India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి మే నెల కోటా టికెట్లు ఈ నెల 21న విడుదలవుతాయని టీటీడీ ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోసం రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది. అలాగే ఈ నెల 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

టీమ్ఇండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ధన శ్రీ వర్మ జంట త్వరలోనే తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ డివోర్స్ తీసుకోనున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. విడాకుల తర్వాత భరణం కింద చాహల్ తన భార్యకు రూ.60 కోట్లు ఇవ్వనున్నట్లు మరో వార్త చక్కర్లు కొడుతోంది. కాగా, విడాకులపై ఇరువురి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

విపరీతమైన వాంతులతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడికి యూట్యూబ్లో వీడియోలు చూసి చికిత్స చేశారు బిహార్లోని పట్నాకు చెందిన ఓ వైద్యుడు. దీంతో రోగి ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందారు. రోగి మరణానికి కారణం వైద్యుడి అసమర్థతేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ దాడికి దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎంత మందిలో ఉన్నా ఓ వ్యక్తి పర్ఫ్యూమ్ వాడితే అతను మరింత స్పెషల్ అయిపోతాడు. కొందరు స్నానం చేయలేక పర్ఫ్యూమ్ వాడితే, మరికొందరు ఫ్రెష్గా కనిపించేందుకు దీనిని వేసుకుంటుంటారు. అలాంటి పర్ఫ్యూమ్కూ ఓ రోజు ఉందనే విషయం మీకు తెలుసా? నేడు వరల్డ్ పర్ఫ్యూమ్ డే. సైకాలజీ ప్రకారం మనిషి వాడే ఫ్రాగ్రన్స్ను బట్టి అతనెలాంటి వారో చెప్పొచ్చంటారు. వీటి సువాసనలు భావోద్వేగాలు, జ్ఞాపకాలను రేకెత్తిస్తాయంటారు.

AP: జీబీఎస్ అంటువ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. ఎవరైనా తిమ్మిర్లు, నడవలేని స్థితిలో ఉంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని ఆయన సూచించారు. ‘జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నాం. రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. అన్ని జీజీహెచ్ల్లో ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

TG: ఐదేళ్ల పాటు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ, ఏదో ఒక రోజు తెలంగాణకు BCనే సీఎం అవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బీసీ సీఎం అయ్యే అవకాశం కాంగ్రెస్లో తప్ప వేరే పార్టీలో లేదు. వచ్చే ఎన్నికలు బీసీల చుట్టే తిరుగుతాయి. త్వరలో రాష్ట్రంలో చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఉంటుంది’ అని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు.

విశ్వక్సేన్ ‘లైలా’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. వాలంటైన్స్ డే సందర్భంగా FEB 14న రిలీజైన ఈ మూవీ 4వ రోజైన ఇవాళ తొలి రెండు షోల్లో కేవలం రూ.7లక్షల కలెక్షన్లే రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తొలి రోజు రూ.కోటి 40 లక్షలు వసూలు చేయగా 2వ రోజు రూ.60లక్షలు, 3వ రోజు రూ.65 లక్షలు సాధించింది. ఓవరాల్గా 4 రోజుల్లో రూ.2.72 కోట్లు వసూలు చేసింది. ‘లైలా’ బడ్జెట్ రూ.40Cr అని మేకర్స్ తెలిపారు.

అమెరికాకు వెళ్లే అడ్డదారి డంకీ రూట్ అనుభవాలను అక్రమ వలసదారుడు మన్దీప్ సింగ్ పంచుకున్నారు. ‘లీగల్గా అమెరికా తీసుకెళ్తానంటూ ఓ ఏజెంట్ రూ.40 లక్షలు, సబ్ ఏజెంట్ రూ.20 లక్షలు తీసుకున్నారు. 7 దేశాలగుండా 13 రోజులు నా ప్రయాణం జరిగింది. దారి మధ్యలో భయంకరమైన పాములు, మొసళ్లు, 12 నదులు దాటుకుంటూ వెళ్లాం. నేను సిక్కునని ఎవరూ గుర్తుపట్టకుండా గడ్డం తీసేశారు. రోటీలు, నూడిల్స్ తింటూ నడిచాం’ అని చెప్పుకొచ్చారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీ ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం HYD లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ ఏర్పాటుచేసిన భారీ సెట్లో 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుత షెడ్యూల్ మార్చి చివరి వారం వరకూ కొనసాగనుందని వెల్లడించాయి.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, సుఖశాంతులతో చిరకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. మరోవైపు పలు పార్టీల నేతలు, బీఆర్ఎస్ నాయకులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పలుచోట్ల కేక్ కట్ చేసి సంబరాలు కూడా నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.