India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. 18-45 ఏళ్ల మహిళలకు 45-60 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా.. వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కానుంది.

తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రగడ మరింతగా ముదురుతోంది. తాజాగా బీజేపీ నేత, నటి రంజనా నాచియార్ ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విద్యార్థులపై బలవంతంగా మూడు భాషలను రుద్దడం అనేది చాలా తప్పని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తమ రాష్ట్రంలో అమలు చేయమని సీఎం స్టాలిన్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

న్యూఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.18 కోట్ల లోన్ విషయంలో మోసానికి పాల్పడ్డారని కేరళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నటి ప్రీతి జింటా ఖండించారు. పదేళ్ల క్రితమే తాను లోన్ తీసుకొని తిరిగి చెల్లించినట్లు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. తన SM అకౌంట్లను తానే హ్యాండిల్ చేస్తానని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దన్నారు. ఓ రాజకీయ పార్టీ ఇలాంటి ప్రచారం చేయడం షాక్కు గురిచేసిందని చెప్పారు.

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్నకు అమెరికన్ హిందూ, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి థాంక్స్ చెప్పారు. ఓహైయో గవర్నర్ అభ్యర్థిగా ఎండార్స్ చేయడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తామంతా ఆయనకు అండగా ఉంటామని, ఓహైయోను మళ్లీ గొప్పగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘వివేక్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయనెంతో స్పెషల్, యంగ్, స్మార్ట్’ అంటూ ట్రంప్ ట్వీట్ చేయడం తెలిసిందే.

AP: YCP హయాంలో చంద్రబాబు ఇల్లు, TDP ఆఫీసుపై జరిగిన దాడి కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా 20 మందికి ఊరట దక్కింది. అయితే విచారణకు సహకరించాలని, దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. విచారణను 3 ఏళ్లు తాత్సారం చేశారని వ్యాఖ్యానించింది. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని, అధికారం పోయాక కోర్టుకు వచ్చారని ప్రభుత్వం వాదనలు వినిపించింది.

AP: ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జపాన్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 28న ‘దేవర’ రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్కు వెళ్లనున్నారు. ఈక్రమంలో అక్కడి మీడియాతో తారక్ వర్చువల్ ఇంటర్వ్యూలు ప్రారంభించినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

AP: ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి అన్నారు. అందుకే నిన్న జగన్ సభకు వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారని విమర్శించారు. ప్రజలు తనకిచ్చిన బాధ్యతను జగన్ మరిచిపోవడం సరికాదని చురకలు అంటించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. వైసీపీ పాలనలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిందని దుయ్యబట్టారు.

AP: రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశంపై మండలిలో రభస జరిగింది. ‘హోదా ఎందుకు తేవట్లేదు?’ అని YCP సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేకు మద్దతు తెలిపాం. మాపైనే కేంద్రం ఆధారపడినట్లు మేము చెప్పినట్లు వక్రీకరిస్తున్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు.. ఏమైంది.? ఏడాదిలో రూ.13వేల కోట్లు తెచ్చాం. YCP 5ఏళ్లలో ఏం సాధించింది’ అని లోకేశ్ ప్రశ్నించారు.

ల్యాండ్ ఫర్ జాబ్ స్కాములో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 11న కోర్టుకు రావాలని స్పెషల్ జడ్జి విశాల్ గాగ్నే ఆదేశించారు. ఈ హై ప్రొఫైల్ కేసులో లాలూ సహా 78 మందిపై CBI దాఖలు చేసిన తుది ఛార్జిషీటును కోర్టు పరిశీలించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జోన్లలో భూమికి బదులు ఉద్యోగాలిస్తామని అవినీతికి పాల్పడ్డారని CBI ఆరోపిస్తోంది.
Sorry, no posts matched your criteria.