News February 17, 2025

గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తులు ప్రారంభం

image

AP: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26కు ఇంటర్ ప్రవేశాలకు <>దరఖాస్తులు<<>> మొదలయ్యాయి. మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. బాలురకు 1,340, బాలికలకు 1,340 సీట్లు భర్తీ చేస్తారు. టెన్త్ పాసైన, ఈ ఏడాది పరీక్షలు రాయబోతున్నవారు అర్హులు. 31-8-2025 నాటికి వయసు 17 ఏళ్లకు మించరాదు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉండాలి. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

News February 17, 2025

కేసీఆర్‌కు కేటీఆర్, హరీశ్ రావు బర్త్ డే విషెస్

image

TG: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు పార్టీ నేతలు, అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నాన్న తెలంగాణ హీరో కావడం తన అదృష్టమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ సాధించినవాటిలో కొంతైనా చేరుకోవాలన్నది తన ఆశ అని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం KCR అని హరీశ్ రావు ట్వీట్ చేశారు. తనకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి, చరితార్థుణ్ణి చేశారని పేర్కొన్నారు.

News February 17, 2025

‘మహా’ కన్ఫ్యూజన్!

image

మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడీ(MVA), BJP నేతృత్వంలోని మహాయుతి రెండు కూటములుగా ఉన్నాయి. కానీ MVA నేతలు తరచూ CM ఫడణవీస్‌తో సమావేశమవుతున్నారు. అటు శరద్ పవార్ మాజీ సీఎం షిండేను పొగుడుతున్నారు. ఇటు శివసేన(షిండే) పలు కారణాలతో మిత్రపక్షం BJPపై ఆగ్రహంగా ఉంది. మొత్తంగా ఎవరు ఎవరికి మిత్రులవుతున్నారో, ఎవరు ఎవరితో కలుస్తున్నారో అంతా గందరగోళంగా మారింది.

News February 17, 2025

APPLY NOW: భారీ జీతంతో 1,000 ఉద్యోగాలు

image

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 60% మార్కులతో డిగ్రీ పాసై, 20-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ నెలకు రూ.48,480-రూ.85,920 ఉంటుంది. వెబ్‌సైట్: <>https://www.centralbankofindia.co.in/<<>>

News February 17, 2025

గాజాలో నరకానికి తలుపులు తెరుస్తాం: నెతన్యాహు అల్టిమేటం

image

హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అల్టిమేటం జారీ చేశారు. వారి వద్ద బందీలుగా ఉన్న తమ దేశ పౌరుల్ని వెంటనే విడుదల చేయకపోతే గాజాలో నరకానికి తలుపులు తెరుస్తామని హెచ్చరించారు. ‘అమెరికాతో కలిసి మేం ఓ వ్యూహం రూపొందించాం. అది బయటికి చెప్పలేను కానీ మా పౌరుల్ని హమాస్ వదలకపోతే వారికి నరకద్వారాల్ని తెరవడం ఖాయం. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని, రాజకీయ పాలనను గాజా నుంచి తుడిచిపెట్టేస్తాం’ అని తేల్చిచెప్పారు.

News February 17, 2025

ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీలో సమ్మె!

image

TG: తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమ్మెకు దిగాలని TGSRTC కార్మిక సంఘాలు నిర్ణయించాయి. గత నెలలో <<15281267>>ఓ సమ్మె నోటీసు<<>> ఇవ్వగా, MLC ఎన్నికల కారణంగా యాజమాన్యంతో చర్చలు వాయిదా పడ్డాయి. కోడ్ ముగిసే వరకు గడువు ఇచ్చిన కార్మికులు త్వరలో మరో నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నారు. తొలుత ఐదారు రోజులు సమ్మె చేసి, తర్వాత నిరవధిక సమ్మెకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే సమ్మెపై సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం.

News February 17, 2025

గద్దర్ అవార్డుల కోసం రూ.10 కోట్లు?

image

TG: గద్దర్ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.10 కోట్లు ప్రతిపాదించినట్లు సమాచారం. బడ్జెట్ తయారుచేసేందుకు గాను అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సమాచార శాఖ, సినీ అభివృద్ధి సంస్థలతో బడ్జెట్ కేటాయింపులపై ఆయన సమీక్షించినట్లు తెలుస్తోంది. నంది అవార్డులను ఇకపై గద్దర్ పేరిట ఇస్తామని సీఎం రేవంత్ గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే.

News February 17, 2025

ఢిల్లీలో భూకంపం

image

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో భయాందోళనలకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణనష్టమేమీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

News February 17, 2025

ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

image

TG: సూర్యాపేట(D) చివ్వెంల(M)లోని పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర నిన్న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు హాలిడే ఇవ్వాలని ఆదేశించారు. మేడారం తర్వాత అతిపెద్దదిగా పెద్దగట్టు జాతర పేరుగాంచింది. దాదాపు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

News February 17, 2025

నేటి నుంచి ANMల సమ్మెబాట

image

TG: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రంలోని 3,422 మంది సెకండ్ ఏఎన్ఎమ్‌లు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. 636 PHCలు, 235 UPHCలలోని సిబ్బంది విధులను బహిష్కరించనున్నారు. తమను ఫస్ట్ ఏఎన్‌ఎంలుగా పర్మినెంట్ చేయాలని, 100 శాతం గ్రాస్ శాలరీ, రూ.10 లక్షల హెల్త్, లైఫ్ బీమాను వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. గత నెల 27వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చామని చెబుతున్నారు.