News November 20, 2024

అమెరికాలోని సగం విద్యార్థులు తెలుగోళ్లే..!

image

అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 56 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని హైదరాబాద్‌లోని US కాన్సులేట్ జనరల్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. వీరిలో AP నుంచి 22 శాతం, TG నుంచి 34 శాతం మంది ఉన్నారు. USలో మొత్తం 3.3 లక్షల మంది భారత విద్యార్థులు ఉండగా లక్షన్నరకుపైగా మనవాళ్లే. ప్రస్తుతం రోజుకూ 1,600 వీసాలు జారీ చేస్తున్నారు. అలాగే 8 వేల మంది అమెరికన్లు భారత్‌లో చదువుతున్నారు.

News November 20, 2024

మెడికల్ షాపుల్లో ఈ మందులు కొంటున్నారా?

image

కొందరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఫార్మసీల్లో మందులు కొంటుంటారు. అయితే సరైన అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకుంటే అవి యాంటీబయాటిక్‌లా కాదా అని అడిగి తెలుసుకోండి. ఒకవేళ యాంటీబయాటిక్ కేటగిరీకి చెందినవైతే వద్దని చెప్పండి. యాంటీబయాటిక్ వాడాలనుకుంటే డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది.

News November 20, 2024

సీఎం ప్రతిపాదన.. మీరేమంటారు?

image

APలో రాష్ట్ర రహదారులను హైవేల్లా అభివృద్ధి చేసేలా ఏజెన్సీలకు అవకాశం కల్పించి, టోల్ వసూలు చేయాలన్న CM చంద్రబాబు ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ఆటోలు, బైకులు, ట్రాక్టర్లకు టోల్ ఉండదు. ఇప్పటికే నేషనల్ హైవేలపై టోల్ పేరుతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని, దీనిపై పునరాలోచించాలని కొందరు అంటున్నారు. మరికొందరేమో రోడ్లు బాగుచేసి, రూ.20-30 టోల్ ఫీజు ఉంటే బాగుంటుందంటున్నారు. సీఎం ప్రతిపాదనపై మీ కామెంట్?

News November 20, 2024

రోడ్డు ప్రమాదాలు.. గంటకు 20 మంది మృతి

image

దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. సగటున గంటకు 20 మంది చనిపోయారు. 4.62 లక్షల మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు, గాయాలపాలైన వారి సంఖ్య పెరిగింది. అత్యధికంగా UPలో 23,652 మంది, TNలో 18,347 మంది, MHలో 15,366 మంది చనిపోయారు. అటు అత్యధికంగా TNలో 67,213 ప్రమాదాలు జరిగాయి.

News November 20, 2024

‘ఛార్జీలకు డబ్బులు లేవు.. పోస్టులో పద్మశ్రీ పంపండి’

image

పద్మశ్రీ అవార్డు పొందిన అత్యంత పేదవాడైన ఒడిశాకు చెందిన కవి హాల్ధార్ నాగ్ వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు 2016లో కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. అయితే, ఇది తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చేందుకు ఆయన వద్ద డబ్బులు లేవు. దీంతో ఆయన అవార్డును పోస్టులో పంపాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఆయనకు కేవలం మూడు జతల బట్టలు, ఒక కాడలు లేని కళ్లజోడు, రూ.732 మాత్రమే ఉన్నాయి.

News November 20, 2024

Swiggy Instamartలో మోసపోయిన కస్టమర్!

image

Swiggy Instamartలో 400-600గ్రా. బరువున్నట్లు చూపించిన క్యాలిఫ్లవర్‌ను ఆర్డర్ పెడితే కేవలం 145గ్రాములే డెలివరీ అయిందని ఓ కస్టమర్ రెడ్డిట్‌లో పోస్టు చేశారు. తాను ఆర్డర్ పెట్టిన కూరగాయలన్నీ తక్కువ బరువున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించగా అక్కడా సంతృప్తికరమైన స్పందన రాలేదని వాపోయారు. ఫుల్ రిఫండ్‌కు బదులు ₹89 ఇస్తామని చూపించిందన్నారు. దీంతో Instamartలో ఆర్డర్లు పెట్టేవారు అలర్టయ్యారు.

News November 20, 2024

గ్యాంగ్ రేప్.. వెలుగులోకి కీలక విషయాలు

image

AP: విశాఖలో విద్యార్థినిపై <<14652198>>అత్యాచారం <<>>కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి దగ్గరైన ప్రియుడే ఆమెను వంచించాడు. వీరు ఏకాంతంగా గడిపిన వీడియోను చూపించి అతడి స్నేహితులు సైతం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాతా తమ కోరిక తీర్చాలని వారు వేధించడం, ప్రియుడు సైతం ఫ్రెండ్స్ కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. తండ్రి కాపాడి ప్రశ్నించడంతో విషయం బయటకొచ్చింది.

News November 20, 2024

మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

image

TG: మహిళా సంఘాలకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏడాదిలో రూ.25వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు నిన్న వరంగల్ సభలో వెల్లడించారు. ఈ రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు.

News November 20, 2024

APలో మందుబాబులకు మరో శుభవార్త

image

AP: జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ‘రూ.99 మద్యానికి మంచి ఆదరణ వస్తోంది. ఇప్పటివరకు 5లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయి. పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాయి. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని, ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయి’ అని మంత్రి చెప్పారు.

News November 20, 2024

Elections: వీరి ఆస్తులు రూ.2వేలే!

image

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు అజయ్ భోజ్‌రాజ్, విజయ్ మనోహర్, అల్తాఫ్ సయ్యద్ తమ ఆస్తులు కేవలం రూ.2,000 అని అఫిడవిట్లో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పేద అభ్యర్థులుగా నిలిచారు. పరాగ్ షా(BJP) రూ.3,383 కోట్లతో రిచ్ కాండిడేట్‌గా ఉన్నారు. నిరక్షరాస్యులు 10, 5వ తరగతి 85, 8th 214, టెన్త్ 313, ఇంటర్ చదివిన వారు 422 మంది ఉన్నారు. PS: HT