్పేందుకు జీవితాన్ని అంకితం చేశారు. చదువుకునేందుకు తనలా కష్టపడొద్దని ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసి 140 మందికి విద్యనందిస్తున్నారు. ఇలాంటి టీచర్లు మీ ప్రాంతంలోనూ ఉన్నారా? కామెంట్ చేయండి.
మహారాష్ట్రలో శివాజీ విగ్రహం <<13945453>>కూలడంతో<<>> ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ విగ్రహ శిల్పి జయదీప్ ఆప్టేను పోలీసులు అరెస్టు చేశారు. స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిర్మాణంలో వీరిద్దరూ నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. 10 రోజులుగా పరారీలో ఉన్న ఆప్టే లొంగిపోతానని భార్య ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
AP: రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి <<13980417>>చేపట్టాల్సిన<<>> మద్యం షాపుల బంద్ను వాయిదా వేస్తున్నట్లు బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్ వైజర్లు, సేల్స్మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో బంద్ చేపడతామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
FMCG వ్యాపారంలో ఈక్విటీ, డెట్ రూపంలో రూ.3900 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ సిద్ధమైంది. హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, కోకాకోలా, అదానీ విల్మార్ వంటి కంపెనీలకు గట్టిపోటీనిచ్చేందుకు సై అంటోంది. పెట్టుబడి సమీకరణకు RCPL బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. FMCG విభాగంలో ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి. పైగా ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ను రూ.కోటి నుంచి రూ.100 కోట్లకు పెంచుకోవడం గమనార్హం.
చదువుకు కుటుంబ ఆర్థిక స్థితిని సైతం మార్చేసే శక్తి ఉంది. అలాంటి చదువు నేర్పించే గురువుకు విద్యార్థి జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తుంటారు. మనం గొప్పవాళ్లమైతే బంధువులైనా ఈర్ష్య పడతారేమో కానీ గురువు మాత్రం తన విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరినందుకు గర్వపడతారు. ఉన్నత పదవులు, ఉద్యోగాల్లో ఉన్నవారు గతంలో గురువు చేత చివాట్లు తిన్నవాళ్లే.
Sorry, no posts matched your criteria.