News November 20, 2024

కెనడాలోని విదేశీ విద్యార్థులకు శుభవార్త

image

కెనడాలో చదువుకునే భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు క్యాంపస్ వెలుపల వారంలో 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటును 24 గంటలకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు చదువును కొనసాగిస్తూనే పార్ట్‌టైం ఉద్యోగాలు మరో 4 గంటలు ఎక్కువ చేసుకోవచ్చు. అయితే పని గంటలు పెరగడం చదువుపై ప్రభావం చూపిస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

News November 20, 2024

48 గంటల్లోపే అకౌంట్లో డబ్బులు: మంత్రి

image

AP: ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు రూ.418 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో, ప.గో, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 1.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోపే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. రైతులు ఎప్పుడు, ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవచ్చని సూచించారు.

News November 20, 2024

మహారాష్ట్రలోనూ ఓటేయనున్న రాష్ట్ర ఓటర్లు

image

TG: రాష్ట్రంలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలకు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. పరందోళి, గౌరి, పద్మావతి, ముక్దంగూడ, బోటాపటార్, ఇసాపూర్, లెండిగూడ, ఇందిరానగర్, శంకర్ లొద్ది, మహారాజ్ గూడ, అంతాపూర్ ప్రజలకు రాజురా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఈ గ్రామాల్లో 3 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న కెరమెరి మండలం ఎప్పటి నుంచో వివాదంలో ఉంది.

News November 20, 2024

వారికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ: మంత్రి సవిత

image

AP: రాష్ట్రంలో మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్లు, చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని మంత్రి సవిత తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్, 5% GST రీయింబర్స్‌మెంట్ కల్పిస్తామని చెప్పారు. ‘కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు ఏర్పాటు చేస్తాం. ఇందుకు స్థానిక MPలు రూ.కోటి చొప్పున నిధులు కేటాయించారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ కోసం విదేశాల్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తాం’ అని ఆమె తెలిపారు.

News November 20, 2024

చివరి మ్యాచ్ ఆడేసిన రఫెల్ నాదల్

image

స్పానిష్ ప్లేయర్ రఫెల్ నాదల్ టెన్నిస్ కెరీర్‌కు తెరపడింది. డేవిస్ కప్ తర్వాత తాను రిటైర్ కానున్నట్లు ఆయన గతంలోనే ప్రకటించారు. తాజాగా జరిగిన డేవిస్ కప్ QFలో స్పెయిన్ ఓడిపోవడంతో ఆటగాడిగా ఆయన ప్రయాణం ముగిసింది. చివరగా నెదర్లాండ్స్ ప్లేయర్ జాండ్‌షల్ప్‌తో జరిగిన సింగిల్స్ మ్యాచులో 4-6, 4-6 తేడాతో ఆయన ఓడారు. మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యారు. నాదల్ తన కెరీర్‌లో మొత్తం 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచారు.

News November 20, 2024

మతిమరుపు ఉంటేనే పని ఇస్తారు

image

ఇదేంటి అనుకుంటున్నారా? జపాన్‌లోని టోక్యోలో ఉండే ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’లో మతిమరుపు ఉన్నవారిని సర్వర్లుగా నియమిస్తారు. వీరిలో ఒంటరితనం తగ్గించడానికి, చురుగ్గా మార్చేందుకు ఇలా చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కేఫ్‌లో ఆర్డర్‌లు తప్పుగా వచ్చినా కస్టమర్లు ఆనందంగా స్వీకరిస్తుంటారు. 2017లో శిరు ఒగుని అనే వ్యక్తి దీనిని ప్రారంభించగా ఆదరణ పెరగడంతో ఇలాంటివి 8వేల కేఫ్‌ల వరకూ పెరిగాయి.

News November 20, 2024

స్కూల్ విద్యార్థులకు శుభవార్త

image

దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరోసారి పెంచారు. నవంబర్ 26వ తేదీ వరకు విద్యార్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జెండర్, కేటగిరీ, ఏరియా(రూరల్/అర్బన్), డిజెబిలిటీ, పరీక్ష మాధ్యమం ఫీల్డ్స్‌లో దరఖాస్తుల సవరణ అవకాశం నవంబర్ 26 తర్వాత రెండు రోజులు తెరిచి ఉంటుంది. ఏపీలో 15, TGలో 9 JNVలు ఉండగా, ఫిబ్రవరి 8న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

News November 20, 2024

‘కీ’లో తప్పులపై ఆధారాలు ఇవ్వండి: హైకోర్టు

image

AP: పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష తుది కీలో తప్పులపై ఆధారాలు ఇవ్వాలని అభ్యర్థులను హైకోర్టు ఆదేశించింది. కీలో 7 ప్రశ్నలకు తప్పుడు జవాబులున్నాయని, వాటిని పున:పరిశీలించి మళ్లీ కీ విడుదల చేయాలన్న అభ్యర్థుల పిటిషన్‌పై న్యాయస్థానం మరోసారి విచారించింది. తప్పులను నిర్ధారించే ఆధారాలు, పుస్తకాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది.

News November 20, 2024

ప్రభుత్వం విజయోత్సవాలు.. మీకందాయా పథకాలు?

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న సందర్భంగా విజయోత్సవాలు చేస్తోంది. అయితే 6 గ్యారంటీల్లో ఫ్రీబస్, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్, రుణమాఫీ, ఉద్యోగాలు అమలవుతున్నా, మిగతావి ప్రజలకు అందలేదు. ఏడాది గడుస్తున్నా ఒక్క ‘ఇందిరమ్మ ఇల్లు’ కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలూ ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ విజయోత్సవాలపై మీ అభిప్రాయం ఏంటి? పథకాల్లో మీకెన్ని అందాయి? కామెంట్ చేయండి.

News November 20, 2024

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు అమరావతిలోని సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ నెల 18నే మంత్రివర్గం సమావేశం కావాల్సి ఉండగా సీఎం సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణంతో వాయిదా పడింది. ఆ రోజు జరగాల్సిన అన్ని కార్యక్రమాలను సీఎం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.