India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. MLC ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులివ్వనుంది. దీంతో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని లక్ష మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం రిటైర్మెంట్ తర్వాత కార్యకర్తలకు ఇస్తున్న ₹లక్ష మొత్తం సగటున ₹1.55 లక్షలకు పెరగనుంది. సర్వీసును బట్టి కొందరికి ₹2-2.5L అందనుంది. ఆయాలకు ఇచ్చే ₹40K సగటున ₹65-75Kకు చేరనుంది.

పెద్ద రాష్ట్రాల తలసరి ఆదాయంలో రూ.3,12,522తో TG దేశంలోనే టాప్లో ఉందని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్(2023-24) నివేదిక తెలిపింది. 1.5కోట్ల మంది ఉపాధి పొందుతుండగా 51% మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో, 12% తయారీ రంగంలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో IT, రియల్ ఎస్టేట్, సేవల రంగాలు 24.4శాతంతో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పింది. జిల్లాల వారీగా రూ.9.54 లక్షలతో RR టాప్లో ఉంది.

అసాంక్రమిక వ్యాధులను(NCD) అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ఎల్లుండి నుంచి మార్చి 31 వరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఉచితంగా NCD టెస్టులు చేయాలని ఆదేశించింది. 30 ఏళ్లు పైబడిన వారందరికీ BP, షుగర్తోపాటు క్యాన్సర్ పరీక్షలు చేయాలంది. ఈ వివరాలను NCD పోర్టల్లో అప్లోడ్ చేయాలంది. APR నుంచి వారంలో 2 రోజులు ఇళ్ల వద్దకే వెళ్లి టెస్టులు చేయాలని సూచించింది.

<<15496614>>జ్ఞానేశ్ కుమార్ను<<>> భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కేంద్రం ప్రకటించింది. అయితే అంతకుముందు ఈ ఎంపికను <<15494229>>కాంగ్రెస్<<>> వ్యతిరేకించింది. ప్రతిసారి PM నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సీఈసీని ఎంపిక చేస్తుంది. ఇందులో CJI, లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే 2023లో ఈ కమిటీ నుంచి CJIని తొలగించిన కేంద్రం PM సూచించిన కేంద్రమంత్రిని అందులో చేర్చింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఇక ఆనవాయితీ ప్రకారం ఎన్నికల సంఘంలో మోస్ట్ సీనియర్ను తదుపరి CECగా ఎన్నుకుంటూ వచ్చేవారు. ఆ విధానాన్నీ కేంద్రం పక్కనపెట్టడంతో విపక్షాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈనెల 19 లేదా 22న దానిపై విచారణ జరిగే అవకాశముంది. SC తీర్పు తర్వాతే CEC ఎంపిక చేపట్టాలని INC డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని నిన్న PM నివాసంలో జరిగిన సమావేశంలోనూ LoP రాహుల్ గాంధీ లేవనెత్తారు. కానీ కేంద్రం నిన్న అర్ధరాత్రి CECని ప్రకటించేసింది.

AP: దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. పలువురికి డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై సమాచారం సేకరించాలన్నారు. అటు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని ఏజెన్సీలను, అధికారులను సీఎం ఆదేశించారు.

మధ్యప్రదేశ్లో ఉండే ఓంకారేశ్వర క్షేత్రం నర్మదా నదిఒడ్డున ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో <<15487669>>నాల్గవది<<>>. స్థలపురాణం ప్రకారం.. పూర్వం వింధ్య పర్వతుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతారు. అప్పుడు పర్వతరాజు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉండేలా వరం కోరుతారు. దీంతో పరమేశ్వరుడు పార్థివాకారంలో అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అనే రెండు రూపాల్లో ఇక్కడ వెలిశారు. ఈ రెండు లింగరూపాలను ఒకే జ్యోతిర్లింగంగా భావిస్తారు.

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల భారీ విరాళం అందింది. ముంబైలోని ప్రసీద్ యూనో ఫ్యామిలీ ట్రస్ట్కు చెందిన తుషార్ కుమార్ డొనేషన్ డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. ఈ సందర్భంగా తుషార్ను వెంకయ్య సన్మానించి, అభినందించారు.

AP: నంద్యాల(D) శ్రీశైలం క్షేత్రంలో రేపటి నుంచి MAR 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. రేపు ఉ.9గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, రథోత్సవం, రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 23న స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున CM CBN పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

తెలంగాణలోని ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోని 40శాతం విద్యార్థులకు కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు లేవని గురుకుల సొసైటీ గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 75శాతం సీట్లు ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు సమర్పించలేదని తేలింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంట్రన్స్ పరీక్షల నుంచే ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా అర్హులకే న్యాయం జరుగుతుందని అంచనా వేస్తోంది.
Sorry, no posts matched your criteria.